October 2022
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న




                                                  పెద్దపల్లి:అక్టోబర్:31:ప్రజావాణి        దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలనీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ,అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ,కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మాట్లాడారు,ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసి,సమస్య పరిష్కరించి,సదరు వివరాలను సైతం ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సోమవారం మొత్తం 50 అర్జీలు రాగా,వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 23,ఇతర శాఖలకు సంబంధించి 27 దరఖాస్తులు వచ్చాయని,ఎక్కువగా పెన్షన్,భూ సంభందిత సమస్యలపై అర్జీలు ఇచ్చారని తెలిపారు.గోదావరిఖని కె.సి.ఆర్.కాలనీకి చెందిన అంబాల స్రవంతి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయుటకు కోరుతూ దరఖాస్తు సమర్పించారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అర్హత మేరకు పరిష్కరించమని కలెక్టర్ సూచించారు.ముత్తారం మండలం సందరెల్లి గ్రామానికి చెందిన ఇందారపు లక్ష్మి తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న శివాలయానికి నీటి సరఫరా సౌకర్యం కొరకు దరఖాస్తు చేసుకోగా,సింగరేణి సంస్థ కు పంపుతూ నీటి సరఫరా పనులు పూర్తి చేయుటకు కలెక్టర్ సూచించారు.రామగుండం అయోధ్య నగర్ కు చెందిన కె.బక్కమ్మ తన కుమారుడు శ్రీనివాస్ వద్ద నుంచి బోర్ వెల్ మోటార్,వాషింగ్ మెషిన్,ఇతర వస్తువులు ఇప్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా అదనపు కలెక్టర్ రెవెన్యూకు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.గోదావరిఖని ప్రాంతానికి చెందిన దుర్గానగర్ కాలనీ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ లేఔట్ లో నాలా విస్తరణ కోసం కేటాయించిన 35 గుంటల స్థలాన్ని  కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని, దీనిని నివారించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ నవంబర్ 7 లోపు పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పుట్ట శ్రీనివాస్ సర్వే నెంబర్ 49,162 లోని తమ పోడు భూములకు హద్దులు చూపి పట్టాలు అందజేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మంథని తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఈ రోజు రామగుండం హౌజింగ్ బోర్డ్ కాలనీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్గీయ మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పసి శ్రీనివాస్ ,మరియు SC సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో హస్పెటల్ కి వచ్చే పేషేంట్స్ కు (రోగులకు)పండ్లు ,బ్రేడ్ పంపిణీ  చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ,అరుకుంటి రాజమల్లు యాదవ్ ,1వ డివిజన్ ప్రెసిడెంట్ బొద్దుల శంకర్ ,21వ డివిజన్ ప్రెసిడెంట్ పప్పి ,22డివిజన్ ప్రెసిడెంట్ బూతుల్ , 20 వ డివిజన్ సారయ్య నాయక్ ,చంద్ భాయ్,బైరి కిరన్ కుమార్ గౌడ్ ,సాదుల సదానందం,యసీన్ ,అష్రాఫ్ , యూసుఫ్,గౌస్ బాబా, ప్యాయజ్, ఇర్ఫాన్ ,అజమత్,కాలీమ్, అల్లి శంకర్,లడ్డు ,మహేబూబ్ , పాషా ,చిలుక రామూర్తి,చిలుక శ్రవణ్ , దస్తగిరి , ఎదునూరి వెంకట్ స్వామి, తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బరపటి శ్రీను ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం మురుమూరు ఎంపీటీసీ కొక్కెర రమేష్ లు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ అని పేదరిక నిర్మూల కొరకు అనునిత్యం పనిచేసిన మహా నేత అని కొనియాడారు ఇందిరా గాంధీ ఆశయ సాధన కోసం వారి రాజ్య స్థాపన లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  పని చేయాలని పిలుపునిచ్చారు

అనంతరం మాజీ ఎంపీపీ మెట్ల రాజలింగం మాట్లాడుతూ ఇందిరాగాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి తోడ్పడి ప్రాణ త్యాగం చేసిన మహా నేత అని అన్నారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్,మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం,ఎంపీటీసీ కొక్కెర రమేష్,గుంట బాపు,మద్ది తిరుపతి, గాదె సుధాకర్,సింగం కిరణ్,బరుపటి తిరుపతి, మంతెన మహేందర్,ఉప్పులేటి సదానందం, కొత్తపల్లి రాజు, ఉప్పులేటి రాజేందర్,ఇందిబిల్లి విజయ్,కట్కూరి రాఘవ,దొరిశెట్టి శ్యామ్,మేడి ఓదెలు,సంగనావేనా శేఖర్,ఓల్లెపు సాయి,దారవేణి సాయి, గంధం సాగర్,కొత్తకొండ సంతు, సంకరి అనిల్,ఆకుల రాము,మేకల ప్రశాంత్,సంధి అక్షయ్, దొరిశెట్టి రాజ్ కుమార్, దర్శనలా రాజశేఖర్, సందనేని కుమార్, వేల్పుల రాకేష్, ప్రభు,వేల్పుల అక్షయ్,వేల్పుల సతీష్,వేల్పుల శ్రీధర్, కుమార్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

బ్రిటిష్ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూ భాగాన్ని తన చాణిక్యo తో, దృఢమైన నిర్ణయాలతో  ఏకం చేసి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు ప్రతి భారతీయునికి ఆదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  జె.సురేందర్ రెడ్డి  అన్నారు.

సోమవారం  జిల్లా పోలీసు  కార్యాలయంలో  ఎస్పీ  భారత తొలి ఉప ప్రధాని  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించి   పటేల్  చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళి  అర్పించి పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించినారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ    మాట్లాడుతూ విశాల భారతావని ఏకతాటి పై నడిపించి, భారత ప్రథమ హోం శాఖ మంత్రిగా పనిచేసిన వల్లభాయ్ పటేల్  ఎందరికో ఆదర్శమని వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్ ది పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానమని,  భారత యూనియన్ లో కలవడానికి ఇష్టపడని హైదరాబాద్ ప్రాంతాన్ని సైనిక చర్య ద్వారా యూనియన్ లో కలిపి ఇక్కడి ప్రజలు మన్ననలు పొందారని, వారి పోరాటం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయుధంగా పని చేసిందని అన్నారు.  యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబంలో జీవిస్తూ జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుందని  అన్నారు.  అనంతరం ఐక్యత భావం పెంపొందించేలా ఎస్పీ సురేందర్ రెడ్డి  పోలీసు అధికారులు,  సిబ్బంది అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నర్సింహులు, పెద్దన్న కుమార్, అజయ్, జితేందర్ రెడ్డి, సంతోష్, సతీష్, డిపిఓ ఏవో ఆయూబ్ ఖాన్,  సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 ప్రజలు పలు సమస్యలతో పోలీస్ అధికారుల వద్దకు వస్తుంటారని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే చట్టపరిధిలో వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం  జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన  ప్రజా దివాస్ కార్యక్రమం లో  భాగంగా ఎస్పీ  ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, భూ తగాదాలు,  మరియు ఇతర సమస్యలపై 15  ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అలాగే   బాధితులతో మాట్లాడిన ఎస్పి గారు   వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి, చట్టప్రకారం విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని బాధితులకు  న్యాయం చేయాలని ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ;

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా సోమవారం జిల్లా  కలెక్టరేట్ కార్యాలయం లో    కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ సమైక్యత దినోత్సవం ను నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్   అధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుగాంచారని, ఆయన పుట్టినరోజు జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకోవడము జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అదనపు జేసీ  సంధ్యా రాణి, డిఆర్ఓ  వాసు చంద్ర  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్


లింగాపూర్ ఎస్సీ కాలనీ దళితులను సింగరేణి యాజమాన్యం ఏడు సంవత్సరముల నుండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామంటూ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డైరెక్టర్ దత్తు లింగాపూర్ గ్రామాన్ని సందర్శించి లింగాపూర్ ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఇప్పటికైనా లింగాపూర్ దళితుల పైన కనికరం చూపించి ఎస్సీ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డైరెక్టర్ దత్తు కు మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య కోరారు ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏడు సంవత్సరముల నుండి అడవి పందుల తోటి విషసర్పాలతోటి ప్రమాద పంచున మేము ఉన్నామని కావున ఇప్పటికైనా మా పైన కనికరం చూపి మా ఎస్సీ కాలనీ ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి తరలించాలని సింగరేణి డైరెక్టర్ దత్తును మరియు జీఎం కలవల నారాయణను మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య కోరారు ఎస్సీ కాలనీ ప్రజల సమస్యలను ఓపికతో విని వారి పరిస్థితులను చూసి ఇప్పటికైనా ఎస్సీ కాలనీకి మోక్షం కలుగుతుందో లేదోనని ఎస్సీ కాలనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్ దత్తు ఎస్ డి సి నరసింహమూర్తి ఆర్ జి వన్ జిఎం కలవల నారాయణ సింగరేణి సర్వేయర్ అలీ మల్లికార్జున్ వీరారెడ్డి కాసర్ల మల్లేష్ చంద్రయ్య కళ బుచ్చమ్మ రాజమ్మ తదితర ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్


రమగుండం కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీవాసులు గత 15 రోజులుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ అన్నారు పీకే రామయ్య కాలనీలో ఉంటున్న దినసరి కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని మల్లేష్ అన్నారు 15 రోజుల నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతూ మూడుసార్లు కార్పొరేటర్ దగ్గరికి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు కూడా కాలనీ సమస్య తీరలేదని గత ఏడాది తేదీ 6 11 2021 రోజున రామగుండం కార్పొరేషన్ కమిషనర్ పీకే రామయ్య కాలనీకి ఇదివరకు ఉన్న బోర్లకు మూడు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని అప్పటి కమిషనర్LRROC NO F2/319/11 2020_2021. ద్వారా TSNPDCL అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కు లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ అందుకున్న విద్యుత్ అధికారులు కరెంట్ సప్లై ఇచ్చారు మా నీటి కష్టాలు తీరిందని సంతోషంగా ఉన్న కూలీలకు మళ్లీ నీళ్ల సమస్య మొదటికి వచ్చిందని తెలిపారు గత 15 రోజుల క్రితం మేం పనులకు వెళ్లి వచ్చేసరికి విద్యుత్ శాఖ అధికారులు వచ్చి మా యొక్క నీటి బోర్లకు అమర్చిన విద్యుత్ సరఫరాను తొలగించారని ఈ విషయంపై మా కాలనీకి బోర్లు వేసి నీటి సమస్య తీర్చిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ కు పరిస్థితిని వివరించగా స్పందించిన మడిపల్లి మల్లేష్ విద్యుత్ ఏఈ దగ్గరకు వెళ్లి విషయం తెలుపగా మాకు కార్పొరేషన్ నుండి బిల్లు రానందున విద్యుత్ సరఫరా తొలగించామని అధికారి చెప్పగా వెంటనే కార్పొరేషన్ ఏఈ రాంజీని వివరణ కోరగా అతను ఇచ్చిన సమాధానం మీ రెండవ వార్డ్ కార్పొరేటర్ లెటర్ ద్వారా మాకు మీ సమస్య రాసి ఇస్తేనే మేము మీటర్లకు డీడీలు కట్టగలమని కార్పొరేషన్ అధికారి తెలిపారని రెండవ డివిజన్ కార్పొరేటర్ ఇంటికి పొద్దున సాయంత్రం మూడు రోజులు తిరిగిన సరైన సమాధానం కాలనీ ప్రజలకు ఇవ్వలేదని మల్లేష్ అన్నారు పీకే రామయ్య కాలనీ ప్రజలు ఓటు వేయలేదా ఇప్పటివరకు కార్పొరేటర్ కాలనీలో డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాన్ని మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు తీసిన దాఖలాలు లేవని మల్లేష్ అన్నారు ఇకనైనా రామగుండం కార్పొరేషన్ అధికారులు పీకే రామయ్య కాలనీ దినసరి కూలీల నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మేయర్ కమిషనర్ నిరుపేదలు ఉండే పీకే రామయ్య కాలనీ నీ సందర్శించాలని మడిపల్లి మల్లేష్ కోరారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 సమికృత  కలెక్టరేట్ కార్యాలయం లో   స్పేస్ స్కూల్ చిన్నారులు శనివారం ఉదయం  కొద్దిసేపు సందడి  చేసారు. స్పేస్ స్కూల్ చిన్నారులు   క్షేత్ర పర్యటన లో భాగంగా, స్కూల్ టీచర్లు  చిన్నారులు ను కలెక్టరేట్ కార్యాలయం నకు   తీసుకొని వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును  కలిశారు.చిన్నారులు క్రమశిక్షణ  తో ఉండాలి అని, మంచిగా  చదువు  కోవాలి అని కలెక్టర్ సూచించారు. వారితో ఫోటో  దిగారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, శాంతి భద్రతల కు విఘాతం కలిగించే వ్యక్తులపై  కఠిన చర్యలు తీసుకోవాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయoలో ఎస్పీ   పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం ఏర్పాటు  చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ శాంతిభద్రతలకు  భంగం కలిగిస్తూ, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తరచూ నేరాలకు  పాల్పడితే వారిపై పీడీయాక్టు  నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే  వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని అలాగే  క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సమగ్ర నేర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా ప్రతి ఒక్క పోలీసు అధికారి, బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పి   కోరారు. సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఉద్యోగాల పేరుతో యువత మోసపోకుండా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఎస్పి  పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి.శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ. రాములు, డిఎస్పీలు కిషోర్,రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు పెద్దన్న కుమార్, రాజిరెడ్డి, వాసుదేవరావు, జానీ నరసింహులు, అజయ్, జితేందర్ రెడ్డి, పులి వెంకట్, రంజిత్ రావు,  ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం కార్పొ రేషన్7వ డివిజన్ పవర్ హౌస్ కాలనీ లో గడప గడప కి తిరుగుతు మహిళ లతో మాట్లాడి , సమస్యలు తెలుసుకుంటున్న రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*సతీమణి *మనాలి ఠాకూర్ వాడలో మహిళలందరూ ఏక తాటిగా ఒకటై ఈసారి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను కచ్చితంగా MLA గా గెలిపించుకుంటామని అన్నారు, మహిళలు అందరూ పూర్తి మద్దతు తెలిపారు. వీరి వెంట రసమళ్ళ కిరణ్, స్వప్న, శోభ,భరత్, రాజు తదితరులు పాల్గొన్నారు,,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

     


                                                    పెద్దపల్లి:అక్టోబర్:29:పెద్దపల్లి జిల్లా,రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు.పద్మశాలి పోరాట యోధుడు,బి.సి నాయకుడు తెలంగాణ తోలి,మలి దశ ఉధ్యమకారుడు తెలంగాణ కోసం తన పదవిని,యావదాస్తిని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించి తెలంగాణా ప్రభుత్వం వారి పేరుమీద అనేక కార్యక్రమాలు చేయటంతో,కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పోస్టల్ కవర్ ను విడుదల చేయటం చాలా అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం ఏరియా కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి పద్మశాలి సేవా సంఘం నాయకుడు ఆడెపు శంకర్,మండల సత్యనారాయణ,చిప్ప రాజేశం,పిట్ట లక్ష్మి,నర్సయ్య,అడిచర్ల నంబయ్య,మోర శ్రీనివాస్,వొల్లాల మల్లేశం,మాటేటి శంకర్,వనం శివానందం,కొండి లక్ష్మీ పతి,అందె సదానందం,గుండేటి ప్రభాకర్,అనుముల కళావతి,జానకిరాములు,దాసరి సాంబమూర్తి,బండారి రాజమల్లు,ఆడెపు రవి,రమేష్,కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గోదావరిఖనిలో CSP కాలనిలో  కార్యకర్తల్లో సమావేశం నిర్వహించడం జరిగింది.  SCRPS రాష్ట్ర  అధ్యక్షుడు మారేడు మోహన్  ఆదేశాల మేరకు *పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ SCRPS కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించి *బుడిద రమేష్ ను పెద్దపెళ్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గా,ఎన్నుకోని నియామక పత్రాలు అందజేశారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపెళ్లి జిల్లా అధ్యక్షుడు భుషిపాక సంతోష్ మహారాజ్  మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని  బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని మరియు జిల్లాలోని ప్రతి గడపగడపకు సంస్థను  చేరవేసి బలోపేతానికి కృషి చేయాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే బాబు జగ్జీవన్ రావు,  ఆశలను కొనసాగించలని  ఆకాంక్షించారు. అదేవిధంగా పెద్దపెల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ *SCRPS రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన  సందర్భంగా బుడిద రమేష్   ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కొత్తగా నియమితులైనటువంటి *జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద రమేష్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ అన్న, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్ కు, రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపెల్లి జిల్లాలో కమిటీలు వేస్తూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తూ, సంస్థను బలోపేతం చేస్తానని మాటిస్తూన్నను అన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

   



                                                                  పెద్దపల్లి,ఎన్టీపీసీ;అక్టోబర్-29:ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన,నవంబర్ 12న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్ర ఎరువుల,రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్,సంగీత సత్యనారాయణ,రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి శనివారం  పర్యవేక్షించారు.ముందుగా కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు,రామగుండంలో ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్,ఎన్టిపిసి లోని హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు.నవంబర్ 12న ఆర్.ఎఫ్.సి.ఎల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ఎరువుల కర్మాగారం,ఎన్టీపిసి టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలో గల హెలిపాడ్,ప్రధాని సభ ప్రాంగణం,ఎరువుల కర్మాగారంలో ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,డిసిపి రూపేష్ కుమార్,ఎన్టిపిసి జిఎం సునీల్ కుమార్,ఎరువుల కర్మాగారం జిఎం జా,మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్,రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతల లక్ష్మీనారాయణ,రామగుండం తహసిల్దార్ జాహద్ పాషా,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

 మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం శివారులోని మూలమలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం షరీఫ్ వచ్చి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. తీవ్ర విషాదం. దైవ దర్శనం వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారులో డ్రైవర్ సహా ఏడుగురు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు వెలిక్కి తీయగా.. మరో ఇద్దరు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కారులో ఉన్నవాళ్లలో కొందరు గాయపడినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. కేసముద్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి కారును, బావిలో పడిన బాధితులను స్థానికుల సహకారంతో వెలికి తీసే ప్రయత్నాలు చేపట్టారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా షీ టీమ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ నేరాల పై వెబినార్ సదస్సు కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు హాజరై జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రకరకాల నేరాలు జరుతున్నాయని,  ప్రజలు అన్ని మోసాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మోసపోయాక బాధపడేబదులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని అన్నారు. జిల్లా లోని వివిధ పాఠశాల విద్యార్థులతో వెబినార్ కార్యక్రమం ఏర్పాటు చేసి  అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో భాగంగా

సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి.

బ్యాంక్ ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి.ఆన్లైన్లో మోసం జరిగినప్పుడు పోలీస్ వారికి ఏ విధంగా కంప్లెంటు ఇవ్వాలి.

ఎలాంటి వెబ్సైటు లింకులను కూడా ఎప్పుడు ఓపెన్ చేయకూడదు.

మొబైల్ ఫోన్లు వాడే వారు ఎటువంటి ఓ.టి.పి లు ఇతరులకు తెలియజేయరాదని అలా తెలియజేసినట్లయితే తమ వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.

అలాగే చాలా మంది చదువుకున్నవారే సైబర్ నేరాలకు గురవుతున్నారనీ,

'ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని పేర్కొన్నారు.  సోషల్ మీడియా ఆప్స్  పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు ఎస్పి కోరారు.అలాగే  షీ టీం ప్రత్యేకించి మహిళల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని,  మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో వెంటనే షి టీిం ఫోన్ నంబర్ 9440904730 కూ గానీ 100 కు గాని ఫోన్ చేయాలని అదనపు ఎస్పీ శ్రీనివాసులు సూచించారు.   మహిళలు, బాలికల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన మరే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా  ఇబ్బందులు కల్గించిన,  తప్పుగా ప్రవర్తిన్చిన కఠినమైనన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు ఎస్పి   హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఇన్స్పెక్టర్ అజయ్, ఎస్సై  శ్రీలత, సఖి అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, కేస్ వర్కర్ మాధవి, ప్రిన్సిపాల్ ఎంఎస్  మూర్తి  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

   


                                                            పెద్దపల్లి,అక్టోబర్-28:మాతా,శిశు ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలతో,మెరుగైన సౌర్యాలు,వైద్య సేవలు దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు పెరిగాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.శుక్రవారం డి.ఎం.అండ్ హెచ్.ఓ.డాక్టర్ కె.ప్రమోద్ కుమార్,జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ డెలివరీలు చేయడం జరిగిందని,ఆగస్ట్ వరకు ప్రతి నెల సరాసరి 113 వరకు ప్రసవాలు చేస్తుండగా,సెప్టెంబర్ లో 180,అక్టోబర్ నెల 28 వరకు 210 చేసినట్లు కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు,వసతులు కల్పించడం,దానికి తోడు వైద్య సిబ్బంది కృషి, సేవలు అందించడంతో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో ప్రజలు ఎక్కువగా వస్తున్నారని,ఇదే విధంగా భవిష్యత్తులో నమ్మకమైన,మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు చూరగొనాలని,మాతా,శిశు ఆరోగ్యంపై,పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన పరీక్షలు ఉచితంగా చేసి అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని,ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలు పొందాలని తెలిపారు.ప్రజల సౌకర్యార్థం కొంత రుసుము చెల్లించి ప్రత్యేక గదులు తీసుకునే సౌకర్యాన్ని నవంబర్ ఒకటి నుండి  ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్,జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో 399 రూపాయలకే పది లక్షల ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నారు ఈ బీమా సంవత్సరం పాటు ఉంటుంది ఈ బీమా పాలసీ ప్రమాదం జరిగిన లేదా ఏదైనా అనారోగ్యాలకు గురైన హాస్పటల్ ఖర్చులకు మరియు వికలాంగులైన 10 లక్షల రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్ ఇది దీనిని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సామాజిక సేవా కార్యకర్త నిమ్మరాజుల రవి లింగాపూర్ గ్రామ ప్రజలను కోరారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


తెలంగాణ రాష్ట్రం పై కుట్ర చేస్తున్న బిజెపికి తెలంగాణ ప్రతి బిడ్డ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది నిన్న జరిగిన సంఘటన ఉదాహరణ నలుగురు ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతోఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తుల ద్వారా స్వాములు హైదరాబాద్ వ్యాపారి వ్యాపారులతో ఫామ్హౌస్లో ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారు ఎమ్మెల్యేలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకుని ఎలా చేశారు బిజెపి పార్టీ చేస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అప్రమత్తంగా ఉండాలి, రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అదేశాలందిపుచ్చుకోని  అంతర్గాం  మండల కేంద్రం లో బిజెపి పార్టీ మోడీ  దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలోఅంతర్గం జడ్పటిసి ఆముల నారయణ యంపిపి దుర్గం విజయ , సర్పంచ్ లు బదలవేణి స్వామి , ధరణి రాజెష్ ఉపసర్పంచ్ లు , బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు ..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న




                                                        పెద్దపల్లి:మంథని:అక్టోబర్:27:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటు,ఇది బీజేపీ నీచ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ఆద్వ‌ర్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్తలు మంథని పట్టణంలో   బీజేపీ,ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు.ప్ర‌ధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.అనంత‌రం జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడారు భారతదేశమంతా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చినట్టుగా కూల్చాలని తెలంగాణలో కూడా అదే విధంగా ప్రయత్నాలు చేయాలని సంకల్పించినటు వట్టి బీజేపీ పార్టీ,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు,బిజెపి కుట్రను తిప్పికొట్టి చరిత్రను సృష్టించినటువంటి విషయం యావత్ దేశమంతా చూస్తున్నాదని అన్నారు,బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చేష్టలను మానుకోవాలని ఇటువంటి ప్రయత్నాలు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అనే విషయాన్ని గమనించాలని బిజెపి పార్టీకి,మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ చురకలు అంటించింది,డబ్బుల రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు డబ్బులతో కొనుగోలు చేయాలని సందేశం ప్రజాస్వామ్యానికే ఇది గోడ్డలి పెట్టు లాంటిది బీద ప్రజాప్రతినిధులు,కావాలంటే ఈ విధంగా డబ్బులు చూస్తుంటే భయపడే విధంగా కనబడుతుంది,దీని తీవ్రంగా మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఇటువంటి వాటికి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని ఈ సందర్భంగా బిజెపి,మోడీని హెచ్చరిస్తా ఉన్నాం ఇటువంటి పునరావతం కాకుండా చూసుకోవాలని  టిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గం,బీజేపీ,మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ;

కోట్ల రూపాయల నగదు, పదవులు, కాంట్రాక్టుల ఆశచూపి టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రకు నిరసిస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తాలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ నిరసన బీజేపీ, మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. పాల్గొన్న డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

బీజేపీ చేసిన వికృత రాజకీయ క్రీడకు నిరసనగా బీజేపీ,ప్రధాని మోది దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. మోదీ, బీజేపీకి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనే కుట్ర చేసిందని, ఆ కుట్రను ముఖ్యమంత్రి కేసీఆర్  తిప్పికొట్టారన్నారు. తెలంగాణపై బీజేపీ విష పన్నాగం. టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బారీ కుట్రకు తెరతీసారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు పన్నాగం పన్ని అడ్డంగా బుక్ అయ్యారు. వీళ్ళ పన్నాగాన్ని పసిగట్టిన మా నాయకుడు కేసీఆర్. తెలంగాణతో గోక్కుంటే ఏమౌతుందో బీజేపీకి అర్థమయ్యి ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన ఎమ్మెల్యేలం మేమంతా. మా ప్రభుత్వాన్ని కూల్చజూసి, మా నాయకుడిపై కుట్రలు చేస్తే ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో కేసీఆర్ అవుతాం.. ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండా గా బీజేపీ సాగుతుంది. స్వాములతో బేరాలు నడుపుతూ నీచ రాజకీయం నడుపుతుంది.

దేశంలో వికృత రాజకీయ క్రీడ నడుస్తుంది. వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుంది. అభివృద్దిని మరిచి అరాచకాలకు తెరతీస్తుంది. అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతుంది. తెలంగాణ అంటే ముందు నుండీ బీజేపికి వివక్ష ధోరణే.తల్లిని చంపి పిల్లను బ్రతికించారంటూ గతంలో మోదీ తన అక్కసు వెలగక్కాడు.తెలంగాణ కు రావాల్సిన నిధులు విధులకు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్నే కూల్చేందుకు కుట్ర చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావటం బీజేపీకి మింగుడు పడటం లేదు. సార్ నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీతో బీజేపీ దడుసుకుంటుంది. అందుకే వాళ్ల పోకస్ ఇక్కడ పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారీ కుట్ర పన్నారు. అడ్డంగా దొరికినా ఇంకా బుకాయిస్తున్నారు.

ఇది తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం ఉండగా తెలంగాణాను మీరేం చేయలేరు. తెలంగాణను గెలవాలంటే కేసీఆర్ కన్నా ఎక్కవగా తెలంగాణను ప్రేమించాలి. ఇలా కుట్రలు చేస్తే మీ కుట్రలు చేదించేందుకు ఇక్కడున్నది కేసీఆర్. సమైక్య పాలకుల కుట్రలను ఛేదించాం. ప్రభుత్వం ఏర్పాటవగానే ఓటుకు నోటుతో చంద్రబాబు కుట్రను చేదించాం.నేడు బీజేపీ కుట్రను ఛేదించాం. కుట్రల బ్రతుకులు మీవి.మీకు ప్రజలు బుద్ది చెబుతారు. మీ వికృత చేష్టలను ప్రజాక్షేత్రంలో చర్చ పెడతాం. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళను ప్రజలు తిరస్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పాలి. వరంగల్ తూర్పు అభివృద్ది అద్భుతంగా చేస్తున్నం. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. ప్రజలకు సేవ చేసే వారెవరో, ప్రజలను మభ్య పెట్టే వారెవరో ప్రజలు గ్రహించాలి. మునుగోడులో అద్భుత విజయం సాధించబోతున్నామన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                                                                                      



పెద్దపల్లి:అక్టోబర్:27:నిక్షయ్ పోషణ యోజనలో భాగంగా టి.బి.వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన కలెక్టర్,టి.బి.వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకర,చక్కటి ప్రణాళిక మేర సమతుల్య,పోషకాహారం తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తెలిపారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ,లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణతో కలిసి పాల్గొని టి.బి,వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరకులను,వరద బాధితులకు ఇంటి సామాన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తూ టి.బి.నిర్ధారణ పరీక్షలు, రోజువారీ మందులను పూర్తిగా ఉచితంగా అందించి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించడం జరుగుతుందనీ తెలిపారు.రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం,రాత్రిపూట చెమటలు పట్టడం,ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం టి.బి.లక్షణాలు అని,వ్యాధి సోకిందో లేదో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.జిల్లాలో మొత్తం 437 టి.బి.వ్యాధిగ్రస్తులు ఉన్నారని,ఆరోగ్యకరంగా ఉన్నప్పటి కంటే వ్యాధి సోకిన తర్వాత ప్రణాళిక మేరకు బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని,పోషకాహార లోపం,బరువు తక్కువ లేకుండా చూడాలని తెలిపారు.నిక్షయ్ పోషణ యోజన క్రింద 2018 ఏప్రిల్ ఒకటి నుండి అయిన ప్రతి రోగికి ఐదు వందల రూపాయలు పూర్తి చికిత్సా కాలం పోషకాహార నిమిత్తం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.బియ్యం,పప్పు దినుసులు,గుడ్లు,పాలు,కూరగాయలు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించాలని,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ,క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ద్వారా దాతలు అందించిన నిత్యావసర సరకులు 3 కేజీల బియ్యం,కిలో పప్పు,లీటర్ ఆయిల్,30 కొడిగ్రుడ్లను వ్యాధిగ్రస్తులకు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ కావేటి రాజగోపాల్,లయన్స్ క్లబ్ సభ్యులు బండా బాబురావు,ఈ.శ్రావణ్,జి.మాధవి,కాంపెల్లి ప్రవీణ్ కుమార్,ఆర్.శశాంక,జి,రామచంద్రా రెడ్డి,డి.వి.ఎస్.మూర్తి,రెడ్ క్రాస్ సభ్యులు పి.శ్రీకాంత్,అచ్యుత్,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మక్తల్ నుండి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర*లోరాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలసి పాదయాత్ర లో పాల్గొన్నారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


చౌటుప్పల్ మున్సిపాలిటీ

పరిధిలోని 30, 32, 33, 39, బూత్ పరిధిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, హిందూ వాహిని నాయకులు గంజి భవనరుషీతో కలిసి ఇంటింటి

ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ భాజపా ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, అధిక సంఖ్యలో భాజపా

పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 


చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 9 వ వార్డులో తడక పద్మ అనారోగ్యంతో మృతి చెందడంతో. విషయం తెలుసుకున్న మునుగోడు మాజీbశాసనసభ్యులు. ప్రస్తుత భాజపా మునుగోడు అభ్యర్థి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తడక పద్మ కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. ఇట్టి ఆర్థిక సహాయాన్ని భాజపా మున్సిపల్ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, సుర్కంటి బాలకృష్ణ

చేతుల మీదగా తడక పద్మ కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు

నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకునే ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న




                                                పెద్దపల్లి:అక్టోబర్:26:రాఘవపూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నవంబర్ 5 నాటికి రాఘవపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌళిక సదుపాయ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవార కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు.పెయింటింగ్,ఉపాధి హామీ పనులు,మన ఊరు మనబడి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసే విధంగా అధికారులు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల కాంపౌండ్ వాల్ ఎత్తు దర్గా ఉన్న వైపు మరింత పెంచాలని,దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.పాఠశాలలో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని,విద్యార్థుల కోసం నిర్మించే టాయిలెట్స్ లో నిరంతర నీటి సరఫరా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.పాఠశాల ఫ్లోరింగ్ పనులు ఆకర్షణీయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల ఆవరణలో ఆకర్షణీయమైన పూల మొక్కలను నాటాలని,పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో ఈఈ పంచాయతీరాజ్ మునిరాజు,డి ఈ పెద్దపల్లి శంకరయ్య,ఎంపీడీవో రాజు,ఎఈ మదన్ మోహన్,మండల విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

రామగుండం ఎస్టి కాలనీకి చెందిన బానోతు రమేష్ విద్యుత్ శాఖ కాంటాక్ట్ కార్మికుడిగా అంతర్గాం మండలం బ్రాహ్మణ పళ్లిలో విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ స్తంభం లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగిస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగినది ఈ విషయం తెలుసుకున్న కార్మిక  బిజెపి రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి అధికారులతో చర్చలు జరిపి మృతుడి కుటుంబానికి ఎనిమిది లక్షల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చుటకై ఒప్పందం కుదిర్చినాడు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్ సలీం బేగ్ మాజీ కార్పొరేటర్ అహ్మద్ బాబు నిమ్మరాజుల రవి జరుపుల శ్రీను రాజశేఖర్ వినోద్ గంగారాం తదితరులు ఉన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 

రక్తదాన శిబిరంలో 201 యూనిట్ల రక్తం సేకరణ జరిగిందని, రక్త దాతలు, ప్రాణ దాతలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఆర్   ప్రధాన కార్యాలయంలో  మెగా రక్తదాన శిబిరాన్ని అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు తో కలిసి ఎస్పి  జె. సురేందర్ రెడ్డి   ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ పోలీసు అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. థలసేమియా, క్యాన్సర్,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా దాతలకు  కూడా మంచి చేకూరుతుందని ఎస్పి సురేందర్ రెడ్డి   అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ  అన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. 

రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది,  వివిధ యువజన సంఘాలు యువకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులను అభినందించిన ఎస్పి సురేందర్ రెడ్డి   వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నరసింహులు, వాసుదేవరావు, అజయ్, జితేందర్ రెడ్డి, కిరణ్, రంజిత్ రావ్, సంతోష్, సతీష్, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రవీణ్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

అంతర్గాం మండలంలోని గోదావరి నది తీరం వెంట పులి సంచరిస్తున్నదని గత పక్షం రోజుల నుండి ప్రచారం జరుగుతుంది దీనిని మొదటగా పెద్దంపేట గ్రామ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురువయ్య ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారం అందించి నిజము కాదో గుర్తించినారు ఫారెస్ట్ ఆఫీసర్ చిరుతపులి పాదముద్రల నిర్ధారించి ప్రజలు గొడ్ల కాపరులు రైతులు రాత్రి వేళల్లో తిరగకూడదని ప్రజలకు తెలియజేసినారు ఈ వార్త తెలిసిన ప్రజలు వాహనదారులు బాటసారులు రాత్రి వేళల్లో భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు అదే సందర్భంగా విలేజ్ రామగుండం పాములపాట గోదావరి తీర ప్రాంతంలో పులి తిరుగుతున్నదని మళ్లీ పుకార్లు వెళుతున్నాయి అసలు పులి ఉన్నదా ఇంతవరకు ఎవరు చూసింది మాత్రం లేదు పాదముద్రలను చూసి పులి తిరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది దీనిని వెంటనే నిర్ధారించి పులి ఉన్నదో లేదో ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రజలకు తెలియజేసి ప్రజలను భయాందోళనల నుండి విముక్తి చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఏఐసీసీ సెక్రటరీ మంథని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణానికి చెందిన *టిఆర్ఎస్ పార్టీ*యూత్ నాయకులు  *అష్రాఫ్ మరియు యాసీన్ సారథ్యంలో సుమారు 30  మంది హైదరాబాదులోని శ్రీధర్ బాబునివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు తదుపరి *పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి*నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా  టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికైనా నాయకులను మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని త్వరలో రాహుల్ గాంధీచేసె భారత్ జూడో యాత్ర లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరినారు చేరిన వారు యాసీన్, యూసుఫ్ ఖాన్,, అష్రాఫ్, ఇమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్, ఆల్ఫాన్, వినీత్, మహి, ఇస్రాత్, తహీర్, ఫిరోజ్, మున్వర్, వెంకటేష్, వీరి వెంట యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజిం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, ఈదునూరి హరిప్రసాద్, అంతర్గా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, యువజన కాంగ్రెస్ రామగుండం పట్టణ అధ్యక్షులు సిరి శెట్టి సతీష్ గౌడ్, రామగుండం కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి గౌస్ బాబా, ఎండి రషీద్,పాల్గొన్నారు,,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా (పోలీసు ఫ్లాగ్ డే) రేపు  (బుధవారం) జిల్లా  అర్ము డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  సురేందర్ రెడ్డి  మంగళవారం  తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత, అధిక సంఖ్యలో పాల్గొని  రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పి కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

 జయశంకర్ భూపాలపల్లి  జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిధిగా  హాజరై, సైకిల్ ర్యాలీలో జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి  పాల్గొన్నారు.

 పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగాల వల్లే  ప్రశాంత జీవనం గడుపుతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  అన్నారు. మంగళవారం   భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి హన్ మాన్ టెంపుల్, జయశంకర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీనివాసులుతో కలిసి, ఎస్పి సురేందర్ రెడ్డి  సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.  అనంతరం  ఎస్పి  మాట్లాడుతూ

ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మ రణోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ పోలీసులు మన్ననలు పొందాలని ఎస్పి  సూచించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉన్నదని, దానిని మరింత ఇనుమడింపజేసే విధంగా పని చేయాలనీ ఎస్పి సురేందర్ రెడ్డి   పేర్కొన్నారు. అలాగే ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం వ్యాయామం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహింస్తున్నామని ఎస్పి  పేర్కొన్నారు. 

ఈ ర్యాలీలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డి.ఎస్.పి రాములు, సీఐ రాజిరెడ్డి,  ఇన్స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, సతీష్, సంతోష్, ఎస్ఐలు అభినవ్ రామకృష్ణ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు,  మరియు పోలీసు  సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                                     


పెద్దపల్లి:అక్టోబర్ 25:అమరుల త్యాగాలు,నింగికెగసిన అమరత్వం,నేల కూలిన నెత్తుటి ధారల సజీవసాక్ష్యం,అతిపెద్దదైన అమరవీరుల స్తూపం ఆవిష్కరణ జరిగి నేటికీ 32 ఏళ్లు,హుస్నాబాద్‌,అక్టోబరు 25:‘‘బిడ్డలారా మీరొడ్డిన నెత్తుటిని..ఇంకనివ్వం నేలలోనా..పరిచినది పంచే కాదు.కడుపుకోత పేగులురా..అంటూ హుస్నాబాద్‌లో నిర్మించిన ఆసియాలో అతిపెద్ద అమరవీరుల స్తూపానికి నేటికీ 32 ఏళ్లు..31 సంవత్సరాల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు మరవలేని రోజు నాటి పీపుల్స్‌వార్‌.నేటి మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు.హుస్నాబాద్‌ ఎర్రజెండాలతో ఎరుపెక్కిన రోజు.వేలాది గొంతుకలు ఒక్కటై అమరులకు జోహార్లు,విప్లవ వీరులకు జోహార్లు అంటూ దిక్కులు పిక్కటిల్లెలా నినదించిన రోజు.సమసమాజ స్థాపనే ధ్యేయంగా,పెత్తందారి,భూస్వామ్య వర్గాల కబంధ హస్తాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం,నమ్ముకున్న విప్లవ బాటలో కడదాకా నడిచి అసువులు బాసిన అమరుల స్మారకార్ధం నిర్మించిన నెత్తుటి ధారల సజీవ సాక్ష్యం ఆవిష్కరించబడిన రోజు.అదే 1990 అక్టోబరు 25.చైనాలోని తియన్మాన్‌స్కైర్‌ తర్వాత హుస్నాబాద్‌లో పీపుల్స్‌వార్‌ నిర్మించిన ఆసియాఖండలంలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని ఇదే రోజున ఆవిష్కరించారు,88 అడుగుల ఎత్తులో స్మారక స్తూపం.పీపుల్స్‌వార్‌ ఉద్యమ అటుపోట్లకు సాక్షిగా నిలుస్తుందని భావించి నక్సలెట్లు ‍ఈ అమరవీరుల స్తూపం నిర్మించారు.కానీ ఇది శత్రువు కంటిలో నలుసుగా మారి 10 సంవత్సరాల కాలంలోనే ఈ స్తూపం నేల మట్టమయింది.కూలిన శిథిలాల వద్దకు వెళితే తెలియని భావోద్వేగం..గౌరవంతో కూడిన భయం.చెట్టంత కొడుకును పొగొట్టుకున్న ఆందోళన గోచరిస్తుంది1989 నుంచి ఏడాది పాటు అప్పటి పీపుల్స్‌వార్‌ ప్రతినిధులు,సానుభూతిపరులు,మిలిటెంట్లు,రైతులు,కూలీలు గ్రామాల్లో తిరుగుతూ పైసాపైసా కూడబెట్టి 1972–89 మధ్యకాలంలో రాజ్యం జరిపిన ఎదురుకాల్పుల్లో అమరులైన 88మంది పీపుల్స్‌వార్‌ అమరవీరుల స్మారకార్థం హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రోడ్డులోని ఎత్తైన ప్రదేశంలో 88 అడుగుల ఎత్తుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు.అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి సందేవేని రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌,ఆధ్వర్యంలో ఈ స్తూపాన్ని నిర్మించారు.రూ12లక్షలతో రాజస్థాన్‌ నుంచి నల్ల గ్రానైట్‌ రాయిని తెప్పించి నిర్మాణం చేశారు.110 కిలోల బరువు కలిగిన భారీ ఆకారంలో సుత్తి కొడవలి చేయించి స్తూపంపైన ఉంచారు.నల్లటి స్తూపంపైన ఎర్రటి సుత్తికొడవలి మరింత ఆకర్షణగా నిలిచింది,ఈ నిర్మాణంలో బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు,రైతులు,కూలీలు భాగస్వాములై అమరత్వం నింగికెగసేలా స్థూపాన్ని తీర్చిదిద్దారు1989 నుంచి సంవత్సరం పాటు ఈ ప్రదేశం విప్లవ గీతాలు,పనితో పాట.సామూహిక భోజనాలు,ప్రజాకోర్టులతో నిత్యం సందడిగా ఉండేది.ఈ స్తూప నిర్మాణంలో హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామానికి చెందిన బొమ్మగాని నారాయణ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.88మంది అమరుల పేర్లను స్తూపం కింది భాగంలో చెక్కించారు.ఈ నిర్మా ణం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించినా దానిని ఎదుర్కొని నిర్మించారు.అధికారుల కిడ్నాప్‌ స్తూప ఆవిష్కరణకు ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో అప్పుడు ఇక్కడ పని చేస్తున్న వయోజన విద్య ప్రాజెక్టు అధికారి శేషుకుమార్‌,ఏఈ బాల్‌లింగారెడ్డి,ఎంఆర్‌వో రాజమౌళిని కిడ్నాప్‌ చేసి ఆవిష్కరణకు ఆటంకం కల్పించొద్దని స్థానిక దళం డిమాండ్‌ చేసింది.దీంతో 25 అక్టోబరు 1990 లో ఎర్రజెండా రెపరెపల మధ్య స్తూపావిష్కరణ జరిగింది.పోరుబాటలో అమరుడైన పులిరాములు@కిరణ్ తండ్రి పులి మల్లయ్య  ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమానికి ప్రజాయుద్ధనౌక గద్దర్‌,విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు,బాలగోపాల్‌,శ్రీమన్నారాయణ హాజరై అమరవీరుల త్యాగాలను వివరించారు.అప్పటి నుంచి హుస్నాబాద్‌కు ఈ స్తూపం ఎంతో వన్నె తెచ్చింది.ఎంతో మంది పర్యాటకులను ఇక్కడికి రప్పించుకుంది.వేర్పాటు వాద సంస్థ అయిన జేకేఎల్‌ఎఫ్‌ నాయకుడు యాసీన్‌మాలిక్‌ ఈ స్తూపాన్ని సందర్శించి పరవశించాడు.అనంతరం పీపుల్స్‌వార్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో అప్పుడు 180మందిపై కేసులు పెట్టారు.ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేశారు.2000 సంవత్సరంలో కూల్చివేత

పీపుల్స్‌వార్‌ ఉద్యమం తీవ్రమైన క్రమంలో 1991 డిసెంబర్‌ 19న అక్కన్నపేట మండలం రామవరం వద్ద పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో సీఐ యాదగిరి,ఎస్‌ఐ జాన్‌విల్సన్‌లతో పాటు మరికొంతమంది మృతిచెందారు.అయితే ఎక్కడ వార్‌ ఘటనలకు పాల్పడిన ఈ స్తూపం మీదనే పగతీర్చుకునే వారు.అలా మూడుసార్లు దీనిని కూల్చివేసేందుకు యత్నించారు.దీంతో పాక్షికంగా దెబ్బతిన్నది. జనవరి 2000 సంవత్సరంలో హుస్నాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇంటిని పేల్చివేయడంతో గ్రీన్‌టైగర్స్‌ పేరుతో స్తూపాన్ని డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వం సం చేశారు.దీంతో స్తూపం నేల మట్టమైంది.నేల మట్టమైన శిథిలాలను ఈ ప్రాంత ప్రజలు తమ ఇండ్లలో ఉంచుకుని నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.బౌతికంగా స్తూపం నేలమట్టమైనా భావితరాలకు ఈ శిథిలాలు అమరులైన వీరుల త్యాగాల చరిత్రను జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



చౌటుప్పల్: మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపి ఆమోదం తెలిపిన

కుటుంబ పాలనకు అవుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కుమార్

అన్నారు. డబుల్ ఇండ్లు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు సహాయం చేయకపోయినా ప్రజలు తమ పాలనకు ఆమోదం తెలిపారని కేసీఆర్ అహంకారం నెత్తికి ఎక్కుతుందని అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని

11వ వార్డులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ కుమార్ తన

ప్రచారాన్ని ప్రారంభించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11,19, వార్డు పరిధిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు బిజెపిని గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 11 వార్డ్ కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు గారి ఇంటికి వెళ్లడం జరిగింది. మళ్లీ అక్కడి నుంచి 9, 10 వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది బండి సంజయ్ రాకతో రాజగోపాల్ రెడ్డి గారు కచ్చితంగా  మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండలం నాయకులు, ఊడుగు వెంకటేశం గౌడ్, చౌటుప్పల్ టౌన్ అధ్యక్షుడు మోదుగాల రమేష్ గౌడ్ తరుపున ముఖ్యనాయకులు పాల్గొనడం జరిగింది
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                                                                                                                         



                                                                                   పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:23:పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,గోదావరిఖనికి సమీపంలోని,సుందిళ్ల గ్రామంలో గార్రెపల్లి భారతి,మాజీ ఎంపీటీసి బోగిరి రాములు తల్లి,భోగిరి భానమ్మ ఇటీవల మరణించగ,ఆదివారం మంథని టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు,మృతుల చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.జడ్పీ చైర్మన్ వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ; ఆటో లో అక్రమంగా తరలిస్తున్న 

25 క్వింటాళ్లు ప్రజా పంపిణీ బియ్యం జిల్లా విజిలెన్స్ అండ్  ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం  పట్టుకున్నారు. 

 అనిల్ కుమార్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , వరంగల్  మరియు యం.కృష్ణా, డిప్యూటీ తహశీల్దార్ (పౌర సరఫరాలు) హాసన్ పర్తి, కోమటిపల్లి గ్రామము, హాసన్ పర్తి మండలము నందు కట్ల మనోహర్  వడ్డేపల్లి గ్రామము అను వ్యక్తి (50) బస్తాలలోని (25.00 )క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యాన్ని ఆటోలో అక్రమ రవాణా చేయుచుండగా పట్టుకొని, బియ్యాన్ని సీజ్ చేసి,  కే.యు.సి. పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ;

హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెజోనెన్స్ తెలంగాణ 8వ రాష్ర్ట స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ను  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా హన్మకొండ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. క్రీడాకారుల కమిటీ ఉద్యోగుల  కల్పన లోనూ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పని చేస్తుందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్ని రంగాల్లో  అభివృద్ధి చెందుతున్న తరుణంలో జాతీయ , అంతర్జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలా ఏదో ఒక క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేసి, నన్ను ఆహ్వానించి పండుగ వాతావరణంలా జిల్లా యంత్రాంగం అందరూ కలిసి  క్రీడాకారులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారిని అభినందించారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి వారు పరేడ్ చేయగా వారిని పలకరించి పరిచయం చేసుకున్నారు. తన నెలసరి జీతం 1 లక్షా 16 వేల రూపాయలను అథ్లెట్ కీట్స్ కోసం ఇస్తానని అన్నారు. అనేక క్రీడలను ప్రోత్సహించే విధంగా  క్రీడా ప్రాంగణాలను తయారు చేస్తున్న ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులను అభినందించారు. గెలుపే  లక్ష్యంగా పనిచేయాలని, ఓటమి తో నిరుత్సహాపడ కూడదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ , రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, హనుమకొండ  జిల్లా అధ్లేటిక్ అధ్యక్షుడు  ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమార్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ ఐలి చంద్రమోహన్ గౌడ్, వివిధ విభాగాల కోచ్ లు వెంకటేశ్వర రెడ్డి, యుగేందర్ రెడ్డి , పవన్ కుమార్,  కైలాస్ యాదవ్ , రమేశ్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.