February 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి ప్రభావిత ప్రాంతమైన ముస్త్యాల గ్రామ నివాసులు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును వేడుకొనగా, తమకు ఓసిపి ఫైవ్ లో   ఉపాధి కల్పిస్తామని చెప్పగా, గ్రామ నివాసులు 10 మంది, దానికి సంబంధించిన వి.టి.సి. ట్రైనింగ్ కంప్లీట్ చేసినా కూడా,  పీసీ పటేల్ కంపెనీవారు ఉపాది ఇవ్వకుండా జాప్యం చేస్తూ తమ జీవితాలతో  ఆడుకుంటున్నారని వేదన వ్యక్తం చేశారు.  తమకు ఉద్యోగం ఇవ్వకుండా జాప్యం చేస్తూ తమని, తమ కుటుంబాలను మానసికంగా వేదనలకు గురి చేస్తున్న పటేల్ కంపెనీ పై చర్య తీసుకొని  తమకు ఉపాధి కల్పించి తమకు, తమపై  ఆధారపడే కుటుంబాలను కాపాడమని,  జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి ద్వారా విన్నవించు కున్నామని చెప్పారు. తమకు త్వరగా ఉపాధి కల్పించి, తగు న్యాయం చేయాలని  ముస్త్యాల గ్రామవాసులు, నిరుద్యోగ భాదితులైన పిడుగు గట్టయ్య, మెరుగు రవి, జనగామ శంకర్, బెల్లంకొండ స్వామి, గోశిక లింగస్వామి, సిద్ధ కనకయ్య, సుంకరి సమ్మయ్య, పోతం రాయమల్లు, పోతం రవి, కొండ రాజేందర్ లు పత్రికా ముఖంగా వేడుకొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖనిలోని దుర్గా నగర్ బృందావన్ గార్డెన్ లో ఓబి కాంట్రాక్టు కార్మికుల సమ్మె సన్నాహక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓబి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు కౌశిక్ హరి, బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి, పూసాల తిరుపతి, ఏ వెంకన్న, తోకల రమేష్ హాజరై మాట్లాడారు

ఓబి యాజమాన్యాలు సమ్మె విచ్చిన్నానికి పాల్పడే విధంగా బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. సమ్మె నోటీసు డిమాండ్ నోటీసులు ఇచ్చినప్పటికీ చర్చలు చెప్పకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ లక్ష్యంగా ఓబి యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క పైసా వేతనం పెంచకుండా లక్షల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె ఒకటే పరిష్కారంగా భావించి మార్చి 6 నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఓబి యాజమాన్యాలు సమ్మె ఇచ్చిందానికి పాల్పడితే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. మార్చి 6 తారీకు నుంచి జరిగే సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొని ఓబి యాజమాన్యాలకు చెంపపెట్టుగా నిలవాలని సందర్భంగా పిలుపునిచ్చారు.

*ఈ కార్యక్రమంలో 300 మంది ఓబీ కాంట్రాక్ట్ కార్మికులతో పాటు జేఏసీ నాయకులు ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్, మహావాది రామన్న పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ- ఐ ఎఫ్ టి యూ ల ఆధ్వర్యంలో గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఆర్ ఎఫ్ సి ఎల్ లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో *సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ఉద్యగాల పేరు తో నిరుద్యోగ బాధితుల దగ్గర తీసుకున్న మొత్తం డబ్బులను తిరిగి దళారులు సబ్ కాంట్రాక్టర్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.

అలాగే ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం 119 మంది లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల గేట్ పాసులు తొలగించడం జరిగింది.తిరిగి యాజమాన్యం వెంటనేగేట్ పాసులు ఇచ్చి లోడింగ్ అన్లోడింగ్ పనుల్లో పెట్టుకోని ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సౌకర్యాలు ఇతర చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. 

అలాగే మిగిలిన బాదితులకు ఇంక రావలసిన డబ్బులు సబ్ కాంట్రాక్టర్లు వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టర్ల ను డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఆర్ ఎఫ్ సి ఎల్ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు బాసర వేణి రమేష్ ,ఐత శ్రావణ్, తిప్పని రాంకీ,నక్క మల్లేష్,  శివకుమార్, జక్కుల తిరుపతి, సురేష్,అర్కుటి కుమార్, మర్రి శ్రావన్,పూర్ణచందర్,కుమార స్వామి, మర్రి రాము. తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్*

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మెడికో ప్రీతి మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు*.ఈ మేరకు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి వెంకట్ సోషల్ మీడియాలో లేక విడుదల చేశారు.మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు.వరంగల్లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాంగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్న, యాజమాన్యం ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని వెంకట్ ఆరోపించారు.ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే, ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తుందని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆఫీసుల్లో మహిళలపై వేధింపులు, కాలేజీలలో ర్యాగింగ్ నిత్య కృత్యమయాయని, మహిళలు ఇక ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో,  మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

 సీనియర్‌ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృత్యువుతో పోరాడి మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన మరవక ముందే వరంగల్‌ నగరంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సీనియర్‌ వేధింపులు తాళలేక ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భూపాలపల్లికి చెందిన శంకరాచారి-రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. రక్షిత మరొకరితో కలిసి ఉన్న ఫోటోలను సీనియర్‌ విద్యార్థి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడంతో మనస్తాపానికి గురైంది. దీంతో వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షిత మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 

 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఉమ్మడి వరంగల్ జిల్లా 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో 150 కోట్ల నిధులతో  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

సోమవారం  మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా మధ్యాహ్నం 1.55 గంటలకు సోడాషపల్లి లోని రైతు వేదిక ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకన్నారు.రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ సీపీ రంగనాధ్ ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే తాటికోండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఎత్తైన ప్రాంతాలైన  చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల పైప్ లైన్ ద్వారా 3 మిని ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఈ మూడు మినీ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం 104 కోట్లు ఖర్చు చేసి నిర్మించనుంది. 3 లిఫ్ట్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వేలూరు మండల కేంద్రం వరకు 25 కోట్లతో వేసిన డబుల్ రోడ్డును ప్రారంభించారు, అనంతరం నారాయణగిరి నుంచి పీచురు వరకు 10 కోట్లతో  వేసే డబుల్ రోడ్డు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డ్స్, తెలంగాణ  ప్రభుత్వం  ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి  అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన  కార్యాలయంలో ఎస్పి  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించబడే ఈ కార్యక్రమములో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై ఎస్పి  సంబంధిత అధికారులు, కంటి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి  సిబ్బందికి కంటి అద్దాలు, మందులను అందజేసారు.

అనంతరం ఎస్పి సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ నిత్యం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా కంటి సమస్యల పట్ల అశ్రద్ధ వహించవద్దని అన్నారు. పోలీసు సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు జరిపి, అవసరమయిన వారికి కంటి అద్దాలను, మందులను అందించడం జరుగుతుందన్నారు. పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, బండ సతీష్, సంతోష్, డాక్టర్లు, ఉమాదేవి, భాస్య, నర్మద, విద్యాసాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా లోని వివిధ మండలాల నుంచి వచ్చిన 14 మంది బాధితుల పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి న్యాయం చేకూర్చే విధంగా భరోసా కల్పించాలని అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి, విచారణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పి  ఆదేశించారు.

 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పిల్లలు జీవనాన్ని కొనసాగిస్తే, సమాజంలో తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని, యువత బంగారు భవిష్యత్తు కోసమే నా తపన తాపత్రయమని.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. స్థానిక దుర్గానగర్ లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు, పరీక్షల్లో విజయసాధనకు ఏర్పాటుచేసిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు గర్వించే స్థాయికి పిల్లలు ఎదగాలని అందుకు అనుగుణంగానే పిల్లలు జీవనాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జీవితాన్ని ఎలా మార్పు చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉందన్నారు. రామగుండం చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉన్నత లక్ష్యం ఎంచుకొని, సమయపాలనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి, ఉపాధి కోసం స్థిరపడ్డారన్నారు. పట్టుదల, తపన, తాపత్రయం కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చునని,  అందుకు తానే ఒక ఉదాహరణని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన తాను, ప్రజలకు సేవ చేయాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగానని, చివరకు విజయం సాధించానన్నారు. ఇతరుల సంక్షేమం కోసం కృషి చేస్తే, తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్  సారధ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమించి..తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు.  చక్కటి ప్రణాళికతో కష్టపడితే విజయం తధ్యమని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు. స్థానిక యువత కోసం, ప్రజల కోసం ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే  తెలిపారు.రామగుండం ప్రజల స్థితిగతుల మార్పు కోసం, వారి ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగానని, అందుకనుగుణంగానే స్థానికంగా మెడికల్ కళాశాల ఏర్పాటు  చేశానన్నారు. 24 గంటల పాటు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చునని ఎమ్మెల్యే  తెలిపారు. గొప్ప ఆలోచన కలగాలని పట్టుదల పెరగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఎమ్మెల్యేగా తెలిపారు. కాగా స్క్వాడ్రన్ లీడర్ జయసింహ ఇచ్చిన మెలకువలు, ప్రేరణ, స్ఫూర్తిదాయక కథలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్యే  విద్యార్థులను అడగగా.. బండారి వైష్ణవి అనే విద్యార్థిని ధైర్యంగా స్టేజ్ పైకి వచ్చి తాను నేర్చుకున్న అంశాలను వివరించడం జరిగింది. విద్యార్థిని ప్రతిభకు మెచ్చి ఎమ్మెల్యే  ఆమెకు అవసరమైన పుస్తకాలను యూనిఫామ్లను ఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా కోరుకంటి స్టడీ సర్కిల్ అనే యాప్ ను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ఎమ్మెల్యే  జయసింహ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు రమణారెడ్డి బాలరాజు కుమార్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు ధరణి జలపతి, తానిపర్తి గోపాలరావు, దయానంద్ గాంధీ, పీఎస్ అమరేందర్, బెందె నాగభూషనం గౌడ్, ప్రభంజన్ రెడ్డి,  చిలుముల నాగరాజు, యూత్ నాయకులు మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని బృందావన్ ఫంక్షన్ హాల్ లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి ఓబి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది ఓబిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రావలసిన వేతనాల సవరణ కొరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన మార్చి 6 సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు అందరూ ఒక తాటిపై ఉండి పార్టీలకతీతంగా కలిసి రావాలని హక్కులు సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం అయి ఉద్యమించక తప్పదని సంఘాల నాయకులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు గత నాలుగు సంవత్సరాలుగా కార్మికులకు పెరగవలసిన వేతనాలు కోవిడ్ సమయంలో ప్రాణాపాయం ఉందని సమ్మెను విరమింపజేసి ప్రజ కార్మిక ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న సిపి గారు కోవిడ్ తర్వాత సరైన వేతనాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేయడంతో సమ్మె విరమించుకొని యజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించడం జరిగింది కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో రెప్రెటేషన్లు చేసిన స్పందించని సింగరేణియజమాన్యం ఓబీ  యజమాన్యం మాట తప్పడంతో   కార్మిక సంఘాల జేఏసీ మళ్లీ ఒక తాటిపైకి వచ్చి మార్చి ఆరో తారీకు వరకు యజమాన్యానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఓబి యజమాన్యం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నందున రామగుండం రీజినల్ లో అన్ని బోబిలా కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి గేట్ మీటింగ్లో పెట్టి కార్మికులని ఒక తాటిపైకి తీసుకువచ్చి కచ్చితంగా యజమాన్యం మెడలు వంచన సరే కార్మికులకు రావాల్సిన పెరగవలసిన వేతనాలు కార్మిక హక్కులను సాధిస్తామని  కార్మిక సంఘాల జేఏసీ కార్మికుల మధ్య వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు  బుర్ర తిరుపతి గౌస్ శనిగరపు శ్రీనివాస్ శాతవాహన మల్టిపుల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు కౌశిక్ హరి ఐ ఎన్ టి యు సి నాయకులు పూసాల తిరుపతి టి కే ఏస్ బి నాయకులు మద్దెల శ్రీనివాస్ ఐఎఫ్టియు అనుబంధ సంఘాల నాయకులు తోకల రమేష్ ఆకుల వెంకన్న   సిఐటియు నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: మంథని నియోజకవర్గంలోని, అన్ని మండలాల పరిధి, గ్రామాలలోని ప్రజలంతా కల్మషం లేని కమలానికి ఆకర్షితులై, బిజెపి వైపు పయనిస్తున్నారు.గతంలో పరిపాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పరిపాలనలో ఉన్న అవినీతి  (టిఆర్ఎస్) బిఆర్ఎస్ రెండు పార్టీల ప్రభుత్వాలు తోడు దొంగలేనని, ప్రజలు చర్చించుకుంటున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్ట సుఖాలలో భాగస్వామి అయిన పేదల ఆశాజ్యోతి, మంథని డైనమిక్  మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి కి,ప్రతి గ్రామంలో తనకున్న అన్ని వర్గాల వీరాభిమాన  నాయకులు, సోదరీమణులు, యువకులు, ప్రజలందరి పరిచేయాలతో తనయుడు సునీల్ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు మహాదేవపూర్, పలిమెల, మహా ముత్తారం, మల్హర్, కాటారం మండలాలలోని ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో, మంథని నియోజకవర్గం లో ఒక్కసారే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అభివృద్ధి లక్ష్యంగా, పేదలకు అండగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, సత్వర న్యాయం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, పేదలకు గృహాల మంజూర్ వంటి ఉపయోగపడే నమ్మకమైన హామీలు ఇస్తూ ప్రజలకు ఆకర్షితులవుతున్నారు. మంథని నియోజక వర్గం గడ్డపై వచ్చే ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మంథని బిజెపి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పవిత్ర షిర్డి లొ స్వర్గీయ  కన్నూరి సౌందర్యమ్మ జ్ఞాపకార్థం  అన్నదానం నిర్వహించిన రామగుండం 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్. షిర్డి లొ నిత్య ఉచిత భోజన వసతి కల్పిస్తున్న గురూజీ అన్నదాన క్షేత్రంలొ అన్నదానం ఏర్పాటు చేయించారు. ఈ క్షేత్ర నిర్వహకులు నిత్య సాయి ఉపాసకులు శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ.  రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలొని శ్రీ షిర్డి సాయిబాబా మందిర కమీటీ ఛైర్మన్ గా 27 సంవత్సరాలు గా సేవలందిస్తున్నారని తెలిసి శాలువతొ , పూలమాలతొ, సాయిబాబా చిత్ర పటం అందించి,  పూలుజల్లి సత్కరించి, అశీర్వదించిన శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ*ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతు " సాయి భక్తుడిగా ఉండడమే గొప్ప అదృష్టమని, అందులొ సాయి మందిరం నిర్మించడం, నిత్య పూజలు నిర్వహించడమంటె పూర్వ జన్మ సుకృతమని, తల్లిదండ్రులను మరువని వారికి ఆ సాయి అశీస్సులు ఎపుడు ఉంటాయని, తన తల్లి పేరిట అన్నదానం నిర్వహించడం,  నిరంతరం సాయి సేవలొ ఉంటున్న కన్నూరి సతీష్ కుమార్ అభినందనీయుడని" అన్నారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు " ఆ శిర్డి సాయి దశాబ్దకాలం అనంతరం షిర్డి రావడమైనదని, ఆ బాబా దర్శించుకుంటె చాలనుకుంటె, ఇక్కడి గురూజీ అన్నదాన క్షేత్రంలొ మా అమ్మగారు స్వర్గీయ  కన్నూరి సౌందర్యమ్మ జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, ఈ సమయంలొ బాబా పరమ భక్తులు తరచు హిమలయలలొ సాయిదీక్ష ధ్యానం ఉండె శ్రీ నీలకంఠ మహదేవ గురూజీ స్వయంగా సత్కరించడం నిజంగా గొప్ప గౌరవం గా భావిస్తున్నాని, శ్రీ షిర్డి సాయికృపతొ, మా ఆమ్మ,నాన్నల అశీర్వాదంతొ, వీలైనంతగా మాధవ సేవను, మానవ సేవను నిరంతరం కొనసాగిస్తు ఉంటానని " అన్నారు. ఈ కార్యక్రమంలొ మందిర కార్యదర్శి కలవేని.మల్లేశం, పూజారి రాంపెల్లి శ్రీనివాశ్ శర్మలను కూడ సన్మానించారు. రామగుండం సాయి భక్తులు కె.కె.స్వామి, కె.రాకేష్, పి.రవివర్మ లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


యైటింక్లయిన్ కాలనీ, ఫిబ్రవరి 26: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు దుర్గం శంకర్ - వసంత దంపతుల తృతీయ కుమారుడు శ్రీనాథ్ ఎమ్మెస్ లో ర్యాంకు సాధించి  కెనడాకు వెళ్తున్న సందర్భంగా ఆదివారం నాడు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమత ఫౌండేషన్ చైర్మన్ నగేష్ , తెలంగాణ నేతకాని మహర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువనచంద్ర తో కలిసి శ్రీనాథ్ ను అభినందించారు. ఈ సందర్భంగా వారు శ్రీనాథ్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ.. కష్టపడి చదివించిన తల్లి-దండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని,  సమాజానికి,రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఎదగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఏ అవసరం వచ్చినా తమకు సంప్రదించాలని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ తల్లిదండ్రులు  దుర్గం శంకర్-వసంత , అన్నయ్యలు విశ్వనాధ్ సాయినాథ్ తదితరులు ఉన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని  నరేంద్ర మోడీ  భారతదేశానికి మచ్చలేని అవినీతి రహిత పాలన అందిస్తున్నారని *బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్  అన్నారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఫైవ్ ఇన్క్ లైన్ మండల శక్తి కేంద్రం అధ్యక్షుడు కర్రావుల డేవిడ్ రాజ్ అద్వర్యం లో 153,193,194 పోలింగ్ బూత్ లకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వారు పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా  సోమారపు లావణ్య  మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో మహిళల కోసం ఉచిత గ్యాస్, మరుగుదొడ్లు, బాలింతకిట్లు, రైతుల కోసం ఏటా 6000 నిది, ఎరువుల సబ్సిడీ, ప్రతి ఏటా మద్దతు ధర పెంపు లాంటి కార్యక్రమాలు, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి ఎన్నో పథకాలను శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నారని వారన్నారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ,రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి,

మాజీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకన్న,బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీ కొమ్మ శ్రీనివాస్, మామిడి వీరేశం, బూత్ అధ్యక్షులు రమేష్, సంపత్, రాజు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపెట్ గ్రామానికి చెందిన మేర్గు లక్ష్మింపతి  కల్లు గీత కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో చెట్టుపైనుండి  పడి గాయల పాలయ్యరు , కల్లుగీత కార్మికులకు బిఆర్ఎస్ ప్రభుత్వం BC సంక్షేమ నిధి ద్వార  అర్థిక సహయం 15000 చెక్కును అందించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సబ్యులు ఆముల నారయణ   ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ  కల్లుగీత కార్మికులకు ఎల్లప్పుడు అండగా వుంటానని, ఈ సందర్భంగా తెలియజెసారు .. 

ఈ కార్యక్రమంలో 

సర్వీయ్ పాపన్న జిల్లా అద్యక్షులు ముల మల్లెష్ ,BC కార్పోరేషన్ సినియర్ అసిస్టెంట్ రమేష్ సర్పంచ్ మేర్గు బాగ్యమ్మ , గౌడ సంఘం రాష్ట గౌరవ సలహాదారులు కోల లక్ష్మన్ , పెద్దంపెట్ గౌడ సంఘం అధ్యక్షులు మేర్గు రమేష్ , వైస్ మహేష్ , బిఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు ..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని, జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు..


కాల్పుల్లో ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ ప్రెస్ నోట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..


జాగర్‌గూడ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ దాడి పై బస్తర్ మొత్తాన్ని పోలీసు క్యాంపుగా ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. నాలుగు నెలల్లో మొత్తం తొమ్మిది క్యాంపులు తెరిచి ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారన్నారు. అత్యాధునిక సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు, నిఘా విమానాల సహాయంతో ఆ ప్రాంతాన్ని పర్యావేక్షిస్తున్నారు. మినపా క్యాంపుతో సహా ఇతర పోలీస్ స్టేషన్లు, శిబిరాల్లో కాల్పులు, బాంబు దాడులకు రిహార్సల్ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక దాడులను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు మిర్చి ఏరడం, కూలీ కోసం వెళ్తున్న కూలీలను కూడా మావోయిస్టు నేపథ్యంలో అరెస్టు చేస్తున్నారంటూ గంగ ఆరోపించారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

CPI (M-L) న్యూడెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం (PYL) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న, ఆరుముళ్ళ భూమన్నల 31వ వర్థంతి సభను స్మారక స్తూపం వద్ద నిర్వహించడం జరిగింది.     ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ..గత 30 ఏళ్ల క్రితం అతివాద అరాచక శక్తులు అత్యంత కిరాతకంగా పీ వై ఎల్ నాయకులు కామ్రేడ్ కత్తరమల పోచన్న ను కొంతమంది విప్లవ ముసుగులో అతివాద అరాచక శక్తులు అత్యంత దారుణంగా హత్య చేయగా,  అలాగే కామ్రేడ్ ఆరుముళ్ళ భూమన్నను పోలీసు భూటకపు  ఎన్ కౌంటర్ లో హత్య చేయబడ్డాడు. 

ఈ హత్యల ద్వారా కొంత మంది ఆనందం పొందారని ఈ ప్రాంతంలో విప్లవ పార్టీ ని లేకుండా చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు, వారి కుట్రలను కుతంత్రాలను ఎదిరించి ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టుకొని ప్రజా పోరాటాల్లో ముందున్నామని అన్నారు.

   కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న, ఆరు ముళ్ల భూమన్నలు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు నడిపిన విప్లవ వీర కిశోరాలని, వీరి పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని అప్పుడే పోచన్న, భూమన్నలకు నిజమైన నివాలులని అన్నారు. 

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఎన్నికల సందర్భంలో ఎన్నో వాగ్దానాలు చేశారని ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 

   కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు 9 ఏళ్ల పాలనలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ యువతను గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అందుకు అమరులు అందించిన పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఈ సందర్భంగా ప్రజలకు యువతకు పిలుపునిచ్చారు.

   ఇంకా ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కె మల్లేష్, నాయకులు మేరుగు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, PYL రాష్ట్ర నాయకులు ఆరుమూళ్ళ తిరుపతి, జిల్లా అద్యక్షుడు కసిపేట దర్మెందర్, ఉపాధ్యక్షుడు సమ్మెట తిరుపతి, AIKMS జిల్లా నాయకులు వేల్పుల సాంబన్న, నాయకులు కాదాసు లింగమూర్తి, మొగిలన్న, తీగుట్ల నవీన్, B సాగర్, E బాబు, K కిషన్, ప్రేమ్, R ప్రశాంత్, P స్వామి, M జంపయ్య, M రాజరాం తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ ఫైనల్ విజేతలకు కప్ అందించేందుకు వెళ్తున్న తరుణంలో రీక్ష తొక్కుకుంటూ వెళ్తున్న వృద్ధుడు భూక్య సారయ్య ని చూసి చలించిపోయిన చీఫ్ విప్  వాహనం దిగి తన దగ్గరకి వెళ్లి అతని కుటుంబ స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొన్నారు. తనకు ఆర్థిక చేయూత అందించి వృద్ధ వయసులో  రీక్ష తొక్కకూడదని విజ్ఞప్తి చేసి కుటుంబ పోషణకై సులువైన ఉపాధి కల్పన  చూపిస్తానని సారయ్య కి  చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం, సభా స్థలి, శంకుస్థాపన చేసే కార్యక్రమ స్థలాలను పరిశీలించారు.

అనంతరం ఆయా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త ల పై అధికారులకు తగు సూచనలు చేశారు.

కార్యక్రమాలు జరుగుతున్న చోట్ల, మంచినీటి ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేయాలని, అధికారులను, గ్రామ కార్యదర్శులను, ఇతర సిబ్బందిని, నియమించి పారిశుద్ధ్య పనులు నిర్వర్తించాలని, రోడ్లపై నీటిని చల్లి, దుమ్ము లేవకుండా చేయాలని మంత్రి హనుమకొండ డిఆర్డిఓ  శ్రీనివాస్ కుమార్ ను ఆదేశించారు.

అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

అధికారులతో కొద్దిసేపు మాట్లాడి ఆనాటి కార్యక్రమాల పై సమీక్షించారు

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, ఎమ్మెల్సీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,

ఈ నెల 27న ఒకే రోజు 150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారు.

అత్యంత ఎత్తు గా ఉన్న, కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న ఆ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించే 3 ఎత్తిపోతల ప్రాజెక్టులకు, వివిధ రోడ్లకు శంకుస్థాపనలు జరుగుతాయి.

అనంతరం ఈ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందేలా చేసిన సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతగా ఈ ప్రాంత రైతుల కృతజ్ఞత సభ భారీ ఎత్తున 30 వేల మందితో ఘనంగా జరుగుతుంది.

ఇప్పటి వరకు అంతా చెప్పారు. ఎవరూ ఏమీ చేయలేదు.

సీఎం కెసిఆర్  దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి నిధులు ఇచ్చి, 3 లిఫ్టులు ఏర్పాటు చేస్తున్న మనసున్న మహారాజు కెసిఆర్. 

గతంలో ఎప్పుడూ ఈ స్థాయి అభివృద్ధి జరగలేదు.

ప్రతి పక్షాలు చెప్పే మాటలకు ప్రజల్లో విలువ లేదు.

ప్రజలు రాష్ట్రంలో బిఆరెస్  తప్ప ఇతర పార్టీల ను పట్టించుకోవడం మానేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక, మతి భ్రమించి మాట్లాడుతున్నారు.

వాళ్ళ మైండ్ దొబ్బింది. వాళ్ళతో అయ్యేది ఏమీ లేదు.

ప్రజలు బిఆరెస్  పక్షానే ఉన్నారు.రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేస్తూ, ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే లక్ష్యం లో భాగంగానే, ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టులు వచ్చాయి

సీఎం కెసిఆర్ కి, కేటీఆర్ కి ప్రజలు రుణపడి ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారు తమ మద్దతు తెలుపుతారు.

ప్రజలను కడుపులో పెట్టుకొని కెసిఆర్ చూసుకుంటున్నారు. అందుకే ప్రజలు బిఆరెస్  కు అండగా ఉన్నారు.

కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయడానికి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు కదిలి రావాలి.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఆర్ అండ్ బి 

 అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జనగామ పార్టీ అధ్యక్షుడు, జడ్పీ  చైర్మన్ సంపత్ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీ ధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ఈ ప్రజావాణి కార్యక్రమానికి 06 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అథికారి సూచించారు, ఇందులో 01 దరఖాస్తులు వ్యక్తిగత లోన్ల కోసం, 01 దరఖాస్తులు దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం, 02 దరఖాస్తు సదరం‌ సర్టిఫికెట్ కోసం,01 దరఖాస్తులు ట్రేడ్ లైసెన్స్ కోసం, 01దరఖాస్తులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం,   సమర్పించారని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలిపారు.

కార్యక్రమంలో డీఎమ్&హ్ చ్ఓ , అబ్దుల్ డిఈఓ, ఎజాస్ అహ్మ్ ద్  బిసీడబ్లు, డిఆర్డివో శ్రీనివాస్ కమార్,ఆర్ & బి రవీందర్ , రవీందర్ సీహ్చ్ఒ, ఈడిఎస్సి కార్పోరేషన్  మాధవిలత,  అనితారెడ్డి, మెప్మా నుండి రజిత ,  దివ్యాంగులు మరియు, సిడిపివో మధురిమ, భాగ్యలక్ష్మీ , స్వరూప, బీఆర్బీ కోఆర్డినేటర్ శిరీష, సఖి లీగల్ కౌన్సలర్ శ్రీదేవి ,జె ఏ రేవంత్ బాబు, ఎఫ్ఆర్వో రవి క్రిష్ణ,

దివ్యాంగుల జేఏసి కన్వీనర్ నల్లెల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఈ నెల 27న వేలేరు మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ తో కలిసి మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా వేలేరు మండలం  సోడాశపల్లి గ్రామ రైతు వేదిక ముందున్న స్థలంలో హెలిపాడ్ ఏర్పాటు చేయనుండగా.. ఆ పనులను  త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు చోట్ల పార్కింగ్​ ప్లేసులు, 30 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుండటంతో వాటికి సంబంధించిన స్థలాలనూ సందర్శించారు. అనంతరం వరంగల్ ఏనుమాముల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మార్కెట్ సబ్ యార్డ్ ను సందర్శించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గండి రామారం, కన్నారం, గుండ్ల సాగరం వద్ద నిర్మించనున్న మూడు లిఫ్ట్​ లకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనుండగా.. ఆ పనులనూ పరిశీలించారు. వారి వెంట డీఆర్వో వాసు చంద్ర, డీఆర్డీఏ పీడీ  శ్రీనివాస్ కుమార్​, డీసీసీబీ డైరెక్టర్​, ధర్మసాగర్​ పీఏసీఎస్​ చైర్మన్​ గుండ్రెడ్డి రాజేశ్వర్​ రెడ్డి,  ఎంపీపీ సమ్మి రెడ్డి, తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జిల్లాలో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమం పై శనివారం  జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే జిల్లాలో అమలవుతున్న మన ఊరు మన బడి పనులు వేగంగా కొనసాగించాలని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు.

 జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సెక్టోరల్ అధికారులు, మండల ఎఫ్ ఎల్ ఎన్  నోడల్ అధికారులు,  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, డిపి ఏం యు సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించి జిల్లాలో తొలిమెట్టు అమలు తీరును మండలాల వారీగా సమీక్షించారు. మండల నోడల్ అధికారులు, ప్రతినెల పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయుల బోధనా తీరును గమనిస్తూ, విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతము ఆశించిన  అభ్యసన సామర్ధ్యాలు విద్యార్థులు అందుకోవడానికి  ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే వాటి పై మండల తొలిమెట్టు నోడల్ అధికారులను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం వహించవద్దని,  ప్రతి పాఠశాలలో పాఠ్యప్రణాళిక, బోధనోపకరణాలు అనేటివి తప్పనిసరిగా ఉపయోగించాలని  తెలిపారు. ఏ ఏ  పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నాయి, ఏ ఏ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమము నిర్లక్ష్యానికి గురవుతుందో మండలాల వారీగా  అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులతో, మండల తొలిమెట్టు నోడల్ అధికారులందరితో కలెక్టర్ మాట్లాడించి ఇబ్బందులను అడిగారు. అయితే బోధనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె తెలియజేశారు. అలాగే పదవ తరగతి విద్యార్థులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎక్కువ 10/10 జిపిఏలు సాధించడానికి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు    

దృష్టి పెట్టెలా తగు సూచనలు చేశారు. తల్లితండ్రుల సమావేశాలలో విద్యార్థుల ప్రగతిని ప్రదర్శింపచేయాలని, పాఠశాలలను సమాజానికి దగ్గరగా ఉంచితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ హై మాట్లాడుతూ మండల నోడల్ అధికారులకు, కాంప్లెక్స్ నోడల్ అధికారులకు తగు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ. శ్రీనివాస్,   ప్లానింగ్ కోఆర్డినేటర్ పోరెడ్డి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారులు ఈసారి రవీందర్, రామ్ కిషన్ రాజు, రమాదేవి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం ఆర్ జీ వన్ ఫైవ్ ఇంక్లైన్ పీసీ పటేల్ కంపెనీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల తో  ఉదయం జేఏసీ కార్మిక సంఘ నాయకులు గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓబిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రావలసిన వేతనాల సవరణ కొరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన మార్చి 6 సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు అందరూ ఒక తాటిపై ఉండి పార్టీలకతీతంగా కలిసి రావాలని హక్కులు సాధించుకునే విధంగా పోరాటాలకు సిద్ధం అయి ఉద్యమించక తప్పదని సంఘాల నాయకులు  కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు గత నాలుగు సంవత్సరాలుగా కార్మికులకు పెరగవలసిన వేతనాలు కోవిడ్ సమయంలో ప్రాణాపాయం ఉందని సమ్మెను విరమింపజేసి ప్రజ కార్మిక ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న సిపి  కోవిడ్ తర్వాత సరైన వేతనాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేయడంతో  యజమాన్యానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించడం జరిగింది కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో రెప్రెటేషన్లు చేసిన స్పందించని  ఓబీ  యజమాన్యం మాట తప్పడంతో కార్మిక సంఘాల జేఏసీ మళ్లీ ఒక తాటిపైకి వచ్చి మార్చి ఆరో తారీకు వరకు యజమాన్యానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఓబి యజమాన్యం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నందున రామగుండం రీజినల్ లో అన్ని ఓబిలా కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి గేట్ మీటింగ్లో పెట్టి కార్మికులని ఒక తాటిపైకి తీసుకువచ్చి కచ్చితంగా యజమాన్యం మెడలు వంచన సరే కార్మికులకు రావాల్సిన పెరగవలసిన వేతనాలు కార్మిక హక్కులను సాధిస్తామని  కార్మిక సంఘాల జేఏసీ కార్మికుల మధ్య వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు  బుర్ర తిరుపతి గౌస్ శనిగరపు శ్రీనివాస్ శాతవాహన మల్టిపుల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు కౌశిక్ హరి               ఐ ఎన్ టి యు సి నాయకులు పూసాల తిరుపతి టి కే ఏస్ బి నాయకులు మద్దెల శ్రీనివాస్ ఐఎఫ్టియు అనుబంధ సంఘాల నాయకులు తోకల రమేష్ ఆకుల వెంకన్న   సిఐటియు నాయకులు కార్మికులు వందల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.  శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది గ్రామకంఠం, శిఖం , వక్ఫ్, దేవాదాయ భూముల మొదలగు వివరాలను ప్రోఫార్మా 1 ప్రకారం సేకరించామని, సదరు భూమి క్రమబద్ధీకరణ చేసేందుకు గల అవకాశం, ప్రాతిపదిక, అనుసరించాల్సిన విధానంపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. 

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం, ఆబాది మొదలగు కారణాల వల్ల హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు మరోసారి పరిశీలించాలని, ప్రోప్రొఫార్మా 1 ప్రకారం సేకరించిన సమాచారం, సదరు దరఖాస్తులను సరిచూసుకోని 

నిర్ణయం తీసుకోవాలని సీఎస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎస్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించామని, జిల్లాలకు చేరే ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో వెంటనే నమోదు చేయాలన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు శిబిరాలను పర్యటించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వేసవి దృష్ట్యా క్యాంపుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో కంటి వెలుగు అమలు సంబంధించి కలెక్టర్ ల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 

రాష్ట్రంలో జీహెచ్ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మరో 21 వేల 787 లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన లబ్దిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని,  ఈ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తుల పట్టా సర్టిఫికెట్ లను  సిద్దం చేసామని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకొని  వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 క్రింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, మొదటి విడత సేకరణ కు చర్యలు తీసుకోవాలని అన్నారు.  జీఓ 59 కింద రుసుము పూర్తి స్థాయిలో చెల్లించిన దాదాపు 1,450 దరఖాస్తులు పట్టాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలన్నారు. జీఓ 59 కు సంబంధించి రుసుము మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు సేకరించి పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76 క్రింద అధికారులు పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ 3 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరితగతిన  రుసుము వసూలు చేసి మార్చి 20 నాటికి పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. పోడు భూముల పంపిణీ సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్ లో ఉన్న  దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని,  జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్ లోడ్ చేసి ఒకసారి సరి చూసుకోని పట్టా పాస్ పుస్తకాలు ముద్రణ చేయాలని సీఎస్ సూచించారు. 

ఆయిల్ పామ్ సాగు క్రింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్ పామ్ మొక్కలు నాటాలని, సంబంధిత భూముల డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎస్ అన్నారు. తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, దీనికి సంబంధించి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ అన్నారు. 

 ఈ వీడియో  కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సిక్త పట్నాయక్ 

డి.ఎఫ్.ఓ. వసంత, డిటీడబ్ల్యుఓ ప్రేమకళా రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డిఆర్ఓ  వాసుచంద్ర, పరకాల ఆర్డీఓ  రాములు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ మర్కజి మరియు ప్రాక్టీసింగ్ పాఠశాలలో  చీఫ్ విప్ వినయ్ భాస్కర్  అభ్యసన దీపికలు ఎగ్జాం కిట్స్ పంపిణీ చేశారు.  కార్యక్రమంలో చీఫ్ విప్  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా "మన బస్తీ మనబడి" కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. విద్యార్థుల విజ్ఞానానికై అభ్యసన దీపికాలు అందిస్తున్నామని తెలుపుతూ  విద్యార్థుందరికీ పరీక్షలు రాయడానికి అవసరమయ్యే పరికరాలను అందించిన సంతోష్ కి అభినందనలు తెలిపారు. మన బస్తీ మన బడి కార్యక్రమములో భాగంగా 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదే సమయంలో కార్పొరేట్ పాఠశాలలకు 

ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.   శుక్రవారం  పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తేది : 27.02.23 నుండి 02.03.23 వరకు 8inc లైన్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో జరగబోయే *శ్రీ లక్ష్మి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి త్రయాహ్నిక చతుష్కండాత్మక తృతీయ పుష్కరోత్సవము కార్యక్రమం లో భాగంగా ఆలయ కమిటీ తరపున మరియు వికాసతరంగిని తరపున చిందం స్వరూప ,మహిళల తరపున ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్*ఆహ్వానించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆలయ కమిటీకి 10,000 (పదివేల రూపాయలు) కానుకగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మగారాన్ని తిరిగి జాతికి అంకితం చేసిన నరేంద్ర మోడీ దేశానికి గర్వకారణం అని *బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ  అన్నారు.

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జనగాం మండలంలోని శక్తి కేంద్రం 63, 64, 67 బూత్ ల కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 

జనగామ మండల అధ్యక్షుడు జనగాం రాజలింగు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిధిగా *బిజెపి రాష్ట్ర నాయకులు రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ   పాల్గొన్నారు.

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 

భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషించే క్రమంలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన దేశానికి అవసరమయ్యే యూరియాను మనమే తయారు చేసుకోవాలనే గొప్ప సంకల్పంతో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మగారాన్ని తిరిగి పున:ప్రారంభించి జాతికి అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. దీనివలన దేశంలో ఎరువుల కొరత తీరడంతోపాటు రైతుల కండ్లల్లో ఆనందం చూసేందుకే కరోణ కష్ట కాలంలోనూ నిధుల కొరత రాకుండా వేగవంతంగా ఎఫ్.సి.ఐ ని పూర్తి చేసి తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు.

ఫలితంగా రైతును రాజు చేసిన కీర్తి నరేంద్ర మోడీకి దక్కిందన్నారు.

ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్ , బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ కోశాధికారి కాసిపేట శివాజీ, కార్పొరేషన్ అధ్యక్షులు లక్ష్మణ్, కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి, శక్తి కేంద్రం అధ్యక్షుడు కదాషి శంకర్,బూత్ అధ్యక్షులు శివకుమార్, రాజలింగు, సుదీర్ మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐ.పి.ఎస్  పెద్దపల్లి జోన్ అంతర్గాం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్ఐ డీసీపీ కి వివరించారు. 

అనంతరం డీసీపీ  అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని  సూచించారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.  ఆన్ లైన్ వినియోగించు విధానముపై అందరికి అవగాహన ఉండాలని,TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి పెండింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖల సమన్వయం తో చట్ట పరిధిలో పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలపై అఘాత్యాలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ సంతోష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు.  పెండ్లి మండపం లేదు... భజభజంత్రీలు లేవు.కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు... నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయం అయ్యింది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు. ఓ వైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం పెండ్లి ఏర్పాట్లు చేయడం మళ్ళీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించారు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తం కు పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరుకుటుంబ సభ్యలను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యుల కు విషయము చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు.  బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేసాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. శైలజ కు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

CPI ML ప్రజాపంధా ఆధ్వర్యంలో పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జిల్లా నాయకురాలు కోడిపుంజుల లక్ష్మీ హాజరై మాట్లాడుతూ పెద్దంపేట రైల్వే గేట్ మూలంగా 20 గ్రాముల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు, డ్యూటీకి వెళ్లే కార్మికులు, మహిళలు, విద్యార్థులు రైల్వే గేట్ మూలంగా అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. 

పెద్దంపేట గ్రామ ప్రజలు వ్యవసాయ పనులకు చేతి వృత్తుల పనులకు గీతా కార్మికులు మరియు పశువులు మేతకు పోవడానికి తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు కావున వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం,

పెద్దంపేట రైల్వే స్టేషన్లో గతంలో ఆగిన రైలు అన్నీ కూడా ఆపాలని కోరుతున్నాం ప్యాసింజర్ ఇంటర్సిటీ తెలంగాణ లు ఆపలని డిమాండ్ చేస్తున్నాం

గత మూడు సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతి వచ్చిందంటూ ప్రచారం చేసుకున్న పాలకులు ఫ్లైఓవర్ నిర్మించడంలో మాత్రం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికైనా పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల అవస్థలు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే సిపిఐ ఎంఎల్  ప్రజా పంథా ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని తెలియజేశారు. *ఈ ధర్నా కార్యక్రమంలో CPI ML ప్రజాపంధా జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడేపు శంకర్, భూషవేణి క్రిష్ణ, కోడిపుంజుల మహిపాల్ కల్పన,స్వప్న భీమన్న ,తమనవేణిి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నేతకానీ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోమాసే శ్రీనివాస్ పైదాడిని తీవ్రంగా కండిస్తునాం......... పెద్దపల్లి జిల్లా నేతకానీ కుల సంఘ మరియు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో  ప్రెస్ మిట్.......... 

ఇట్టి కార్యక్రమం లొ పాల్గొన్న....నేతకానీ సంఘ జాతీయ నాయకులు బండారి కనకయ్య ,దుర్గం నర్సయ్య ,  సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్, ముడిమడుగుల మల్లన్న, దూట రాజు దుర్గం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్.గోమాసే పై అదే పార్టీ కి చెందిన ఇంకొక వర్గం వారు శ్రీనివాస్.గోమాసే పై వారితో పాటు వచ్చిన వారి అనుచరులపై దాడి చేయడం సరైనది కాదు అని నేతకానిసంఘం అధ్యక్షులుగా  ఉన్నత స్థానంలో ఉన్నటువంటి శ్రీనివాస్. గోమాసేపై ఇలాంటి దాడి  చేయడం సరైనది కాదు.అని శ్రీనివాస్.గోమాసే పై మరల దాడి చేస్తే నేతకాని సమాజం ఊరుకునే పరిస్థితి లేదని వారు హెచ్చరించారు......

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గం మండలంలో ని గోలివాడ గ్రామం లో నిర్మించిన Water plant  నిర్మాణం లో బాగంగా  విద్యుత్ అనుసంధానం చెయుటకు NPDCL SE సుదర్శన్ ను కలిసి సమస్య వివరించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ సానుకూలంగా స్పదించిన సుపరిడెంట్, NPDCL DE  కి పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ  సమక్షంలో తెలియజెసారు  త్వరలో విద్యుత్ అనుసందనం చెస్తారని హమి ఇచ్ఛారు ,… ఈకార్యక్రమంలో 

గోలివాడ సర్పంచ్ ధరని రాజెష్ పాల్గోన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా  గోదావరిఖని 5ఇన్క్ లైన్ కాలనీ కి సంబంధించిన బూత్ ల కార్నర్ మీటింగ్ శక్తికేంద్రం అధ్యక్షులు బండి రాము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర నాయకులు రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్  సోమారపు సత్యనారాయణ  పాల్గొన్నారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ  రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లో కుంటు పడిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు చాలా విసిగి చెంది ఉన్నారని రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా గడిచిన ఈ నాలుగేండ్ల లో అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న దేశ సేవకు ఆకర్షితులైన రామగుండం ప్రజలు కాషాయం జెండా ఎగురవేసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్ , బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, మండల అధ్యక్షుడు డేవిడ్, మామిడి వీరేశం, మహేష్, రాజ్ కుమార్, శక్తి కేంద్రం ఇన్చార్జీలు,బూత్ అధ్యక్షులు,బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

రాష్ట్ర ఐటి మరియ పురపాలక శాఖామంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలోని మంత్రుల పర్యటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా ఎస్పీ జే. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు కేటీఆర్ మరియు మంత్రులు పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 1000 మందితో బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించారు. కేటిఅర్ మరియు మంత్రులు గణపురంలో దిగింది మొదలు భూపాలపల్లి కార్యక్రమాలు ముగించుకొని వెళ్లే వరకు ఎస్పీ సురేందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా పోలీసులతో పాటు, ఇతర జిల్లా పోలీసులు కూడా ఎండ తీవ్రతను లెక్కచేయక విధులు నిర్వర్తించారని, ఎలాంటి ఘటనలు లేకుండా సమర్ధవతంగా పనిచేశారని సురేందర్ రెడ్డి పోలీసులను అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ



హన్మకొండ ;

కోటి 20 లక్షలతో నిర్మించిన గణపురం తహసిల్దార్ కార్యాలయం, 4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల భవనం ప్రారంభం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

229 కోట్లతో నిర్మించిన 994 ఇండ్లలో సింగరేణి ఏర్పాటు చేసిన రామప్ప కాలనీ ప్రారంభం చేశారు. 

కోటి వ్యయంతో జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా భూపాలపల్లి లో 33 కోట్ల నిధులతో 544 రెండు పడక గధుల ఇండ్ల, 3 కోట్ల  వ్యయంతో ఆర్ అండ్ బీ అతిథి గృహం, 23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల కమ్యూనిటీ సెంటర్ ప్రారంభించారు. 

14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్స్ మార్కెట్ ప్రారంభోత్సవం చేశారు. 

6.8 కోట్లతో పట్టణంలో చేపట్టే మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. 

భూపాల్ పల్లి జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు  రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేశారు. 

జయశంకర్ భూపాలపల్లి

 జిల్లాలో 297.32 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించి, మరికోన్ని పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం భూపాల్ పల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు గణపూర్ మండలంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. 

జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల పుర పాలక శాఖ మంత్రి కే.టి.రామారావు తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,  వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,  శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధుసూదన్ చారి పాల్గొన్నారు.

కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఘనపురం తహసిల్దార్ కార్యాలయాన్ని, 4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

అనంతరం మంజూరు నగర్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం 229 కోట్లతో నిర్మించిన 994  క్వార్టర్లను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. అనంతరం భూపాల్ పల్లిలో  3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని, సుభాష్ నగర్ కాలనీలో 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్ స్టాల్స్ ను, దివ్యాంగుల కోసం ఏర్పాటు 23 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన  కమ్యూనిటీ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

అనంతరం భాస్కర్ గడ్డలో 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్ల ను మంత్రి ప్రారంభించారు.  అనంతరం భూపాల్ పల్లి పట్టణంలో బృహత్వం మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద  6 కోట్ల 80 అంచనా తో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, 4.5 కోట్లతో చేపట్టే మిని స్టేడియం నిర్మాణ పనులకు,  కోటి రూపాయల తో చేపట్టే జిల్లా గ్రంధాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ జక్కుల శ్రీ హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్,  గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా,  అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర్ సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాష్ట్రంలో  ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయాలకు పున‌ర్వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన‌ సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు  బాస‌ర ప్ర‌ధాన‌ ఆల‌య‌ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ దిశానిర్ధేశం మేర‌కు  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశానుసారం బాస‌ర ఆల‌య బృందం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వద్దకు వెళ్ళారు. ప్ర‌ధాన ఆల‌య అభివృద్ధి, విస్త‌ర‌ణ ప్లాన్ తో  పాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్ర‌తిపాద‌న‌ల‌ను స్వామి ముందుంచారు.  ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించ‌డం, సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్ర‌త్యేక నిర్మాణం, మహంకాళి అమ్మ‌వారి ప్ర‌తిమ వెనుక ప్రాకారం మండంపం, ప్రాకారం లోప‌ల శివాల‌య పునః ప్ర‌తిష్ట, ద‌త్తేత్రేయ స్వామివారి స్థ‌ల మార్పిడి, న‌లుదిక్కులా రాజ‌గోపురాలు నిర్మాణం, అనివేటి మండ‌ప విస్త‌ర‌ణ‌,  ధ్వజ స్తంభం ఏర్పాటు, ఆల‌య ప్రాంగ‌ణంలోనే యాగ‌శాల ఏర్పాటు వంటి వాటిపై శృంగేరి పీఠాధిపతి పలు మార్పులు, చేర్పులు, సూచ‌న‌లు చేశారు. 

శృంగేరి పీఠం నుంచి తిరిగివ‌చ్చిన ఆల‌య బృందంతో గురువారం ఇవాళ శాస్త్రిన‌గ‌ర్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్  రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా శృంగేరి పీఠాధిప‌తి చేసిన మార్పులు, సూచ‌న‌లను  వారు మంత్రికి వివ‌రించారు. శృంగేరి పీఠాధిప‌తి సూచ‌న‌లు పాటించాల‌ని, దానికి అనుగుణంగా ఆల‌య పున‌ర్నిర్మాణం ప్లాన్ ను సిద్దం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాకుండా క్యూ కాంపెక్స్, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి కార్యాల‌యం, 100 గ‌దుల చౌల్ట్రీ, దాతల స‌హాయంతో  నిర్మించే 50 వ‌స‌తి గ‌దులు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్ ను రూపొందించాల‌ని సూచించారు.  ఆల‌య పున‌ర్నిర్మాణం ప్లాన్ తో పాటు మాస్ట‌ర్ ప్లాన్ ను సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళిన త‌ర్వాత‌, ఆయ‌న ఆదేశాల మేర‌కు ప‌నులు చేప‌డ‌తామ‌ని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో ఈవో విజ‌య రామారావు, స్థ‌ప‌తి వ‌ల్లి నాయ‌గం, ఎస్ ఈ మ‌ల్లికార్జున్ రెడ్డి, ఆల‌య‌ చైర్మ‌న్ శ‌ర‌త్ పాఠ‌క్, స్థానాచార్యులు, పూజారులు, త‌దిత‌రులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

జయశంకర్ భూపాల పల్లి జిల్లా ములుగు ఘనపురం చేరుకున్న బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు  ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, వరంగల్ జడ్పీ  చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ములుగు జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యారు. 

అనంతరం మంత్రి కేటీఆర్

ములుగు ఘనపురంలో

మండల తహశీల్దార్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే, జ్యోతిరావు ఫూలే బాలికల ఆవాస పాఠశాలకు, సింగరేణి వెయ్యి క్వార్టర్స్ కి ప్రారంభోత్సవం చేశారు. అలాగే భూపాలపల్లి కి చేరుకున్న మంత్రి కేటీఆర్.

భూపాలపల్లి లో

అర్ అండ్ బి అతిథి గృహానికి, దివ్యాంగుల కమ్యూనిటీ హాలుకు,

డబుల్ బెడ్ రూం ఇండ్ల కు ప్రారంభోత్సవం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో కోటి 20 లక్షలతో నూతనంగా నిర్మించిన ఘనపూర్ మండలం 

 తహసీల్దార్ కార్యాలయం,

గాంధీ నగర్ లో 4 కోట్ల నిధుల తో నిర్మించిన నూతన మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను 

 మంత్రులు ప్రారంభించారు. 

 రాష్ట్ర ఐటి మరియ పురపాలక శాఖామంత్రి కేటీ రామారావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ



 హన్మకొండ ;

జయశంకర్  భూపాల్ పల్లిలోని  భాస్కర్ గడ్డ దగ్గర వేలిశాల లో పేదల కోసం 33 కోట్లతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  మంత్రులు గురువారం ప్రారంభించారు.  రాష్ట్ర ఐటి మరియ పురపాలక శాఖామంత్రి కేటీ రామారావు,  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్,  గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సింగరేణి ఎం.డి. శ్రీధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నర్సింహా సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న  చనిపోయిన విషయం అందరికి తెలిసిందే, అధికార పార్టీ కీ చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ సాయన్న కు ముఖ్యమంత్రి కెసిఆర్ తీరని అవమానం చేసిండు దళితులు అంటే కెసిఆర్ కు ముందు నుండి చిన్నచూపు సాయన్న విషయం లో కూడా అదే జరిగింది.సాయన్న గొప్ప నాయకుడు 5 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే ఇప్పటి అధికారపార్టీ బి. ఆర్.స్. ఎమ్మెల్యే అయినా కూడ అంత్యక్రియలు అధికార లంచనలతో కార్యక్రమలు చేయక పోవడం కెసిఆర్ కి దళితుల పై వున్నా వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. పక్క రాష్ట్రం లో ఉన్నా ఆంధ్ర సినీ రాజ్యకీయ ప్రముఖులకు అలాగే తెలంగాణ ప్రజలను లో, తీవ్ర అవమానం అణిచివేతకు గురి చేసి, ఎందరో తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం రజాకార్ల వారసుల కు ప్రజా ధనాన్ని వెచ్చించి ఈ తెలంగాణా లో అంత్యక్రియలు అధికార లంచనలతో చేసి సొంత రాష్ట్రము అయినా తెలంగాణాలో దళితులు ఇంకా వివక్ష కు గురి అవుతావున్నారు. దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ దళితులని అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే కు జరిగిన అన్యాయాన్ని *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి  తీవ్రంగా ఖండిస్తుంది, కెసిఆర్ తన పొందిన రాక్షస ఆనందం దొరతనానికి తార్మానమని మండిపడ్డారు ఐదుసార్లు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తుది శ్వాస వరకు ప్రజా సేవకు తపించిన అజాతశత్రువు సాయన్నని అన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు.. భవిష్యత్తులో తగిన మూల్యం చెలించుకోక తప్పదని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్  హెచ్చరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్, కేఎంసి పిజీ  అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం పై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జరిగిన ఘటన పై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి, చికిత్స పొందుతున్న ప్రీతి కి మంచి వైద్యం అందించాలని చెప్పారు.  ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ రంగనాథ్ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు.