ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం శివారులోని మూలమలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం షరీఫ్ వచ్చి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. తీవ్ర విషాదం. దైవ దర్శనం వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారులో డ్రైవర్ సహా ఏడుగురు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు వెలిక్కి తీయగా.. మరో ఇద్దరు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కారులో ఉన్నవాళ్లలో కొందరు గాయపడినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. కేసముద్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి కారును, బావిలో పడిన బాధితులను స్థానికుల సహకారంతో వెలికి తీసే ప్రయత్నాలు చేపట్టారు.


Post A Comment: