BREAKING NEWS :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన ప్రవీణ్ - రజిని దంపతుల కుమారుడు అఖిల్ (19)గా గుర్తించారు. అయితే కుటుంబ సమేతంగా గోదావరిలో స్నానం చేస్తుండగా యువకుడు కనిపించకపోవడంతో గల్లంతైనట్లు భావించారు. ఈ క్రమంలో గాలించగా మృతదేహం లభ్యం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: