మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి మచ్చలేని అవినీతి రహిత పాలన అందిస్తున్నారని *బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఫైవ్ ఇన్క్ లైన్ మండల శక్తి కేంద్రం అధ్యక్షుడు కర్రావుల డేవిడ్ రాజ్ అద్వర్యం లో 153,193,194 పోలింగ్ బూత్ లకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో మహిళల కోసం ఉచిత గ్యాస్, మరుగుదొడ్లు, బాలింతకిట్లు, రైతుల కోసం ఏటా 6000 నిది, ఎరువుల సబ్సిడీ, ప్రతి ఏటా మద్దతు ధర పెంపు లాంటి కార్యక్రమాలు, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి ఎన్నో పథకాలను శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నారని వారన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ,రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి,
మాజీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకన్న,బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీ కొమ్మ శ్రీనివాస్, మామిడి వీరేశం, బూత్ అధ్యక్షులు రమేష్, సంపత్, రాజు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: