పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న




                                                        పెద్దపల్లి:మంథని:అక్టోబర్:27:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటు,ఇది బీజేపీ నీచ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట అని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ఆద్వ‌ర్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్తలు మంథని పట్టణంలో   బీజేపీ,ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు.ప్ర‌ధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.అనంత‌రం జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడారు భారతదేశమంతా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చినట్టుగా కూల్చాలని తెలంగాణలో కూడా అదే విధంగా ప్రయత్నాలు చేయాలని సంకల్పించినటు వట్టి బీజేపీ పార్టీ,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు,బిజెపి కుట్రను తిప్పికొట్టి చరిత్రను సృష్టించినటువంటి విషయం యావత్ దేశమంతా చూస్తున్నాదని అన్నారు,బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చేష్టలను మానుకోవాలని ఇటువంటి ప్రయత్నాలు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అనే విషయాన్ని గమనించాలని బిజెపి పార్టీకి,మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ చురకలు అంటించింది,డబ్బుల రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు డబ్బులతో కొనుగోలు చేయాలని సందేశం ప్రజాస్వామ్యానికే ఇది గోడ్డలి పెట్టు లాంటిది బీద ప్రజాప్రతినిధులు,కావాలంటే ఈ విధంగా డబ్బులు చూస్తుంటే భయపడే విధంగా కనబడుతుంది,దీని తీవ్రంగా మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఇటువంటి వాటికి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని ఈ సందర్భంగా బిజెపి,మోడీని హెచ్చరిస్తా ఉన్నాం ఇటువంటి పునరావతం కాకుండా చూసుకోవాలని  టిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గం,బీజేపీ,మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: