June 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS 

T20WC థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ప్రొటీస్ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, అర్ష్దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో ప్రజా ప్రతినిధి అధికారులతో కలిసి వరంగల్ సమగ్ర అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్ వరంగల్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రింగ్ రోడ్డు భూసేకరణ అంశం వేగవంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యాయం అంచనాల పెంపుపై సమగ్రమంగ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చిందనే అంశంపై కులంకషంగా చర్చించి అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకుంటామని పేర్కొన్నారు. నాలాల అక్రమణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ పనులు మరింత వేగవంతంగా చేపట్టేలా అధికారులు చల్లలు తీసుకోన ఆదేశించారు. వెంటనే వైద్య సేవలు ప్రజలకు అందు బాటులకు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. త్వరలో నిర్వహించే సమావేశంలో అన్ని చర్చించి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. 


సీఎం ఆదేశాలను పాటిస్తాం..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 

వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలను పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో నిర్వహించిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముందుకు సాగుతామని తెలిపారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, దీనిపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. అంచనాల పెంపుపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మమునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను త్వరగా చేపడతామని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను పరిష్కారంచే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 


స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి 

ఎమ్మెల్యే కడియం శ్రీహరి 


వరంగల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్యమంత్రిని కోరారు. కడియం శ్రీహరి సమీక్ష సమావేశంలో పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు, జాతీయ రహదారుల అనుసంధానం అది ఎలా సాధ్యమవుతుంది అన్ని వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2050 డీటెయిల్ రిపోర్టు తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వరంగల్ కు ప్రాచీనంగా ఎంతో పేరు ఉందని నగరాన్ని హెల్త్ సిటీగా, ఏకో టూరిజం సిటీగా మార్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించా లని ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. ఓకే వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఇన్చార్జి మంత్రి ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం  అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించిన సీఎం. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహంవ్యక్తం చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటన్న సీఎం.

నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సిఎం  ఆదేశించారు. 

నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సిఎం  తేల్చి చెప్పారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

హైదరాబాద్ తో పోటీపడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యేక ఫోకస్ పెడతానని పేర్కొన్నారు. అధికారులు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి 8 అంశాలపై మూడు గంటలపాటు హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రింగ్ రోడ్డు, నిర్మాణం స్మార్ట్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, విమానాశ్రయం పరిస్థితి, కాలోజీ కళాక్షేత్రం పనులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మొదట రింగ్ రోడ్డు నిర్మాణం పై హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు ఫేసుల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి మొదట సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వరంగల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు మునుగుతున్నాయని ఇందుకోసం శాశ్వతంగా పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకరం చుట్టాలని, నాలాల ఆక్రమణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నాలాల్లో శిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. హైదరాబాదులో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్లో ప్రయోగించాలని పేర్కొన్నారు. అక్కడ వరదలు వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఇక్కడ అమలు చేయాలని అధికారులకు సూచించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పై డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారుల ఆదేశించారు. వర్షం కురిచినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల అంచనాల వ్యయం ఎందుకు పెరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఈపీసీ పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలు లేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ 2050 సంవత్సరం వరకు డిజైన్ చేయాలని సూచించారు. సమగ్ర వివరాలతో డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ లో హైదరాబాదులో ఉన్న నిలోఫర్ ఆస్పత్రి లాగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటా మని వెల్లడించారు. మమునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 9 నాటికి కాళోజి కళాక్షేత్రం నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలిపారు. పనులు పూర్తి చేసి ప్రారంభించ డానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో ఆపరేషన్లు ఇతర వైద్య సేవలకు నిమ్స్ లో అందిస్తున్నట్లుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్ఓసి ఇచ్చే అంశంపై పరిశీల జరుపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని వెల్లడించారు. స్కూల్ విద్యార్థుల యూనిఫాంలో సంబంధించిన పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్ లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే అవకాశం ఉందని ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమగ్రంగా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో సమగ్ర వివరాలతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధికి 6115 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా గుర్తించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం స్వశక్తి మహిళలకు 518 కోట్ల 71 లక్షల 20వేల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day




: మహదేవపూర్ పలివెల మండలాలలోని పంకెన1, పంకెన2, పలిమెల2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 2, అంబటిపల్లి 3, అంబటి పల్లి 4, పెద్దంపేట క్వారీలలో ఇసుకను కూలీల ద్వారా గోదావరి ఒడ్డునకు చేరవేసి కూలీల ద్వారానే రవాణా చేయించే విధంగా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు భారీ యంత్రాలతో ఇసుకను తోడి,రవాణా చేస్తున్నందున వీరి క్వారీలను రద్దు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అజ్మీర పూల్ సింగ్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట ఆదివాసి హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గొరిగే కిరణ్ కుమార్, నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోచయ్య, మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ బొబ్బిలి రాజు తదితరులు ఉన్నారు. ప్రజలకు పని కల్పించే ఉద్దేశంతో గోదావరి నదిలో ఇసుక క్వారీలను ప్రభుత్వం మంజూరు చేసిందని అజ్మీర పూల్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్వారీలు ఉన్న ప్రాంతంలో గిరిజనులు, ఎస్సీ, బిపిఎల్ కంటే దిగువ ఉన్న గ్రామాలైనందున క్వారీలను కూలీల ద్వారా నిర్వహిస్తే వీరికి పూర్తి స్థాయి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. నిరక్షరాస్య నిరుపేద గ్రామాలలో క్వారీలను సొసైటీల నుండి అక్రమ పద్ధతులలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆదాయాన్ని కొల్లగొడుతూ యంత్రాల ద్వారా జెసిబిల ద్వారా రాత్రనక పగలనక పెద్ద మొత్తంలో గోదావరి నుండి ఇసుకను డంపులుగా పేర్చారు. భారీ లారీలలో నింపడానికి కూడా జెసిబిలను వాడుతున్నారు. ప్రజలకు చిన్న పని కూడా కల్పించకుండా స్థానిక దళారులను దరి చేర్చుకొని క్వారీలు దర్జాగా నడుపుకుంటున్నారని కలెక్టర్ కు వివరించారు. గిరిజన ఎస్సీ బీసీలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు న్యాయం చేయాలని, వీలుగానిపక్షంలో సమగ్ర విచారణ జరిపి క్వారీలను రద్దు పరచాలని ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు విజ్ఞప్తి చేశారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం సుల్తాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మద్యం మత్తులో కూమార్తెను తండ్రి లైంగికంగా వేధించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య భర్తను గొడ్డలితో నరికి చంపింది. మద్యానికి బానిసైన భర్త తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. అనంతరం తల్లీకుమార్తె పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BIG BREAKING :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన ఉరుమడ్ల సతీష్ కుమార్ (31) బుధవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో గల్ఫ్ దేశం వెళ్లి సరైన ఉపాధి లేక అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్టు మృతుని భార్య ఉరుమడ్ల మహన్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి శ్యామ్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BIG BREAKING 

అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని మృతి చెందిన ఘటన మంగళవారం హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న చెన్నూరు సమ్మయ్య ఇనుప సామాను కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోదరినితో అప్పులు ఎక్కువయ్యాయని జీవితం గడవడం కష్టంగా ఉందని చొప్పుకున్నాడాన్నవారు. ఎదురుగా ఉన్న మోదుగు చెట్టుకు ఉరి వేసుకొని మృత్యువఠ పడ్డాడు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BIG BREAKING 


సికింద్రాబాద్ తుకారాం గేట్ పీఎస్ పరిధి అడ్డగుట్టలో భర్త భార్యను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ మృతురాలి పేరు రోజా(32)గా గుర్తించారు. భర్త ఉప్పుతల లక్ష్మణ్ రోజా దంపతులకు ఒక బాబు(9), 5, 6 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మణ్ ఇద్దరు కూతుళ్ల ముందే భార్యను చంపినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS :

మద్యం మత్తులో బావమరిది బావ గొంతు కోశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలోని మెంగారంలో జరిగింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బోనాల్ గ్రామానికి చెందిన నీల స్వామి, అతని బావమరిది నవీన్, సుధాకర్లు మద్యం తాగారు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో నవీన్, సుధాకర్ నీలస్వామిపై కత్తితో దాడి చేసి గొంతు కోశారు. వారి నుంచి తప్పించుకున్న నీలాస్వామి గ్రామంలోకి చేరుకోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రివాల్వర్ చూపించి మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పీఎస్ ఎస్ఐ భవానీసేన్పై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న తనపై హత్యాచారం చేశాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ భవానీసేన్ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పీఎస్లో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. గతంలో కూడా ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS 


హైదరాబాద్ పాతబస్తీ పరిధి ఛత్రినాకలో యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32), గౌలిపురకు చెందిన మణికంఠ చిన్ననాటి స్నేహితులు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా మణికంఠతో ఆమె దూరంగా ఉంటుండడంతో మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం పెంచుకుని గొడవపడి గొంతు కోశాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

TG: మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని యువకుడు సంతోష్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గౌడవెల్లిలో భార్యతో కలిసి నివాసం ఉంటున్న సంతోష్.. నిన్న భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తీవ్ర మనస్తాపం చెందిన సంతోష్.. స్మశాన వాటికలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
BREAKING NEWS :

కోర్టు స్టే ఆర్డర్ ఉందని, ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరిన కార్యదర్శిపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి భార్య చీపురుతో దాడి చేసిన ఘటన జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. యాదగిరి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను చేపట్టారు. కోర్టు స్టే ఉందని పనులు ఆపాలని కోరిన కార్యదర్శిపై యాదగిరి భార్య కళావతి చీపురుతో కార్యదర్శి సాంబయ్య పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS :

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లా నగర్ శివారులోని ఎన్సీఎల్ పరిశ్రమ వద్ద కార్మికుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఆదివారం కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతదేహంతో పరిశ్రమ ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS :


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన ప్రవీణ్ - రజిని దంపతుల కుమారుడు అఖిల్ (19)గా గుర్తించారు. అయితే కుటుంబ సమేతంగా గోదావరిలో స్నానం చేస్తుండగా యువకుడు కనిపించకపోవడంతో గల్లంతైనట్లు భావించారు. ఈ క్రమంలో గాలించగా మృతదేహం లభ్యం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS 

ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్ (32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్ను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

BREAKING NEWS 

ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ పురోహితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం పచ్చకాంతం సంతోష్( హైటెక్ పంతులు) అనే పురోహితుడు దమ్మన్నపేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే క్రమంలో అతను మనస్తాపానికి గురై ఆదివారం తన స్వగ్రామం రాచర్ల గొల్లపెల్లిలోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS :

గోదావరిలో స్నానం చేస్తూ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఎస్సై భవానిసేన్ తెలిపిన వివరాలిలా.. వరంగల్కు చెందిన గరికపాటి అఖిల్ (19) ఆదివారం కాళేశ్వరం వచ్చారు. అందులో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో యువకుడు గల్లంతయ్యాడన్నారు. సమాచారమందుకున్న తమ సిబ్బంది నదీతీరానికి చేరుకుని గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BREAKING NEWS :

హనుమకొండ పట్టణ కేంద్రంలోని హంటర్ రోడ్డు విశాల్ మార్ట్ సమీపంలో కారు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం మండలంలోని బూడిద పల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఐ మ్యాక అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన నగేశ్ అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో నగేశ్కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

రాష్ట్రంలోని జిల్లాల లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాటిని పరిష్కరించాలంటూ శుక్రవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు.

సీ.సీ.ఎల్.ఏ  మాట్లాడుతూ భూముల మార్కెట్ ధరలను సవరించడానికి మండలాల పరిధిలో  ఆర్డిఓ చైర్మన్ గా తహసిల్దారులు,  ఎంపీడీవోలు , సబ్ రిజిస్టార్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే పట్టణ ప్రాంతాలలో అదనపు కలెక్టర్లు చైర్మన్ , మున్సిపల్ కమిషనర్లు , తహసిల్దార్లు , జడ్పీ సీ.ఓలు సభ్యులు గా కమిటీల ఏర్పాటు చేయాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని దీనిలో అదనపు కలెక్టర్లు , ఆర్డీవోలు , తహసిల్దారులు , రిజిస్టార్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

ఈ కమిటీలను త్వరగా ఏర్పాటు చేసి భూముల మార్కెట్ ధరలను సవరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట్ రెడ్డి , డిఆర్ఓ వై.వి గణేష్ , ఆర్డీవోలు పరకాల , వరంగల్ వెస్ట్  నారాయణ , వెంకటేశ్వర్లు మరియు సంబంధిత తహసిల్దార్లు  అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్ల వాగు సమీపంలో శుక్రవారం సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతదేహం సగానికి పైగా కాలిపోయి ఉండగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చి ఉంటారా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

పిల్లలను చెరువులోకి విసిరేసి తానూ దూకిన ఘటన అమీన్పూర్లో జరిగింది. పోలీసుల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం. నుస్తులాపూరు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి ఐటీ ఉద్యోగాలు చేస్తూ చందానగర్లో ఉంటున్నారు. పిల్లల్ని చూసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన శ్వేత పిల్లల్ని చెరువులోకి విసిరేసి తానూ దూకింది. ఈ ఘటనలో బాబు మృతి చెందగా తల్లి కూతుళ్లను పోలీసులు కాపాడారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

గ్రామీణ నేపథ్యం, పేదరికం, పోటీపరీక్షల సన్నద్దతకు అడ్డు కాదని, సాధించాలన్న, దృఢ సంకల్పం, పక్కా ప్రణాళికతో, పట్టుదలతో చదివితే విజయం వరిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  అన్నారు. గురువారం జిల్లా పోలీసు శాఖ  ఆధ్వర్యంలో తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సహకారంతో కాటారంలోని  B.L.M గార్డెన్ లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే 60 మంది నిరుద్యోగ యువతకు ఎస్పి కిరణ్ ఖరే  స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ  పేదరికంతో పోటీ పరీక్షలకు దూరమవుతున్న అటవీ గ్రామాల నిరుద్యోగ  అభ్యర్థులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఉత్తమ అధ్యాపకుల చేత శిక్షణ ఉంటుందని,  యువత మంచి స్థాయికి చేరుకోవాలని, చెడు వ్యసనాలు కు దూరంగా  ఉండాలన్నారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం సులువు కాదని, గట్టిగా ప్రయత్నిస్తే, అసాధ్యం ఏమీ ఉండదని ఎస్పి  అన్నారు. నిరంతర శ్రమ, అహర్నిశలు కృషిచేసినప్పుడు కోరుకున్న స్థాయికి చేరుకోగలమని ఎస్పి  పేర్కొన్నారు. అలాగే  నిరుద్యోగ అభ్యర్థులు తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంతో పాటు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలని ఎస్పి  అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రికగ్నైసేడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రేస్మా ) కాటారం అధ్యక్షులు శ్రీశైలం, కాటారం, మాహాదేవ్ పూర్ సిఐలు నాగార్జున రావు, రాజేశ్వరరావు, కాటారం, కాళేశ్వరం,  కొయ్యూరు, అడవి ముత్తారం,  ఎస్సైలు అభినవ్, భవాని సేన్, నరేష్, మహేందర్,  నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఎయిడ్స్ సోకిన చదువుకున్న పిల్లలకి నైపుణ్య శిక్షణ  ఇప్పించాలని ఈ శిక్షణ ద్వారా వారికి జీవనోపాధి దొరుకుతుంది అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరం  లో జరిగిన  జిల్లా ఎయిడ్స్  నిర్మూలన మరియు నియంత్రణ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ  సెక్స్ వర్కర్లకు మరియు ఎయిడ్స్ బాధితులకు అందిస్తున్న డ్రై రేషన్ పంపిణీ చేస్తున్న తరుణంలో రవాణా చార్జీల సమస్య ని పరిష్కరించారు. ప్రభుత్వ టీ.బి ఆస్పత్రులలో   సంపూర్ణ సురక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే సామాజిక భద్రత పథకం ద్వారా వారికి కుట్టు మిషిన్లు అందజేయడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి  పరీక్షలు ,మరియు వైద్యం పై ప్రతి మూడు నెలల ప్రగతి ని సమీక్షించి , బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ  డా. సాంబ శివ రావు ,  ఎయిడ్స్ అదనపు  డి.ఎం.హెచ్.ఓ డా.మధన్ మోహన్ , టీ.బీ నియంత్రణ అధికారి డా.హిమ బిందు , జిల్లా సంక్షేమ అధికారి మధురిమ , సంబంధిత అధికారులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

AP: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందరు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధిష్ఠానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. రేపు ఆయన అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి కాసేపట్లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర బాధ్యతలు ఈటలకు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచగా నటుడు జూ.ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి నివాళులర్పించారు. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ సిటీకి పయనమయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను పాఠశాలలు ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికలపేట , జీల్గుల లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో  చేపట్టిన పనులను నాణ్యతగా ఉండే విధంగా  చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సమీపిస్తున్న  నేపథ్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

అదేవిధంగా  మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులను తయారు చేస్తున్న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని  మహిళా స్వశక్తి కేంద్రాన్ని  కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఏకరూప దుస్తులను నిర్ణీత గడువులోగా అందించే విధంగా  చర్యలు చేపట్టాలని అధికారులకు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో  ఎల్కతుర్తి ఎం.పీ.డీ.వో విజయ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

పర్యావరణ పరిరక్షణకు స్వేచంద సంస్థలు , విద్యార్దులు, సామాన్యులు కృషి చెయ్యాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. 

బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో నేల పునరుద్ధరించడం , ఏడారీకరణను నిరోధించడం, కరువు నీ తట్టుకోవడం అనే అంశం తో నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మానవాళి అవసరాల కోసం చేపడుతున్న చర్యలు భూమి , నీరు, గాలి పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ముఖ్యంగా ఒక సారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వలన భూమి లోనీ నీరు చేరకుండా అడ్డు తగులుతున్నాయి అని దీని వల్ల భూమి నిస్సారం అవుతుందని దీనినీ మనం కట్టడి చెయ్యాలని అని

 అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్లాస్టిక్ ను వాడకుండా చర్యలు తీసుకున్నారని అలాగే హనుమకొండ కలెక్టరేట్ సముదాయం లో ప్లాస్టిక్ నీళ్ళ బాటిల్ లను మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలు తయారు చెయ్యాలని సూచించారు. గత పది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనందరం జిల్లా లో గ్రీనరీ ని వృద్ధి చెయ్యడానికి కృషి చెయ్యాలని అన్నారు. సమావేశం పాల్గొన్న విద్యార్దులు మరియు ఇతరుల చే పతిజ్ఞ చేయించారు.

ఈ కార్య్రమంలో డి.ఎఫ్.ఓ లావణ్య , కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ సునీత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ప్రజల సౌకర్యార్థం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు .ఈసీఐ నుంచి నేరుగా ప్రసారం చేయడానికి లింక్ ఏర్పాటు చేసినట్లు, దీని ద్వారా తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద జిల్లాకలెక్టర్  సిక్తా పట్నాయక్  నివాళులు అర్పించడం జరిగింది.  ఉదయం 9.00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయము(IDOC) లో జిల్లా కలెక్టర్  జాతీయ  పతాకావిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ వెస్ట్ శాసనసభ సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఘా, వరంగల్ మున్సిపల్ కమీషనర్ అశ్విని తానాజీ వాఖేడే, హనుమకొండ అడిషనల్ కలెక్టర్  (లోకల్ బాడీస్ )రాధిక గుప్త, హనుమకొండ అడిషనల్ కలెక్టర్  (రెవెన్యూ) వెంకట్ రెడ్డి, మరియు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

జిల్లా పోలీసు కార్యాలయంలో  ఆదివారం  తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎస్పి కిరణ్ ఖరే జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. 

ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలు, పోలిసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిందన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు.  

సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.  పోలీసులు వృత్తి దైవంగా భావించి పనిచేయాలని సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని అన్నారు. అధికారులు‌ మరియు  సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతతో పని చేసి  జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల ను  అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ గారు కోరారు. అనంతరం ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ పథకాలను ఎస్పి కిరణ్ ఖరే  పోలిసు సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, వర్టికల్ డిఎస్పి నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
జూలై 1, 2024 నుండి దేశవ్యాప్తంగా నూతన చట్టాలను అమలు కానున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు అవగాహన కార్యక్రమాలను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసులు అందరికీ విడతలవారీగా నూతన చట్టాలపై శిక్షణను అందిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేయడం జరిగింది. దేశంలో న్యాయ వ్యవస్థలోని చట్టాలను మార్చేందుకు తీసుకోనున్న చర్యలలో భాగంగా కొత్తగా రూపొందించిన నూతన మూడు చట్టాలు -
 *భారతీయ న్యాయ సంహిత* 
*భారతీయ నాగరిక్ సురక్ష సంహిత*
*భారతీయ సాక్ష్యా అధినియం.2023*
ఈ మూడు చట్టాలు రానున్న జూలై 1, 2024 నుండి అమలులోకి రానున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా నూతన చట్టాల నందు మారిన సెక్షన్స్ మరియు చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరించి తెలియజేయాలని సూచించారు. మారిన చట్టాలను అనుగుణంగా కేసులను నమోదు చేసే విధంగా పూర్తిగా సంసిద్ధమై ఉండాలని అన్నారు. నూతన చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా ప్రతి ఒక్క పోలీసు అధికారికి, సిబ్బందికి అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలనే తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు, చేర్పులు చేశారని అన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందని, ఎస్పి అన్నారు. ప్రతి ఒక్కొరూ నూతన అంశాలను నేర్చుకోవాలని ఎస్పి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నారాయణ నాయక్, DCRB, SB ఇన్స్పెక్టర్లు, రామకృష్ణ, వసంత్ కుమార్, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్లు రత్నం, కిరణ్, శ్రీకాంత్ జిల్లా పరిధిలోని ఎస్ఐ లు, కోర్టు డ్యూటీ అధికారులు, స్టేషన్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.