మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మెడికో ప్రీతి మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు*.ఈ మేరకు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి వెంకట్ సోషల్ మీడియాలో లేక విడుదల చేశారు.మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు.వరంగల్లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాంగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్న, యాజమాన్యం ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని వెంకట్ ఆరోపించారు.ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే, ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తుందని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆఫీసుల్లో మహిళలపై వేధింపులు, కాలేజీలలో ర్యాగింగ్ నిత్య కృత్యమయాయని, మహిళలు ఇక ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో, మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Post A Comment: