September 2022
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

   పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

             


                           పెద్దపల్లి:అక్టోబర్:1:22:రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో సివిల్,ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్,హోంగార్డ్  సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు,ఈ పరేడ్ కి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.,(ఐజీ)హాజరై  వందనం  స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్,లాఠీ డ్రిల్,ట్రాఫిక్ డ్రిల్ ల ప్రదర్శనని పరిశీలించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడారు..వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి,ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు,సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని,మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది.ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.వీక్లీ పరేడ్ లలో ఏదైనా సమస్యలు ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని.చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు





.పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు.క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని,సిబ్బందికి చేయవలసిన విధులు,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది.ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న,డ్యూటీల వద్ద సమస్య ఉన్న,ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు.చెడు వ్యసనాలకు,చెడు స్నేహాలకు అలవాటు పడి,విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే,పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని,మంచి క్రమ శిక్షణ కలిగియుండి సమయపాలన పాటించాలి అని తెలిపారు.ప్రతి ఒక్కరూ యూనిఫామ్ నిట్ టర్న్ ట్ కలిగి ఉండాలని సూచించారు.రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఇపరేడ్ లో డీసీపీ పెద్దపల్లి సిహేచ్ రూపేష్ ఐపిఎస్,ఏసీపీ గోదావరిఖని గిరి ప్రసాద్,ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు,గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ లు ప్రసాద్ రావు,గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్,ఆఫ్జాలుద్దీన్,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ఆర్ఐలు మధుకర్,శ్రీధర్,విష్ణు ప్రసాద్ మరియు ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ లు ,సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


చౌటుప్పల్  టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 




యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

మండల కేంద్రంలోని శ్వేత ప్రియాంక హాస్పిటల్లో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బోయిని జ్యోతి కి ప్రసవం చేయడంలో

ఆలస్యం అవ్వడంతో బాబు కడుపులోనే మృతి చెందడంటూ బంధువులు శుక్రవారం ఆందోళ నమయాంక హాస్పిటల్

చేశారు. బంధువుల పట్ల, విలేకరుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న డాక్టర్ శ్వేతా ప్రియాంకపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీ లోని బజరంగ్ యూత్, హిందూ వాహిని ,ఆధ్వర్యంలో *బోనాల మహోత్సవం త్రిశూల్ యూత్ ,నుండి మేడిపల్లి సెంటర్ వరకు ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించి, అక్కడినుండి వాయిద్యాల నడుమ పోతరాజుల విన్యాసాలతో బయలుదేరి భవాని యూత్ ,త్రిష యూత్, బజరంగ్ యూత్ వారు నెలకొల్పిన అమ్మవార్లకు భక్తితో భక్తులు బోనాలు ఎత్తుకున్న వచ్చిన బోనాలను నైవేద్యం గ సమర్పించరు ఇందులో కాలనీవాసులు భవాని దీక్ష పరులు పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిర్వాహకులు తెలియజేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి మండపంలో ప్రత్యేకంగా పల్లకి


సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ ను ఆహ్వానించిన ఎన్ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా మనాలి రాజ్ ఠాకూర్  అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రామగుండం నియోజకవర్గ ప్రజల సుభిక్షంగా ఉండాలని రాబోయే రోజుల్లో  రాజ్ ఠాకూర్ ను గెలిచే విధంగా అమ్మవారి శక్తిని అందించాలని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కమిటీ సభ్యులు శాలువాలతో పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఆలయ మండల ప్రధాన అర్చకులు నాగేంద్ర శర్మగారు రెండు మండలాల కోఆర్డినేటర్ గాదె సుధాకర్ కమిటీ సభ్యులు గట్టు విజయ్ కుమార్ వంశీ గారు సీనియర్ నాయకులు కోట రాజనర్స్ కమిటీ సభ్యులు కోట భానుచందర్ గట్టు రవితేజ గట్టు చంద్రయ్య పైడిపల్లి సాయికృష్ణ అధిక సంఖ్యలో మహిళలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

I



జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన యూనిఫాములను 16 మంది ఆశా కార్యకర్తలకు నేటి శుక్రవారం రోజున స్థానిక సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత,ఎంపీటీసీ రేవెల్లి మమత చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజు,హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ స్వామి,హెల్త్ సూపర్వైజర్ సమ్మక్క, అసిస్టెంట్ రాజ రమణయ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ నవీన్,నాలుగు సబ్ సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశలు,మక్బుల్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

అక్టోబర్ 1 న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరంగల్ పర్యటన చేయనున్నారు. 

పర్యటనలో భాగంగా సిఎం కేసిఆర్ శనివారం ఉదయం  9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.

ఉ 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులో ఉన్న ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు.

తరవాత ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వరంగల్ నుంచి మధ్యాహ్నం  2 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;ET

వరంగల్ 27వ డివిజన్ పాత గ్రైన్ మార్కెట్ లో గల ప్రభుత్వ ఆయుర్వేద బోధన వైద్య కళాశాలలో మహిళలు,పురుషుల సౌకర్యార్థం  వేరు వేరు గా ఏర్పాటు చేసిన  80 పడకల విభాగాలను,ఆర్.ఓ.ప్లాంట్ ను  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఎంపి పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండుసుధారాణి,కలెక్టర్ గోపి, చైర్మన్ డా.హరిరమాదేవి, కార్పోరేటర్ చింతాకుల అనీల్, ముఖ్య నాయకులు ఉన్నారు. అనంతరం వారు చికిత్స పొందుతున్న వారితో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్బుత ప్రగతి సాధిస్తుందన్నారు. వరంగల్ జిల్లా ను ప్రగతి పథంలో నడిపించడం కోసం కావలసిన అన్ని సదుపాయాలపై స్థానిక జిల్లా పాలనాధికారి వారితో వివిధ సమావేశాల ద్వారా సంప్రదించుకుని స్థానిక కార్పొరేటర్లు. జిల్లా అధికారులను ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. గురువారం  వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ కు వసతులను ప్రారంభించనున్నామని  చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో పెనుమార్పును చూస్తున్నామన్నారు.వరంగల్ మెడికల్ హబ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1100 కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం,బస్తీ దవాఖాల ఏర్పాటు పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నారన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామం లో గల ప్రతిష్ట కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేతన ఒప్పందం చేయాలని కోరుతూ ప్రతిష్ట
స్టాఫ్,వర్కర్స్ యూనియన్ సిఐటియు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై నిలబడినిరసన తెలియజేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న రెండు సంవత్సరాల బోనస్ పెండింగ్
వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతిష్ట కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, సంవత్సర కాలంగా పెండింగ్ లో పెట్టిన వేతన ఒప్పందం వెంటనే చేయాలని నినాదాలు చేస్తూ మోకాళ్లపై నిలబడి సమ్మె కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం దూసరి వెంకటేశం సత్యనారాయణ, బిక్షపతి, బుచ్చమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day



మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి నాయకుడు కౌశిక హరి తలపెట్టిన ఎమ్మార్వో కలెక్టర్ గార్ల చేత అర్హులైన నిరుపేద దళితులకు దళిత బంధు పథకం ప్రక్రియ నిర్వహించాలని రామగుండం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి సీనియర్ నాయకుడు కౌశిక హరి  మాట్లాడుతూ దళిత బంధు కేవలం టిఆర్ఎస్ బందుగా మారిపోయిందని ఇది ఎమ్మెల్యే ఇష్టం ఉన్నవారికి ఇచ్చుకోవడానికి ఇదేమి కెసిఆర్ సొంత ఖజానా కాదు అని రాష్ట్రంలో ప్రజల యొక్క సంపాదనని కాబట్టి దీనికి దళితులు అందరూ అర్హులని కేవలం ప్రజాప్రతినిధుల బంధువులకు మాత్రమే టిఆర్ఎస్ తొత్తులకు మాత్రమే ఈ యొక్క దళిత బంధు వర్తించడం సబబు కాదని ఆయన అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులచే నిర్ణయించబడాలని అసలైన అర్హులను గుర్తించి దళిత బంధు ప్రకటించాలని అవసరమైతే ఆ తర్వాత కార్లు బంగాళాలు ఉన్న ధనికులకు కూడా ఇచ్చుకొని అని ఆయన ఈ సందర్భంగా వారు  రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున్  మహిళా నాయకురాలు 22 డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత  రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్  రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధి సుల్వ లక్ష్మీ నరసయ్య  బిజెపి సీనియర్ నాయకులు మహవాది రామన్న  ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు కొండపర్తి సంజీవ్ నరహరి  పున్నం శశి కుమార్  నిమ్మరాజుల రవి  గోపగాని నవీన్ గౌడ్  మేకల శ్రీనివాస్ బిబ్బెర తిరుపతి దారంగుల కుమార్ శివరామకృష్ణ షాడవేణి రాజు గడపురం కళ్యాణ్, గాలేంకి ప్రసాద్, ఉప్పుసాయి బోనగిరి కుమార్ పులి శ్రీనివాస్  వంశీ జరుపుల శ్రీనివాస్ శెట్టి రాజశేఖర్ పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం నియోజకవర్గంలో  ఒక దళిత కళాకారుడు తన అభిమాన నాయకుడి మీద ఒక పాట రాసి పాటలు రిలీజ్ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కావల్సుకొని రామగుండం మజీద్ కార్నర్ సెంటర్లో ఈ యొక్క ప్రోగ్రాంను చూసి  ప్రోగ్రాం గురించి తెలుసుకొని కావలసికొని పోలీస్ అధికారుల చేత ప్రోగ్రాం జరగకుండా దానికి సంబంధించిన టెంటును అదేవిధంగా వేదికను సౌండ్ బాక్స్లను అధికారుల చేత తీయించి నియంత పాలనకు తెర లేపారు. రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్  మీద పాట రాస్తేనే ఓరువలేక ఇన్ని రకాల కుట్రలతో వేధింపులకు గురి చేస్తున్నాడు, జరుగుతున్న పరిణామాలను రామగుండం నియోజకవర్గ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు, రాబోవు కాలంలో రామగుండం నియోజకవర్గం ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కన్ సింగ్ ను ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 




అంతర్గామ్ మండల కేంద్రం లొ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లొ మాజీ  ఉమ్మడి రామగుండం  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కూటీ రాజమల్లు యాదవ్ (ARMY )  మాట్లాడుతు.....  రామగుండం నియోజకవర్గం లొని కాంగ్రెస్ పార్టీ నీ డికొనే సత్తా లేక దళిత బందు పేరా ఆశ చూపి కాంగ్రెస్ పార్టీలొ ని కార్యకర్తల ను TRS పార్టీ లోకి తీసుకో వాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదాని అన్నారు మండలం లొ 

కాంగ్రెస్ పార్టీ నీ ఖాళీ చేస్తా అని చెప్పిన రామగుండం mLA కోరికంటి చందర్ రాబోయే ఎన్నికలలొ తెరాస పార్టీ పూర్తిగా ఖాళీ ఐతుంది  అని రాయమల్లు యాదవ్ అన్నారు..

కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం లొ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  నాయకత్వం లొ జెండా ఎగురావే యడం కాయం అని అన్నారు...  ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ ఊరుమెట్ల రాజాలిం గయ్య.. సింగం కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ గుంట బాపు యాదవ్, గో ర్రె చందు, గజ్జల నాగరాజు, ఉప్పలేటి సదానందం, అప్పల రాజందర్, విజయ్, రాకేష్,తదితరులు పాలుగోన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



గోదావరిఖని:- గంగానగర్ ఫ్లైఓవర్   వద్ద బొగ్గు లారీల యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు,ఈ కార్యక్రమం లో *రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 

 లారీ అసోసియేషన్ గత 40 సంవత్సరాల నుండి అడ్రియాలా మైన్స్ లో బొగ్గు లోడింగ్ చేస్తున్న వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,అడ్రియాలా మైన్స్ మాది అని మంథని లారీ అసోసియేషన్ లారీలకు లోడింగ్ అనుమతి ఇచ్చి  *జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమంగా బొగ్గును *తరలిస్తునందున, రామగుండం లారీ అసోసియేషన్ ఓనర్ లు, డ్రైవర్, క్లీనర్లు,వారం రోజుల నుండి ధర్నా చేస్తున్నారని... DCP  అధికారులతో మాట్లాడి అక్కడి లోడింగ్ ని ఆపేసి, రామగుండం లారీ అసోసియేషన్ కి అనుమతి ఇవ్వాలి కోరగా..చర్చల అనంతరం Dcp అధికారులతో మాట్లాడి మంథని లారీల ను ఆపేసి, రామగుండం లారీ లను అనుమతించారు ...

కాగా తమ అసోసియేషన్  కష్టలు తెలుసుకొని తమకు మద్దతు తెలియచేస్తు విజయకేతనం ఎగరవేసిన *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు లారీ అసోసియేషన్ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సన్మానం చేశారు,,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



తెలంగాణ రాష్ట్రం లోని ఆడబిడ్దలకు పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని..

తెలంగాణ ఆడబిడ్దలకు బతుకమ్మ పండుగకు సిఎం కేసీఆర్‌  బతుకమ్మ చీరను కానుకగా అందిస్తున్నరని   రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. మంగళవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలు మండల లోని మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముందుగా ఎంపీపీ కార్యాలయంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ర్ట ప్రజలదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆడపచులకు బతుకమ్మ పండగ సందర్భంగా సిఎం గారు చీరాలు పంపిణీ చెస్తున్నరని అన్నారు. ఈ నెల 30 తేదీన గోదావరిఖని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కన్నుల పండగగా కోలాట బతుకమ్మ 2020 సంబురాలను నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ కోలాటం బతుకమ్మ సంబురాల్లో ఉత్తమ కోలాట బృందానికి మెదటి బహుమతిగా 44 వేలు 2 వ బహుమతిగా 21 వేలు మూడవ బహుమతిగా 11 వేల అందించడఁ జరుగుతుందని, కోలాట బతుకమ్మ సంబురాల్లో పాల్గొనే కోలాట బృందాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1 రూపాయు చెల్లించి తమ గ్రూప్ లను నమోదు చేసుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గం లోని ఆడబిడ్దలంతా ఈ సంబురాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లోజడ్పీటీసి ఆముల నారాయణ ఎంపీపీ దుర్గం విజయ తహశీల్దార్ వేణుగోపాల్ ఎంపిడిఓ యాదగిరి మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

అంతర్గాం మండల్ రాయదండి గ్రామంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఆధ్వర్యంలో అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి ఆముల నారాయణ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయంగా బతుకమ్మ పండుగకు ప్రపంచంలోనే గుర్తింపు ఉందని తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమని మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా లేవన్నారు బతుకమ్మ పండుగకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆడపడుచులకు బతుకమ్మ చీర అందించడం పుట్టింటి కట్నం లాంటిదని అన్నారు ఆడపడుచులు బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా జరుపుకోవాలని కోరారు అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఉపసర్పంచ్ తాని పవన్ కుమార్ వార్డు సభ్యులు ధర్మాజీ చంద్రశేఖర్ కొయిలాల శంకర్ గుమ్ముల సదయ్య ప్రసాద్ మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మార్కండేయ కాలనీలోని లక్ష్మీప్రసన్న గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ Sc సెల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ 50 డివిజన్ల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గం లోని ప్రతి దళితునికి దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే దళిత బంధు ఇస్తూ పేద దళిత ప్రజలకు ఇవ్వకుండా కమిషన్ ల మీద నడిపిస్తూ టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడని దళిత బంధు కాదు దగ్గరి బంధు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో Sc, st సబ్ ప్లాన్ టు పెట్టి దేశంలో అనేక సంస్కరణలు పెట్టి SC అభివృద్ధికి పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజ్ ఠాకూర్ అన్నారు,రానున్న ఎన్నికల్లో దళితులందరూ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు,, ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి,మాదారబోయిన రవికుమార్,గట్ల రమేష్,బిసి సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్,యూత్ కాంగ్రెస్ నజీముద్దీన్, హరి ప్రసాద్, దాసరి విజయ్,పజల్,రంజిత్, తదితరులు పాల్గొన్నారు


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


*తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు మహానేత బహుజన బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనుమా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు*కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమ నేతగా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసి చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన మహానేత అని జలదృశ్యంలో తన ఇంటిని ముందుగా తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన త్యాగశీలి అని కొనియాడారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి ఎం రవికుమార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ ఎస్సీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు యుగేందర్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు నజీముద్దీన్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజీమ్, రెండు మండలాల కోఆర్డినేటర్ గార్డ్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ శ్రీను సాయి సంతోష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



 ఇరువర్గాలతో కూలంకషంగా చర్చించారు. 1. SCCL యొక్క కాంట్రాక్ట్ లేబర్స్ కోసం GOMS 22 అమలుకు సంబంధించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపేందుకు యాజమాన్యం అంగీకరించింది.

అమలు కోసం గెజిట్ నోటిఫికేషన్‌ను వేగవంతం చేయడానికి తెలంగాణ 2.

కాంట్రాక్టర్ల ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు కోవిడ్ కారణంగా మరణించింది.

కోవిడ్-19 కారణంగా మరణించిన కాంట్రాక్టర్ ఉద్యోగులకు తగిన పత్రాలను సమర్పించిన తర్వాత రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కాంట్రాక్టర్ ఉద్యోగులకు వారి ప్రయోజనం కోసం కార్పొరేట్ జీతం ఖాతా బీమా ప్యాకేజీ అంశాన్ని కూడా యాజమాన్యం పరిశీలిస్తోంది. 3. కాంట్రాక్టర్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.

తొలుత కార్పొరేట్ స్థాయిలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. 4. ప్రాఫిట్ షేరింగ్ బోనస్ చెల్లించాలి లేదా 20% బోనస్ చెల్లించాలి.

ఇప్పటికే 8.33% బోనస్‌ను అందజేస్తున్నామని, 8.33% కంటే ఎక్కువ బోనస్‌ను పెంచే అవకాశాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, సభ్యునితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు మేనేజ్‌మెంట్ తెలియజేసింది.

వర్తక సంఘం. కమిటీ 8.33% మరియు అంతకంటే ఎక్కువ బోనస్ పెంపుదల అంశాన్ని అధ్యయనం చేస్తుంది మరియు పొరుగున ఉన్న PSU లో అధ్యయనం నిర్వహించి నివేదికను సమర్పిస్తుంది. అందించాలి.

కాంట్రాక్టర్ల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఔట్ పేషెంట్ సౌకర్యాన్ని అందించడాన్ని పరిశీలించడానికి యాజమాన్యం అంగీకరించింది మరియు అత్యవసర సందర్భాల్లో IP చికిత్స అందించబడుతుంది. అయితే, ఈఎస్‌ఐ పథకం కింద కాంట్రాక్టర్ల ఉద్యోగుల కవరేజీ అంశాన్ని పరిశీలించేందుకు యాజమాన్యం అంగీకరించింది. 6. లారీ డ్రైవర్లు, వోల్వో డ్రైవర్లు, రవాణా డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ వోకర్లు, బొగ్గు శాంప్లింగ్ కార్మికులు, బెల్ట్ క్లీనింగ్ మరియు షేల్ పికింగ్ కోసం సెమీ స్కిల్డ్ కేటగిరీ - అత్యంత నైపుణ్యం కలిగిన లారీ డ్రైవర్లు, వోల్వో డ్రైవర్లు, నైపుణ్యం కలిగిన కేటగిరీకి అనుగుణంగా పని కేటగిరీకి అనుగుణంగా వేతనాలు చెల్లించాలి. బ్లాస్టింగ్ కార్మికులు, వర్క్‌షాప్ కార్మికులు.

డ్రైవర్లకు స్కిల్డ్ కేటగిరీ వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అయినప్పటికీ, మిగిలిన వర్గాలకు, కాంట్రాక్టర్ల ఉద్యోగులు చేసే పని యొక్క ఖచ్చితమైన స్వభావం ఆధారంగా ఉద్యోగాలను వర్గీకరించడానికి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. డ్రైవర్లకు CMPF సౌకర్యాన్ని విస్తరించేందుకు యాజమాన్యం అంగీకరించింది. 7. ఇంకా అమలు చేయని వారికి కనీస వేతనాలు మరియు బోనస్ అమలు చేయాలి అంటే. నర్సరీ ఉద్యోగులు, సులభ ఉద్యోగులు, OB సహాయకులు, వే బ్రిడ్జి లోడింగ్ మరియు అన్‌లోడింగ్ ఉద్యోగులు సోలార్ ప్లాంట్ ఉద్యోగులు మరియు కలప యార్డ్ ఉద్యోగులు.

యాజమాన్యం పరిశీలించి ప్రకారం వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించింది

నర్సరీ కార్మికులకు వ్యవసాయ నోటిఫికేషన్. ఇంకా, EPF / CMPF సౌకర్యాన్ని పరిశీలించాలి మరియు నర్సరీ కార్మికులకు విస్తరించబడుతుంది. కనీస వేతనాల చెల్లింపు, EPF మరియు సభ్యుల ఇతర సౌకర్యాలను సులభ్ కార్మికులకు విస్తరించే వైద్య సదుపాయాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



ప్రియమైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి, గత 18 రోజుల నుండి మన నిర్వహించిన నిరవధిక సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాము. మన పోరాటం వల్ల సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ ఆర్ఎల్సి ఆఫీసులో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించిన అనంతరం రాత్రి 9 గంటలకు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సింగరేణిలో జీవో నెంబర్ 22న అమలు చేసుకొనుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీ&ఎండి గారు లెటర్ ను పెట్టడంతో పాటుగా ఇతర విషయాల పైన అగ్రిమెంట్ అయినది. కావున మన కాంట్రాక్ట్ కార్మికులందరూ మంగళవారం నుండి విధులకు హాజరుకావాలని తెలియజేస్తున్నాం.కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ విధులకు హాజరుకావాలని, డ్యూటీ ల వద్ద మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తక్షణమే ఫోన్ చేసి మన నాయకుల సహాయం తీసుకోవాలని తెలియజేస్తున్నాము, మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హెడ్ ఆఫీస్ వద్ద మన కాంట్రాక్ట్ కార్మికులందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ తప్పక హాజరు కావాలని కోరుతున్నాము. అభినందనలతో

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day



మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టేశ్రీ శుభకృత్ నామ సంవత్సర   అశ్వయుజ శుద్ధ పాడ్యమి   ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీభవాని యూత్  ఆధ్వర్యంలో దుర్గా దేవి  శరన్న నవరాత్రి   ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం వామన శర్మ చే" శ్రీ స్వర్ణకవచాలంకృత" దేవి గా  అలంకరించి   రెండో డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి దంపతులు చే పూజ నిర్వహించారు, ఇందులో భవాని దీక్ష పరులు పాల్గొని మాలలు ధరించరు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అని భవాని యూత్ సభ్యులు తెలియజేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్ పాషా  ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్  ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి చరిత్ర పుటల్లో దీరవనితగా వీరవనితగా పేరుగాంచిన అణగారిన వర్గాల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ అని ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇన్ని రోజులు ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలని కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే ఐలమ్మ వర్ధంతిని వాడుకుంటున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ట్యాంక్బండ్పై ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మురళీకృష్ణ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ NSUU జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి మల్ల దుర్గాప్రసాద్ రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజిం యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ నవీన్ హరి జెకె ఆంజనేయులు జగన్మోహన్రావు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అఫ్జల్ బేగం కొత్తకొండ లక్ష్మి శ్యామల మడ్డి తిరుపతి ఈదునూరి హరిప్రసాద్ గాదే సుధాకర్ దురిశెట్టి శ్యామ్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;



 ప్రజలకు ఉత్తమ పోలీసింగ్  అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగా కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి  పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ  ఆధ్వర్యంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 19 మంది ఫిర్యాదారులు హాజరై సమస్యలను ఎస్పీ కి  తెలియజేసి, అర్జీలను ఇచ్చారు. ఈ సందర్బంగా బాధితుల  సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులు సమస్యలు  చట్ట పరిధిలో పరిష్కరిoచాలని   ఎస్పి  ఆదేశించారు.  అనంతరం  మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహపూర్వకoగా ఉండాలనీ,  శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల  చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఎదురైతే  బాధితులు, ఫిర్యాదు దారులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పి సురేందర్ రెడ్డి  సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day




చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్



డిపోలో ఆర్టీసీ కార్మికులను అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్టీసీకార్మికుల రాష్ట్ర అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజక వర్గం ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు కే.రాజి రెడ్డి చండూరుకు వెళుతున్న సందర్భంగా చౌటుప్పల్లో ఆర్టీసీ కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కే. రాజిరెడ్డి మాట్లాడుతూ మెహదీపట్నం డిపోలో అధికారులు ఒత్తిడికి మరణించిన డ్రైవర్ అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబానికి తన ప్రగండ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి డిపోలో కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వమే కార్మికులను కాపాడుకోవాలని కోరా

రు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం.వి. చారి, నాయకులు ఎస్.ఎం.రెడ్డి, శంకరయ్య, కే. యాదయ్య, యాదయ్య, కే.రామ దాస్,

రవీందర్ రెడ్డి, యాదయ్య, అంజయ్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం  ఎంగిలి పూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని  తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి  మలికాంబ మనోవికస కేంద్రంలోని చిన్నారులతో కలిసి దాస్యం రేవతి వినయ్ భాస్కర్ బతుకమ్మ ఆడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ఉత్సవాలు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన  ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా అందిస్తుందని తెలిపారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ చైర్మన్ కే.రాధాదేవి ఆదేశాల మేరకు ఆదివారం  25 న మల్లికాoబ మనోవికాస కేంద్రంలో వరల్డ్ డెఫ్ డే ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా షేక్ ఆరిఫ్ (రైల్వే జడ్జి) పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షేక్ అరీఫ్ మాట్లాడుతూ " బదిరులు సాధారణ వ్యక్తులలా జీవించడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి అని తెలిపారు. వినికిడి లోపం ఉన్నప్పడికి సమాజంలో అందరితో సమాన గౌరవ మర్యాదలు పొందుతున్నారు మరియు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు కూడా పొందుతున్నారు అని అన్నారు. సంకేత భాష నేర్చుకోవడానికి చెవిటి వారికి శిక్షణ ఇవ్వడం మరియు ప్రజలతో వారి సామాజిక సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బదిరులకు ఆత్మ విశ్వాసాన్ని కలుగజేయాలని కోరారు. తదుపరి ఆశ్రమంలోని పిల్లలు వారి నృత్య ప్రదర్శన తో అలరించారు. మరియు వారికి న్యాయమూర్తి పండ్లు,బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లికాoబ నిర్వాహకులు బండ రామలీల ,బండ సదానంద0,కోడం కళ్యాణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను క్రీడా జ్యోతి ని వెలిగించి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆట ఆటలతో కూడినదే అసలైన చదవని, విద్యా వినోదంతో కూడిందే మంచి విద్య అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వెనుకటికి గురు ముఖ జరిగిన విద్య అభ్యసనం వల్ల ఆనాడు ఆయా విద్యల్లో వారు ఆరితేరారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విద్యావ్యవస్థని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గొప్పగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి చెప్పారు గురుకులాలతో విద్యార్థులకు అన్ని రకాలుగా విద్య అందుతుందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను క్రీడా జ్యోతి ని వెలిగించి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారిణి లతో కలిసి వాలీబాల్, బతుకమ్మ ఆడి సందడి చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏదైనా ఒక రంగంలో రాణించడం గొప్ప వరం అన్నారు. కొందరు ఆటల్లో, మరికొందరు చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. రెండు రంగాల్లో రాణించే వారు చాలా అరదుగా ఉంటారని మంత్రి అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. తన వరకు తాను బాగా ఆటలు ఆడటంతో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లానని చెప్పారు. తర్వాత రాజకీయ రంగాన్ని ఎంచుకొని ఓటమి ఎరుగని నేతగా ఎదిగానని మంత్రి విద్యార్థులకు వివరించారు. రంగం ఏదైనా, ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. 

తెలంగాణ వచ్చిన తర్వాతే, విద్యారంగం బాగా అభివృద్ధి చెందుతున్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 7 వేల కోట్లతో మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని, స్కూల్స్ ని ప్రైవేట్ కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే గురుకులాలను ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా కేజీ నుంచి పీజీ దాకా విద్యను అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రభుత్వ విద్యకు పోటీ పెరిగి, సీట్లు దొరకని పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఇవ్వాళ వివిధ క్రీడల్లో అద్భుత క్రీడాకారులు తయారయ్యారు. ప్రత్యేకించి దళిత, బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు బాగా రాణిస్తున్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారని మంత్రి అన్నారు.

క్రీడా నైపుణ్యాలు ఉన్నవాళ్లకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు, వారికోసం ప్రత్యేకంగా క్రీడా స్కూల్స్, అకాడెమీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు, పరికరాలు సమకూర్చినట్లు మంత్రి వివరించారు. 

కేవలం విద్య క్రీడా రంగాలనే గాక, అభివృద్ధి, సంక్షేమానికి కూడా సీఎం కెసిఆర్ గొప్పగా ఆదరిస్తున్నారని వివరించారు.

ఈ నెల 25,26,27 తేదీల్లో 3 రోజులపాటు క్రీడలు జరుగు తాయి. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భం లోనూ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని 14 గురుకులాలకు చెందిన 1100 మంది విద్యార్థినిలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. కాగా మంత్రి వారిని అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు మంత్రి అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. క్రీడా వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, సోషల్ వెల్ఫేర్ అర్ సి ఓ సూరినేని విద్యా రాణి, అధికారులు, ఆయా గురుకులాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని సమస్యలకు అదే అసలైన మందు, అనారోగ్య కారకాలకు విరుగుడు అని అన్నారు. అజరా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భద్రకాళి బండ్ నుంచి జే ఎన్ ఎస్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నడిచారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి రన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను అనుసరించాలని, డాక్టర్లు చెబుతున్నారు విధంగా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడే దారి నడకే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్ రాజ్, హాస్పిటల్ సిబ్బంది, ఒత్సాహిక యువత పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలోని చెల్పూరు గ్రామంలో బతుకమ్మ చీరలు  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మన సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ,  పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ లో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరలను అందిస్తున్నట్లు మంత్రి  తెలిపారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు, అందుకు గాను 339.73కోట్లు  ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత  ప్రభుత్వాలు ఏనాడు  మహిళల అభ్యున్నతి పై శ్రద్ధ వహించలేదని, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. బతుకమ్మ చీరల తయారీ  వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని మంత్రి  అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 


చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 10వ

వార్డులో నిరుపేద మైనార్టీ కుటుంబానికి చెందిన మహిళ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ దయనీయ స్థితిని స్థానిక వార్డు కౌన్సిలర్ బొడిగే అరుణ బాలకృష్ణ గౌడ్ మునుగోడు మాజీ శాసనసభ్యుడు

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి  10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ రెడ్డి,టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, 10 వ వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్, ఎస్కె కలీల్, చాంద్ పాషా,మల్లేశం,వార్డు ప్రజలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 


:మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. జిల్లాఉపాధ్యక్షులు రమనగోని శంకర్.

రాష్ట్రప్రభుత్వం ఎనిమిదేండ్లుగా మునుగొడుకు చేసిందేమీ లేదని ప్రజలను పట్టించుకోకుండా కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతలేని నిర్మాణాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని అధికారపార్టీకి తగిన బుద్ధిచెప్తారన్నారు.ఓటమి భయంతో మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు

నిర్వహిస్తున్నారని ఎన్నిసమ్మేళనాలునిర్వహించినా ఓటమి తప్పదని హెచ్చరించారు. మునుగోడు ప్రజలు అభివృద్ధి కేవలం బీజేపీ వల్లనే

సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నారని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

ఫంక్షనల్ వర్టికల్ (విభాగం)వారీగా విధి నిర్వహణలో ప్రతిభ - కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి కేపీ (కీ పర్ఫామెన్స్)  ప్రోత్సహకాలు అందించిన అడిషనల్ ఎస్పి .

శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ - కనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బంది ప్రశంస పత్రాలు అందించడం జరిగింది. కీ పర్ఫామెన్స్ రివార్డ్స్ అందుకున్న వారి వివరాలు . స్టేషన్ హౌస్ ఆఫీసర్, సి.హెచ్ శ్రీనివాస్ కాటారం ఎస్ఐ , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బండి రామకృష్ణ, ఎస్సై  భూపాలపల్లి

కోర్టు డ్యూటీ ఆఫీసర్ - ఏ. లావణ్య -WPC, చిట్యాల

 పోలీస్ స్టేషన్

బ్లూ కోల్ట్స్- వి. మహేందర్  పీసీ - టేకుమట్ల పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇంచార్జ్, సి.హెచ్ శ్రీనివాసచార్యులు, హెచ్.సి భూపాలపల్లి, పోలీస్ స్టేషన్,

స్టేషన్ రైటర్స్ కే. రాణి, wpc, కాళేశ్వరం పోలీస్ స్టేషన్, టెక్ టీమ్  ఎస్.కోమల WPC, చిట్యాల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ వర్టికల్ వి.శ్వేత. WPC, భూపాలపల్లి పోలీస్ స్టేషన్. సమన్స్  ఏండి. అఫ్జల్ పాషా, పిసి, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ 

వారెంట్స్  ఎం.సాంబశివ రావు  పీసీ, కాటారం పోలీస్ స్టేషన్ కమ్యూనిటీ పోలీసింగ్ ఏం. రాజయ్య పీసీ, రేగొండ పిఎస్పెట్రో కార్ పి. రతన్ సింగ్ ASI - ఘనపూర్  పిఎస్

 వర్టికల్ లైజనింగ్  పీసి రత్నాకర్, ఐటి కోర్

రిసెప్షన్ వర్టికల్, WPC ఏ. అర్చన, భూపాలపల్లి PS,....  5S వర్టికల్ వి. సౌజన్య WPC, కొయ్యూరు, PS, మొత్తం (15) మంది. పోలీస్ అధికారులకు సిబ్బందికి అందజేయడం జరిగింది. .

ఈ సందర్భంగా అదనపు ఎస్పి  మాట్లాడుతూ జిల్లా  పరిధిలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల (KPI REWARDs) అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు  అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కిషోర్ కుమార్, DCRB ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎన్టిపిసి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు  పెరిగిన డిఏ ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్టర్లు వెంటనే చెల్లించాలని ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ఎన్టిపిసి లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల డిఏ సర్కులర్ విడుదల చేసిందని, దానికి అనుగుణంగా ఎన్టిపిసి యాజమాన్యం డి ఏ ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని కాంట్రాక్టర్లకు, యుపిఎల్ అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

సంబంధిత డిపార్ట్మెంటల్ హెచ్వోడి అధికారులు కూడా డిఎ ఏరియర్స్ డబ్బులు చెల్లించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్లు కార్మికులకు చెల్లించడం లేదని, తెలంగాణలో దసరా పండుగ కార్మిక కుటుంబాలకు చాలా పెద్ద పండుగని, వెంటనే కాంట్రాక్టర్లు ఈనెల 30 తారీఖు లోపల డి ఏ ఏరియర్స్ డబ్బులను చెల్లించాలని, అలాగే గత నెల నిరసన తెలియజేసిన మూడు రోజుల వేతనాలను కూడా చెల్లించాలని, లాఠీ చార్జీలో గాయాలైన కార్మికులకు  వైద్య ఖర్చులు మరియు నష్టపోయిన వేతనాలు చెల్లించాలని, లేనియెడల కార్మికులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జేఏసి కార్మిక సంఘాల  నాయకులు కౌశిక్ హరి, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఆర్ రాజమల్లయ్య,చిలుక శంకర్, బుచ్చన్న, ఈ భూమయ్య, డి సత్యం, ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, టీ శ్రీనివాస్, నాగభూషణం, ఏ శ్రీనివాస్, సిహెచ్ సత్యం, మేకల కొమురయ్య పాల్గొ న్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాటారం నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరిoచిన గడ్డం రాంమోహన్ రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి  జె. సురేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుచగుచ్చం అందించారు. అనంతరం సబ్ పరిధిలోని పరిస్థితి, వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు.ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన  వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని, మహిళా , శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారించాలని ఎస్పి సురేందర్ రెడ్డి  డిఎస్పీకి  సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ 33 వ డివిజన్ పెరుకవాడలో పించన్ల పంపిణి కార్యక్రమంలో భాగంగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపి పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్ రాజుయాదవ్, కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, దిడ్డి కుమారస్వామి, ముఖ్య నాయకులు. పెరకవాడలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పెరుకవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ప్రతీ వాడ నేను తిరిగినవాన్ని, నా బాల్యం మీ మధ్య గడిచింది..నేను మీ మద్య పెరిగిన వాన్ని. అందరూ నన్ను తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా. పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తాం. 4 కోట్ల తో నేడు రోడ్లు అభివృద్ది ప్రారంభిస్తున్నాం. ప్రతీ వీదికి రోడ్లు, కాలువలు నిర్మాణం పూర్తి చేస్తాం. నేను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ది చేసే బాధ్యత నాది.ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. పెరుకవాడ ముంపుకు గురికాకుండా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం.70 కోట్ల పై చిలుకు నిదులతో వరద నీటి తరలింపు స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మిస్తున్నం, పెరుకవాడ అభివృద్ది అద్బుతంగా చేస్తాం. నియోజకవర్గంలో జిల్లా కేంద్రం తీసుకువచ్చాం.తద్వారా భూముల ధరలు పెరిగాయి, అభివృద్ది వేగమై, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. జిల్లాలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి 1100 కోట్లతో నిర్మిస్తున్నాం.నియోజకవర్గంలో అద్బుతమైన రోడ్లు,డ్రైన్స్ నిర్మించాం.60 ఏండ్ల కల అండర్ బ్రిడ్జ్ వెంట్ నిర్మాణం చేపట్టాం. 240 కోట్లతో నియోజకవర్గంలో ముంపు సమస్యను దూరం చేస్తున్నాం.220 కోట్లతో రంగశాయిపేట ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నం.

7 గురుకుల పాఠశాలల్లో పేదల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందజేస్తున్నాం. ఇంటింటికి నల్లా అందజేసాం. మోడల్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం.

 మీ బిడ్డగా నేను సాదించిన ఘనతలు ఇవి. మరెన్నో పనులు చేపడతాం.

వృద్దులను,దివ్యాంగులను,ఒంటరి మహిళలకు ఆసరాగా కొత్త పించన్లను ముఖ్యమంత్రి కేసీఆర్  అందజేస్తున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి పెరుకవాడకు ప్రతీ పేదవారికి సంక్షేమాభివృద్ది ఫలాలు అందిస్తాం.

పేదరికం నుండి ఈ ప్రాంతంలో బ్రతికినవాన్ని మీ అందరి సహాకారంతో కష్టపడి మీ బిడ్డనైన నేను ఈ స్థానంలో ఉన్నాను. మీకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నా.నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని మీ బిడ్డగా అభివృద్ది చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే.టీ.ఆర్  ఆశీర్వాదంతో 3800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నాం.భవిష్యత్ లో మరింత అభివృద్ది చేస్తాం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ ప్రజావాణి కార్యక్రమానికి పన్నెండు దరఖాస్తులు వచ్చాయని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత పేర్కొన్నారు. నాలుగు దరఖాస్తులు వ్యక్తిగత లోన్ ల కోసం, నాలుగు దరఖాస్తులు దివ్యాంగుల పెన్షన్ కోసం, మూడు దరఖాస్తులు మూడు చక్రాల సైకిళ్ల కోసం ఒకటి పోలీస్ రక్షణ కోసం దరఖాస్తులు సమర్పించారని జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలియచేసారు

కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య, ఆర్ అండ్ బీ ఈ ఈ సీహెచ్ రమేష్, హనుమకొండ సిడిపివో కే మధురిమ,

గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్ సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, వైద్యారోగ్య శాఖ ఎంపిహెచ్ఎస్ జే రమేష్, 

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నుండి పి రేవంత్ మరియు దివ్యాంగుల జేఏసి కన్వీనర్ నల్లెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పోషణ మాసంలో భాగంగా

సెప్టెంబర్ ఒకటి నుండి మొదలు పెట్టిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున హనుమకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపివో కే మధురిమ ఆధ్వర్యంలో  హనుమకొండ బస్ స్టాండ్ లో మానవహారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీడీపీవో మధురిమ మాట్లాడుతూ ఎవరు పోషకాహార లోపంతో బాధ పడకూడదని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అనంతరం పోషణ మాసం నినాదాలు చేసి, పోషణ ప్రతిజ్ఞ చేసారు,కార్యక్రమంలో డెప్యూటి ఆర్ఎం (రవాణా శాఖ)రమేష్, సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, కవిత, రమ,సుశీల, పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ టి సుమలత, ఎస్బీ సీసీ యూనిసెఫ్ చీఫ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

1982 83 రామగుండం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివిన పూర్వ విద్యార్థులు వారి జ్ఞాపకాలను మర్చిపోలేక వారు చదివిన స్కూలుపై మమకారంతో ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా మాలాగే పై చదువులు చదువుకొని గురువులను మరియు స్కూలు మర్చిపోకూడదు అని తల్లిదండ్రులను గౌరవించాలని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత ఉద్యోగాలలో చేరి మాలాగే మీ తర్వాత చదివే పిల్లల కూడా మేము ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మీరు కూడా అలా చేయాలని 2021 22 టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకు టెన్త్ క్లాస్ లో ప్రధమ ద్వితీయ తృతీయ క్లాసులు వచ్చిన వాళ్లకు బహుమతులు ప్రధానం చేస్తున్నామని ఫస్ట్ క్లాస్ వాళ్లకు 3000 రూపాయలు సెకండ్ క్లాస్ వాళ్లకు 2500 థర్డ్ క్లాస్ వాళ్లకు 2000 రూపాయలు అలాగే తల్లిదండ్రులు లేని ఇద్దరు పేద పిల్లలకు  1000 రూపాయల చొప్పున మరియు ఈ సంవత్సరం చదువుతున్న క్లెవర్ స్టూడెంట్స్ ఇద్దరికీ1500 చొప్పున బహుమతులు ఇవ్వడం  జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం మరియు టీచర్స్ అలాగే 1982 83 టెన్త్ క్లాస్ పూర్వ

 విద్యార్థులు 30 మందిపాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్లాస్మేట్స్ అందరిని కలవడానికి ములుగు బెంగళూరు కరీంనగర్ కాటారం ఇంకా దూర ప్రాంతాల నుండి వచ్చిన క్లాస్ మెంట్స్ అందరికీ స్కూల్ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

గ్రామాభివృద్ధికి దివిస్ పరిశ్రమ అందిస్తున్న ఆర్థిక సహకారం అభినంద నీయమని

చింతల గూడెం, సర్పంచ్ ఆవుల రేణుక, దామెర ఎస్ఎంసి చైర్మన్ శేఖర్ రెడ్డి, అన్నారు. చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం దామేర, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ. 1,73,000/ రూపాయల విలువ చేసే నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, షూస్, హార్లిక్స్ ప్యాకెట్లను దివిస్ పరిశ్రమ యాజమాన్యంఅందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని దివిస్

పరిశ్రమ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని పాఠశాలలకు అందిస్తూ, విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె శ్రీలక్ష్మి, బి ఉపేందర్, గ్రామ పెద్దలు నారెడ్డి అభివందన్ రెడ్డి, దివిస్ ఎస్ ఆర్

ఇన్చార్జ్ వల్లూరి వెంకట రాజ్, ఎస్ సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్  ప్రతినిధి చింతకింది కార్తీక్ 


బొబ్బిళ్ళ సుశీలమ్మ రామచంద్రం వర్ధంతి

సందర్భంగా చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 12వ వార్డులో హెల్త్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక వార్డులోని ప్రజలకు బిపి షుగర్

చెకప్ లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

షుగర్ అనంతరం లైన్స్ క్లబ్ చౌటుప్పల్ అధ్యక్షులు కాసుల వెంకటేష్ మాట్లాడుతూ చౌటుప్పల్ పురపాలక పరిధిలోని

20 వార్డులలో లైన్స్ క్లబ్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించామని ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ మరియు లయన్స్ క్లబ్ నాయకులు దాచేపల్లి ప్రకాష్ గుప్తా, కటకం ప్రశాంత్, బొబ్బిళ్ళమురళి, పోలోజు శ్రీనివాస్ చారి, సత్యనారాయణ చారి, వనం రాజు, కామిశెట్టి చంద్రశేఖర్, అయ్యాడపు ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలలో భాగంగా హనుమకొండ జిల్లా లోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్  సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టడం జరిగింది.

ఇందులో భాగంగా శుక్రవారం  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు  నేతృత్వంలో కాకాజీ కాలనీ లో గల 4 ఆస్పత్రులను తనిఖీ చేయడం జరిగింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2010 ననుసరించి నియమ l నిబంధనలకు అనుగుణంగా  ధరల పట్టిక, అనుమతి పత్రాలను, ప్రదర్శించ నందున వలన మూడు ఆసుపత్రులకు మరియు ఒక డెంటల్ ఆసుపత్రికి  రిజిస్ట్రేషన్ లేనందువలన నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా  కొత్తగా ఈ చట్టం ప్రకారం  ఆయుర్వేద , హోమియో , యునాని, నేచరోపతి క్లినిక్ లు, ఆసుపత్రు లు మొదలగునవి విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ తనిఖీల యొక్క నివేదికను ప్రతిరోజు హెల్త్ డైరెక్టర్ కు నివేదిస్తామని ఆయన తెలిపారు.

ఇట్టి తనిఖీ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డిఎంఅండ్ హెచ్  ఓ డాక్టర్ మదన్మోహన్, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, జిల్లా మాస్ మీడియా అధికారి వేముల అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, సి హెచ్ వో మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 23న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  ఆదేశాల మేరకు రేగొండ ఎస్సై ఎన్ N.శ్రీకాంత్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి రేగొండ గ్రామ శివారులోని టీఎస్ఎండిసి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా రేగొండ వైపు నుంచి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తుండగా పోలీసు వారిని చూసి వెనక్కి తిరిగి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ రేగొండ మరియు తన సిబ్బందితో కలిసి అతడిని పట్టుకొని విచారించగా   నా పేరు నరిగె రాజయ్య (48)    గాంధీనగర్ గ్రామం రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని తెలిపి,  నా తమ్ముడు అయినటువంటి నరిగె ఓంకార్ అలియాస్ ప్రకాష్ పీపుల్స్ వారు గ్రూప్ పార్టీలో పని చేస్తూ అందాజా 20 సంవత్సరాల క్రితం కౌకొండ ఎన్కౌంటర్లో చనిపోయినాడని, అతని అంత్యక్రియల సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీ సభ్యులు సానుభూతిపరులు హాజరై ఆ సందర్భంలో వారితో పరిచయం ఏర్పడి వారితో ఒకటి రెండు సార్లు మాట్లాడగా వారు పోలీసు వారి సమాచారం మరియు భూస్వాముల యొక్క వివరాలు వ్యాపారస్తుల యొక్క వివరాలు తెలుపమనగా ఆ వివరాలను చెప్పేవాడిని మరియు మా ప్రాంతముకు వచ్చినప్పుడల్లా దళానికి భోజనం వసతి కల్పించే వాడిని. ఈ విషయం లో 2000 సం లో నా పైన రేగొండ పోలీస్ స్టేషన్ లో కేసు అయినది మరియు అన్నలతో అదేవిధంగా సంబంధాలు కొనసాగుచుండగా మా మండలం జగ్గయ్యపేటకి చెందిన కొమ్ముల నరేష్ దళంలో ఉండి మా ఏరియాకు వచ్చినప్పుడు నాకు కలిసేవాడు. అతను వచ్చిన సమయంలో నాకు  ఉన్న భూమి పంచాయతీల గూర్చి చెప్పగా పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ నాయకుడు అయిన దామోదరన్నను కలుద్దాం రమ్మని అనగా కొమ్ముల నరేశ్ తో కలిసి మొదటిసారి 2018 సంవత్సరం లో చత్తీస్గడ్ అడవులలో కలిసినాను. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఏటూరునాగారం ఏరియాలోని అడవిలో కలిసినాను. 

2019 సంవత్సరంలో మా మండలం లో ని జగ్గయపేట గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ దళ సబ్యుడు కొమ్ముల నరేష్ మరియు ఒక మహిళా సభ్యురాలు  రాత్రి సమయంలో మా ఇంటికి వచ్చి ఒక తుపాకీ నాకు ఇచ్చి మేము మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినారు. అయితే  ఈ సంవత్సరం జనవరి నెల లో వాజేడు ఏరియా లో జరిగిన ఎన్ కౌంటర్ లో కొమ్ముల నరేశ్ చని పోయినందున నా వద్దకు రాకపోవడంతోటి  నేను నా యొక్క భూ సమస్యల పరిష్కారం గురించి ఇట్టి తుపాకీతో బెదిరించి భూమి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుందామని తుపాకీని నాతోపాటు ఉంచుకున్నాను. 

 20న మావోయిస్టు పార్టీ నాయకుడు దామోదర్ అన్న  పంపగా ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి రేగొండ మరియు పరకాలలో వ్యాపారస్తులను నీ వద్ద ఉన్న తుపాకి తో బెదిరించి పార్టీ ఫండ్  డబ్బులు వసూలు చేసి పంపాలని దామోదర్ అన్న చెప్పినాడు అని ఈనెల 21 నుండి 27 వరకు  మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా అక్కడక్కడ వాల్ పేపర్స్ పాంప్లెట్స్ అంటించడం మరియు ప్రధాన కూడళ్ళ వద్ద వేయడం చేయాలని నాకు (50) వరకు  మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన  కరపత్రాలను నాకు ఇవ్వడం జరిగినది.  పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తేదీ 23 న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నా వద్ద ఉన్నటువంటి తుపాకీని మరియు కరపత్రాలను తీసుకొని ఇంటి నుండి బయలుదేరి నా యొక్క మోటార్ సైకిల్ గ్లామర్ నంబర్ TS25E6125 గల వాహనంపై పరకాలకు వెళ్తుండగా రేగొండ శివారులోని టీఎస్ఎండిసి చెక్ పోస్ట్ వద్ద  పోలీసు వారిని చూసి తప్పించుకోవాలని ఉద్దేశంతో మోటార్ సైకిల్ పై పారిపోతున్న క్రమంలో పోలీసు వారు నన్ను వెంబడించి పట్టుకున్నారని తెలిపినాడు .

స్వాధీనపరుచుకున్నవస్తువులు : కంట్రీమేడ్ పిస్టల్  -1,

7.65 ఎం ఎం రౌండ్స్

-2, మావోయిస్టు వారోత్సవాల కరపత్రాలు-50

లభ్యమైనట్లు  ఎస్పీ తెలిపారు. ఎస్పీ శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో  భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్ లు వాసుదేవ రావు, పులి వెంకట్, రేగొండ ఎస్సై  శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా అని  ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

శుక్రవారం నాడు కాజీపేట దర్గా, పీఠాధిపతి ఖుస్రూ పాషా, అధ్యక్షతన జరిగిన 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ  

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్గిన దర్గా ఉర్సు, ఉత్సవాలు ఘనంగా మూడు రోజులు పాటు 24,25,26, చందనోత్సవము (సందల్) , ఉర్సు షరీఫ్, బదావా, కార్యక్రమలు జరుపుకుంటారని, తెలిపారు.

దేశంలో అనేక ప్రాంతాలు, ఇతర దేశాల నుండి భక్తులు వస్తారని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తి చేసామని  తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు పోలీస్, వైద్య ఆరోగ్య, శానిటేషన్, త్రాగు నీరు,విద్యుత్, రవాణా, సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సౌకర్యాలు కల్పించామన్నారు.

స్థానిక స్కూల్ లకు సెలవు ప్రకటించి అందులో భక్తులకు వసతి కల్పించమన్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలని చీఫ్ విప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ    అడిషనల్ కమిషనర్, అనీసు రషీద్,

పీఠాధిపతి ఖుస్రూ పాషా, వాక్బోర్డు అభివృద్ధి అధికారి, మన్సూర్ పాషా, కార్పొరేటర్ తాడిశేట్టి విద్య సాగర్, కుడా మాజీ చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని ఖుస్రూ పాషా,మసూద్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ఉరి మెట్ల రాజలింగం  స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలం పెద్దంపేట మరియు రాయదండి గ్రామాలకు సంబంధించిన కూర్సు కమ్మి భూములకు పట్టాలిలు ఇస్తామని ఇది కోరుకంటి చంద్రన్న పుట్టినరోజు గిఫ్ట్ అని పోయిన సంవత్సరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పుట్టినరోజు కానుక అని గ్రామ నడిబొడ్డున అధికార పార్టీ నాయకులు సంబరాలు జరుపుకొని సంవత్సరం గడిచిన ఇప్పటివరకు అతిగతి లేదని కనీసం పేపర్ కూడా కదలలేదని పట్టాల అవడం సంగతి పక్కన పెడితే సాక్షాత్తు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్  కూర్సు కమ్మి భూములకు పట్టాలి ఇవ్వడం కష్టమేనని చెప్పిన విషయం లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ పుట్టినరోజు కానుక అని చెప్పి సంవత్సరం గడిచిన ఇప్పటివరకు నెరవేరకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ఈ విషయంలో దృష్టి సారించకపోతే చాతకాకపోతే బాహుటంగా మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ బుజాల మీద వేసుకొని రాజ్ ఠాకూర్ సహకారంతో శ్రీధర్ బాబు  మరియు భట్టి విక్రమార్క  నాయకత్వంలో శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు*స్థాయిని మరిచి ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవడం కాదు సంక్షేమంపై దృష్టి సారించాలని శాసనసభ్యునికి సూచించిన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం*ఇదే కార్యక్రమంలో హాజరైన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు స్థాయిని మరిచి ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా నేనే చేస్తా అని ప్రగల్లు పలకడం కాదు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారించాలని కల్లబలి మాటలతో కాలం వెళ్లదీయకూడదని హెచ్చరించారు*దళిత బంధు ప్రతి దళితుడికి ఇవ్వాలి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరి ప్రసాద్ డిమాండ్*ఈ కార్యక్రమంలో హాజరైన ఎస్ ఎల్ రాష్ట్ర  కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్  మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితునికి దళిత బంధం ఇవ్వాలని కేవలం మీ తెరాస కార్యకర్తలకే ఇవ్వాలనుకుంటే దొరల గడీలలో దాచిన డబ్బులు వెలికి తీసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంబంధించిన ఆస్తులు పంచాలని ప్రజల సొమ్ము పంచితే రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు*ఎమ్మెల్యే ఇల్లు కేటీఆర్ గిఫ్ట్ కాదు ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితుల రక్తంతో కట్టిందని తెలియజేసిన అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం*అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం  మాట్లాడుతూ మా మండలంలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అమాయక నిరుద్యోగులను మాయమాటలతో పర్మనెంట్ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి వారి రక్తం చెమట చుక్కలుగా మార్చి సంపాదించిన డబ్బుతో కట్టిన ఇల్లు కేటీఆర్ గిఫ్ట్ అనేది చెప్పడం విడ్డూరంగా ఉందని వారి డబ్బులు వారికి చెల్లించేంతవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని శాసనసభ్యునికి హెచ్చరించారు*ఈ పత్రికా సమావేశంలో అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం  మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం  కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్  ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్  ఉమ్మడి రామగుండం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  రాజమల్లుయాదవ్  కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండల నాయకులు సింగం కిరణ్ కుమార్ గౌడ్  గజ్జల నాగరాజు  సుందర వేణి శేఖర్  గొర్రె చందు  అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి గౌస్  ఊరేగి మహేష్  తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 

చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం సమావేశం గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు నా రెడ్డి అభినందన్ రెడ్డి పాల్గొని

మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలోని కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని రంగాల్లో

ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మునుగోడు లో జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడాయువకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరెగూడెం టిఆర్ఎస్ యువజన విభాగ

అధ్యక్షులుగా ఎన్నపల్లి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుర్గం రాజులను ఎన్నుకున్నారు.

సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మునగాల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రా శాఖ అధ్యక్షులు ఎన్నపల్లి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గంగపుత్రుల సమస్యల గురించి వీరి పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం పట్ల వీరికి సమకూరాల్సిన వలలు కానీ తెప్పలు కానీ లైవ్ జాకెట్ల గురించి అలాగే ఇటీవల సంభవించిన వరదలకు అలాగే ఎల్లంపల్లి డ్యామ్ బ్యాక్ వాటర్ లో ముంపునకు గురై నిరాశ్రయులైన మసత్యకారులకు అందాల్సిన ప్రోత్సహకాల గురించి అలాగే రామగుండము నియోజక వర్గంలో పెండింగ్ లో ఉన్న సొసైటీలను వెంటనే ఏర్పాటు చేయాలనీ  హైదరాబాద్ లోని మస్త్య భవన్ యందు మస్త్య శాఖ కమిషనర్ తో రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడటం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ను ఘనంగా  నిర్వహించాలని  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు .

 హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్నీ చర్యలు.

గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు.ఈ సారి భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని

పోలీస్ శాఖ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించే చోట్ల మరియు దసరా ఉత్సవాలు నిర్వహించే చోట్ల ముమ్మర ఏర్పాట్లు చేసి అలాగే మహిళ పోలీస్ సిబ్బందిని ఎక్కువగా అందుబాటులో ఉంచాలన్నారు.

బతుకమ్మ  నిమజ్జనం చేసుకునే స్థలాలను గుర్తించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుకరించిన ఆభరణాలు అలంకరించేందుకు ఊరేగింపుగా వచ్చే సమయంలో పోలీసు శాఖ పటిష్ట భద్రత కల్పించాలని

సంప్రదాయ బద్దంగా బతుకమ్మ,దసరా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

పద్మాక్షమ్మ,సిద్దేశ్వర ఆలయాల వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

అలాగే మహిళలు పలు కాలనీలు ఏకమై ఒకే చోట బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నందున ఆట స్థలాలను గుర్తించి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి.

అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని చీఫ్ విప్ అధికారులను ఆదేశించారు.

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ

బతుకమ్మ మరియు దసరా నవరాత్రి ఉత్సవాలను అలాగే భద్రకాళి, పద్మాక్షమ్మ, సిద్దేశ్వర, వెయ్యి స్థంబాల దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా నవరాత్రి ఉత్సవాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బతుకమ్మ పండుగను మరియు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.

అలాగే భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికార యంత్రంగాన్ని ఆదేశించారు.

అలాగే భద్రకాళి ఆలయానికి ఒక అధికారిని మరియు పద్మాక్షమ్మ, సిద్దేశ్వర రెండు ఆలయాలకు కలిపి అలా అధికారిని ఇంచార్జ్ గా నియమించాలన్నారు.

మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలను మరియు బతుకమ్మ పండుగను విజయవంతం చేయడానికి అలాగే భద్రకాళి దేవినవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడానికి ఆలయ అధికారులు మరియు పూజారులు కోరిన విధంగా  మున్సిపాలిటి తరుపున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో  అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, ఏసిపి కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 37 వ డివిజన్ ఖిలా వరంగల్ తూర్పు కోట  బతుకమ్మ,దసరా ఉత్సవ కమిటి నాయకులు కార్పొరేటర్ బోగి సువర్ణ-సురేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ,దసరా  ఉత్సవాల గురించి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఖిలా వరంగల్ తూర్పు కోట లో బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. దసరా, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, తానూ స్వయంగా భాగస్వామిని అవుతానని ఎమ్మెల్యే వారికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, ఉత్సవ కమిటీ 

నాయకులు వనపర్తి ధర్మరాజు, సంగరబోయిన చందర్, మంద శ్రీధర్ రెడ్డి,సంగరబోయిన ఉమేష్, జెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు.