September 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  రాణి కుముదిని అన్నారు .

సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని   రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో  ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. రెండు విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదల  నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాలలో అమలు లోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి నిబంధనల ప్రకారం 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.

బ్యాలెట్ బాక్స్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్స్, సరిపోయేంత మెటీరియల్ అన్నీ సరిగా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జిల్లాలోని ఆరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 6 మండలాల్లో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఎన్నికల విధులకు సంబంధించి  రెండు దఫాలుగా  ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ,డిఆర్డిఓ  మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిషత్ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లాలో జరుగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల సమన్వయం, సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ సోమవారం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, వెబ్‌కాస్టింగ్ తదితర విభాగాల వారీగా సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

రాష్ట్రంలో రెండు దఫాలుగా ఎంపిటిసి, జడ్పిటిసి, 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అనుసరిస్తూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్ లను తొలగించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు నిర్వహణపై పిఓలు, ఏపిఓ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టి,విఎస్టీ, ఎంసిసి టీములను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంపిటిసి, జడ్పిటిసి, వార్డు సభ్యులు, సర్పంచి ఎన్నికలు నిర్వహణకు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు.

బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మరమ్మత్తు చేయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.


మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండాలని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతుల తదితర కార్యక్రమాలు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం మరియు ఐటీ ఆధారిత పర్యవేక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాలలో బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనికీలు చేపట్టాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై నిఘా పెంచాలని పర్యవేక్షణకు, ఫ్లైయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి

 గురించి ఎంపిడిఓలకు, తహసీల్దార్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. నామినేషన్లు, కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపధ్యంలో తక్షణమే జిల్లాలో (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్టంగా అమలుకు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని నియమావళి ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సాయంత్రం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత వేడుకగా మహిళల ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో భాగంగా మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని, పువ్వులని దేవుళ్ళుగా పూజించే పండుగ ప్రపంచంలో ఒక బతుకమ్మ పండుగ మాత్రమే అని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా జిల్లాలోని ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు మరియు జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొంటూ ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు అన్ని పండుగలను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిస్తున్నామని అందుకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొంటూ, జిల్లాలోని ఉద్యోగులందరం జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారూ. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే పండుగ బతుకమ్మ అని పేర్కొంటూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తున్నదని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగినులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికారులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు 

కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్య నాయక్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు బైరీ సోమయ్య,డాక్టర్ ప్రవీణ్,పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్,శ్యామ్ సుందర్,మాధవ రెడ్డి, వాసం శ్రీనివాస్,రాజ్యలక్మి,బోనాల మాధవి,మల్లారం అరుణ,పావని,జ్యోత్స్న,రజిత,సరస్వతి,శ్రీలత, రాజమణి, యమున,ఇందిరా ప్రియ దర్శిని,విజయ లక్ష్మీ, కత్తి రమేష్,రాము నాయక్, లక్ష్మి ప్రసాద్,రాజీవ్, అనూప్ ,ప్రణయ్,పృథ్వి, నిఖిల్ , అనిల్ రెడ్డి,రాజమణి,నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. అలాగే దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని,  ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో  దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, అందించిన సేవలు చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. 

శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. స్వాతంత్ర్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణ కు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత బీసీ కులగణనకు రాష్ట్రంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపీతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ  బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీలకు ప్రభుత్వం ఎలాంటి ఉందని, ప్రభుత్వానికి అండగా బీసీలు అండగా నిలవాలని పేర్కొన్నారు. బీసి భవన్, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యే తో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసి భవన్ ఏర్పాటు కు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, ఇతర శాఖల అధికారులతో పాటు  పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్:మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని 12 ఎంపిపి, 12 జడ్పిటిసి స్థానాలు ఉండగా ఇందులో మహిళా స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను డ్రా తీశారు.


ముందుగా ఎంపీపీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల డ్రా తీయగా అనంతరం జడ్పీటీసీ స్థానాలకు డ్రా తీశారు. రిజర్వేషన్ల ప్రకటన, మహిళా రిజర్వేషన్ స్థానాలకు డ్రా ప్రక్రియ మొత్తంను వీడియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో మేన శ్రీను, డీటీవో శ్రీనివాస్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ. వి. శ్రీనివాస్ రావు, కొలను సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిశాంత్, రజినీకాంత్, శ్యామ్ సుందర్, కొట్టె ఏసోబు, ప్రవీణ్ కుమార్, నేహాల్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

చరిత్రను, మన సంస్కృతి తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్న ప్రదేశం మన ఓరుగల్లు అని రాథోడ్ రమేష్ అన్నారు. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని శనివారం నాడు హరిత కాకతీయలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతున్నది అని అన్నారు. రామప్ప, లక్నవరం, మేడారం, వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, మేడారం లాంటి చాలా పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని అన్నారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పర్యాటక రంగం పై అవగాహన కల్పించడంలో భాగంగా హనుమకొండ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించి నట్లు తెలిపారు. పర్యాటక ఆకర్షణలు పెంచడానికి, దేశ విదేశీ పర్యాటకులను వరంగల్ రప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేసవిలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరీమణులు నగరానికి తీసుకు రావడం వల్ల మన కీర్తి విశ్వవ్యాప్తం అయింది అని అన్నారు.అనంతరం 60 మంది విజేతలు అయిన విద్యార్థులకు రాథోడ్ రమేష్, శివాజీ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందించారు. ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు. పర్యాటక ఉత్సవాల్లో భాగంగా తాడూరి రేణుక శిష్య బృందం నిర్వహించిన నృత్యాలు అలరించాయి. పర్యాటక ప్రాంతాలను తెలిపే గీతం తో పాటుగా బతుకమ్మ ప్రత్యేక గీతానికి కళాబృందం చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కే . లోకేశ్వర్, డీ. చిరంజీవి, శరత్, సతీష్ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్యాకేజీ టూర్...


ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 
సాంకేతికత పరమైన వృత్తి నైపుణ్యం జీవన ప్రమాణాలకు చాలా కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి విద్యా నైపుణ్యత అభివృద్ధి అవసరమమని రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసి సెంటర్ లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు  ప్రారంభించారు.ఈ మేరకు వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్  టెక్నాలజీ సెంటర్ (ATC)లను ఎమ్మెల్యే  ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య,శాసన మండలి సభ్యుడు  బస్వరాజు సారయ్య తో కలిసి ప్రారంభించారు.
సుమారు రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఏటీసీ సెంటర్ లు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,డిజిటల్ విద్యను అందించేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. 
ఏటిసి కేంద్రాల ఏర్పాటు ద్వారా మన యువతకు అత్యాధునిక శిక్షణ అందడం తో పాటు, వారి కెరీర్‌కు దిశానిర్దేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా టాటా గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ స్కిల్ డెవలప్‌మెంట్ యజ్ఞంలో భాగంగా, మన నియోజకవర్గం ప్రాధాన్యతను సాధించడమనేది గర్వకారణం. మన నియోజకవర్గానికి రూ 22 కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు కేంద్రాల్లో విద్యార్థులకు ఇండస్ట్రీకి అనుగుణమైన శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, వెల్డింగ్, సీఎన్ సి, రోబోటిక్స్, డిజిటల్ స్కిల్స్ లాంటి విభాగాలలో ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ లభించనుంది.టాటా గ్రూప్స్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలతో చేతులు కలిపి, యువతకు నైపుణ్యాలు అందించేందుకు ముందుకు రావడం ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ ప్రారంభమైంది. ఇదే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం విశేషం.మన పిల్లలు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇక్కడే ఉన్నతమైన శిక్షణతో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే స్థితికి రావడం ఎంతో సంతృప్తికరంగా ఉంది. ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నదని అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా  భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ములుగు రోడ్డు ఐటిఐ కళాశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేగా తప్పకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   మన్నేపల్లి వేదికగా వర్చువల్విధానంలో ప్రారంభించిన ఏటిసి సెంటర్ ప్రారంభోత్సవ సందేశాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయ సురేందర్,సయ్యద్ విజయశ్రీ రాజాలీ,డివిజన్ అధ్యక్షులు సంగీత్ నాయకులు కమల్,శివ కుమార్, రోహిత్సింగ్,సదానందం, సమద్, క్రాంతి, మహేష్ , పవన్ , అశోక్ , రాజు , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ

హనుమకొండ జిల్లా లో అభివృద్ధి పనులకి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసినట్లయితే  వాటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. 

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రైల్వే , మున్సిపల్, కుడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 


ఈ సమావేశంలో కాజీపేట, హనుమకొండ పరిధిలో రైల్వే వంతెనలు, పైపులైన్లు, రోడ్లు, తాగునీటి సమస్యలు, ఎఫ్ సీ ఐ గోదాం, అంబేద్కర్ భవన్, హనుమకొండ చౌరస్తాలలో వరద నీరు నిలవడంతో తలెత్తుతున్న ఇబ్బందులు, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ సమస్య, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. 

ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ  డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ 

 రైల్వే సంబంధిత అంశాలను, సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తాను పాల్గొని మాట్లాడినట్లు పేర్కొన్నారు. అక్కడి సమావేశంలో కాజీపేటలో బస్టాండ్ ఏర్పాటు అంశం కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. రైల్వేకు సంబంధించి ఏ సమస్యలు ఉన్న  తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే  వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  చెప్పారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందామన్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే రైల్వే అధికారులతో  సంప్రదింపులు జరిపి సమన్వయంతో పరిష్కరించే విధంగా జిల్లా అధికారులను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు వేయాలని తన వద్దకు ప్రజలు వస్తున్నారని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలలో రోడ్లు వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు నిలవకుండా తీసుకునే చర్యలపై  ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దిశ సమావేశంలోనూ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే విధంగా జిల్లాకు సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరు అయ్యిందని పేర్కొన్నారు. సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ కోసం ప్రభుత్వ భవనం కావాల్సి ఉందని, త్వరగా బిల్డింగ్ ఇచ్చినట్లయితే  ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు  అందుబాటులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 22 సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను కేంద్రం మంజూరు చేసింది అని, అందులో ఒకటి వరంగల్ కు మంజూరు చేసిందన్నారు. 

రైల్వే, దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన ప్రసాద్ పథకం, యూనివర్సిటీలలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు అందించినట్లయితే వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.

బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీసుకెళ్లగా పైపులైన్ వేసి ఉందని, వాటిని కలిపి తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామన్నారు. హనుమకొండ అశోక జంక్షన్, చౌరస్తా లో పార్కింగ్ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించగా ప్రతిపాదనలను పరిశీలిస్తామని కమిషనర్ బదులిచ్చారు. హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ భవన్ ప్రాంతాలలో వరద నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కి సూచించారు. వరద నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని కమిషనర్ సమాధానమిచ్చారు. భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు.

వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. నగర సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాలలో  సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

ఈ సమావేశంలో కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్ వివిధ సమస్యలను వివరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డి ఆర్ ఓ వై వి గణేష్, ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి,  ఈఈ భీంరావు,కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావు సింగ్, రవీందర్ రెడ్డి, మున్సిపల్,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ  జయంతి ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ  చిత్ర పటానికి అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్ ,పూలమాల వేసి నివాళులుర్పించారు .

ఈ సందర్భంగా   నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ని  స్మరించుకోవడం జరిగింది. “చాకలి ఐలమ్మ  తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి  ఆదర్శం” అని వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు.  

ఈ కార్యక్రమంలో ఏఓ ఫర్హాన, ఆర్.ఐ లు రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐ లు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధిని రూ. 4.29 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో  కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా ) రూ. 4.29 కోట్ల నిధులతో నిర్మించిన ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, హైమావతి, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుడా నిధులతో ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎల్కతుర్తి అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి ఉన్నతీకరణ, విద్యుత్ ఉపకేంద్రం, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు మంజూరు అయి ఉన్నాయని అన్నారు. బాసర ఐఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు స్థల సేకరణతో పాటు ఇతరత్రా కారణాలవల్ల ఆలస్యమైందని, కానీ వచ్చే ఏడాది తప్పకుండా తీసుకువస్తామన్నారు. వంగరలో కూడా నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని, వీలైనంత తొందరలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడం జరిగిందని, ఐదు కోర్సులతో తరగతులు జరుగుతున్నాయన్నారు. కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ జరుగుతుందని, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ ఆసుపత్రిని 150 నుండి 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి  పీజీ కోర్సులకు అందించే విధంగా వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలో వీటిని ప్రారంభించుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కుడా సిపివో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లాలో పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నిర్మించుకున్న నూతన గృహంలోనికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథి గా హాజరు కాగా గురువారం గృహప్రవేశం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి లో మార్పాటి సుధా అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటి  ప్రారంభోత్సవం చేశారు. తమ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సుధా అశోక్ రెడ్డి దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. 

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని  గృహప్రవేశం చేసిన లబ్ధిదారు  మార్పాటి సుధా దంపతులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాజు, స్థానికులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్మా : డుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ ములుగు రోడ్డు లోని ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టి సి ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. బుధవారం ములుగు రోడ్డు లోని ఐటిఐ ప్రాంగణంలో పురోగతిలో ఉన్న ఏటీసీ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా ఏటీసీకి వెళ్లేందుకు ఉన్న అంతర్గత రహదారిని పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం గురించి అధికారులను, నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారుతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఏటీసీ కి సంబంధించిన అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అప్రోచ్ రోడ్డును వారం రోజుల్లో పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఏటీసీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ బాలుర ఐటిఐ ప్రిన్సిపల్ ఎం.చందర్, హనుమకొండ ఐటిఐ ప్రిన్సిపల్ జి. సక్రు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

త్రైమాసిక సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలనీ జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు.బుధవారం డిఆర్ఓ అధ్యక్షతన సీనియర్ సిటిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రైమాసిక సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలనీ, వాటిని గ్రామ మరియు మండల స్థాయిలలో చేపట్టాలని సూచించారు. సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం, వారిని రక్షించడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు, ఇట్టి కార్యక్రమంలో ఆర్‌డిఓ పరకాల, డిడబ్ల్యో , డిఎం & హెచ్ఓ , పోలీస్ శాఖ, మేప్మా కోఆర్డినేటర్ , హెల్పింగ్ హాండ్ సొసైటీ చైర్మన్ , ఎఫ్‌ఆర్‌ఓ , సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా పరకాల ఐ సి డి ఎస్ దామెర మరియు పరకాల మండలాలలో బుధవారం ఘనంగా పోషణ మాసం కార్యక్రమాలు జరిగినవి.ఈ కార్యక్రమాలకు జిల్లా సంక్షేమ అధికారి జయంతి హాజరై , సామాజిక వేడుకల ద్వారా, ప్రవర్తన లో మార్పు తీసుకరావచ్చని, అందుకే అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఆరోగ్యదివాస్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 


పోషణ మాసం కార్యక్రమం లో గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించారు, ఐ సి డి ఎస్ పుట్టిల్లు గా పరకాల సిడిపిఓ స్వాతి కి డిడబ్ల్యుఓ జయంతి చేతుల మీదుగా ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దామెర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు లో పాల్గొని అనిమియా తో బాధపడుతున్న కిషోర బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు, పోషణ లోపం ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు చేపించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, సిడిపిఓ స్వాతి,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, సూపెర్వైసోర్స్ పద్మావతి, రాణి మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా పరిశీలించారు. ఉదయం ములుగు జిల్లా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి  మంత్రులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాంగణ ప్రాంతాన్నంతా తిరిగి పరిశీలించారు. ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.


ఆలయ ఆవరణలో చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ కార్యక్రమాలు జరగాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పూజారులు, ఆదివాసీ పెద్దలతో సంప్రదిస్తూ పనులు కొనసాగించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సిఎం వెంట మంత్రులు సీతక్క,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ నెల 23,24,25 తేదీల్లో పందిళ్ళ శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలు- 2025 ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ సమావేశం ఈ రోజు ( మంగళవారం) సాయంత్రం ఐదున్నర గంటలకు  ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనమండలి వైస్ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ హాజరవుతున్నారని పేర్కొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు.మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతారు. తొలిసారిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిని సారించడం విశేషంగా చెప్పవచ్చు. మేడారం పూజ‌రులు, ఆదివాసీ పెద్ద‌లు, మంత్రులు, గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 

తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రెండవ రోజు గద్దర్ ఫాండేషన్ వారు గద్దర్ గారు రచించిన పాటలు ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధలైనారు. చివరిగా తెలంగాణ డ్రెమోటిక్ అసోసియేషన్ వరంగల్ వారు సమర్పించిన మహా రాణి రుద్రమదేవి నాటకాన్ని రచించిన వారు తడకమళ్ల రామచందర్ రావు , దర్శకత్వం ఆకుల సదానందం , నిర్వహణ దేవరాజు రవీందర్ రావు ఓరుగల్లు కళారులచే మహా రాణి రుద్రమదేవి పద్య నాటకం ప్రదర్శించారు. 


ఈ కార్యక్రమానికి ఎం. పి. కడియం కావ్య , తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొ. అలేఖ్య పుంజాల జ్యోతి ప్రజ్వల చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏ.రేవంత్ రెడ్డి

 అధికారులను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి  అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేశారు.   దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.


టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు.

భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని  పరిశీలిస్తామన్నారు,

జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ , డీఎఫ్ఓ లావణ్య, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, పరకాల ఆర్డిఓ కే.నారాయణ ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, నేషనల్ హైవే అథారిటీ, సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్నికల సంగం కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్  రివిజన్  పై అన్ని  జిల్లాల ఎన్నికల అధికారులతో అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఓటరు జాభితాపై స్పెషల్ ఇంటెన్సివ్  రివిజన్ చేపట్టాలని  అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్  డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటాతో పరిశీలన  చేసుకోవాలని తెలిపారు. 


ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంగం సూచన మేరకు బీహార్, మహారాష్ట్ర  వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు,  బి.ఎల్.ఓ, సూపర్ వైజర్లుతో క్రమం తప్పక సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని 

ఎస్.ఐ.ఆర్ పూర్తి చేసేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి,  హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే నారాయణ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్:మాడుగుల శ్రీనివాస శర్మ 

 ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల లోని  తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల,  కళాశాలను జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా  తనిఖీ చేశారు. హాస్టల్ లో తరగతి గదులు, కిచెన్, డార్మేట్రి, పరిసరాల ను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు.  కలెక్టర్ విద్యార్థినులను పాఠ్యాంశాలకు సంబంధించి తరగతి గదిలోని బోర్డు పై రాయించారు. విద్యార్థినులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులచేత పాఠ్యాంశాలను చదివించారు. 


ఆయా తరగతుల విద్యార్థినులతో మీ జీవిత లక్ష్యం ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారని  అడగగా డాక్టర్, ఇంజినీర్స్ అవుతామని సమాధానమిచ్చా రు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంచుకున్న లక్ష్య సాధనకు మరింత కష్టపడాలని కలెక్టర్ సూచించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేస్తామన్నారు. విద్యార్థినుల అభ్యసన, పఠన సామర్థ్యం తక్కువగా ఉందని, అభ్యసన సామర్థ్యం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా పరకాలలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న వసతులు, విద్యార్థుల సంఖ్య ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఆంజనేయులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయినులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 

జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) కనీస ప్రమాణాలు పాటించాలనీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ వెంకట రెడ్డి అన్నారు,  గురువారం రోజున కలెక్టరెట్ మినీకాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ,సమీక్షా  సమావేశం జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి అధ్యక్షత జరిగింది,  ఈ సందర్భంగా హాజరైన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుచున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. సెప్టెంబర్ 20 నుండి  26 వరకు  వరకు జిల్లాలోని ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు మరో ఆరుగురు సభ్యులతో   కూడిన కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలియచేసారు. ఈ లోగా ఆయా సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలకు వారి కనీస ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండాలని, లేనిచో ఇన్స్పెక్షన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రాతిపదికపై తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. 

సంస్థలకు సంబంధించిన భవనాల ఫిట్నెస్,వాటర్ ప్యూరిఫికేశన్,శానిటేషన్ సర్టిఫికెట్స్ సంబంధిత శాఖల నుండి తీసుకొనుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు, జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి మాట్లాడుతూ

సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని 

 హెల్త్ ప్రొఫైల్స్ కు సంబంధించిన ఫార్మాట్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో రూపొందించిన 

 అన్ని సంస్థలు ఒకే విధంగా హెల్త్ ప్రొఫైల్స్ నిర్వహించుటకు సులువుగా ఉండే విధంగా తగు చర్యలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సూచనలతో రూపొందించుకోవాలని  అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకావాలని అన్నారు. అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల  అధికారులకు సమాచారం అందించి బాలల సంరక్షణ కేంద్రాల బాల బాలికలకు హెల్త్ ప్రొఫైల్ నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సీహెచ్ అవంతి,

జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి  అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, డాక్టర్ పరికి సుధాకర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక, బాల సదనం సూపరింటెండెంట్ కళ్యాణి, శిశు గృహ ఇన్చార్జి మేనేజర్ ఏ మాధవి, జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సంగి చైతన్య విజయ్ కుమార్, సుజాత,  బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి రెండు రోజులపాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధ్యురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు గురువారం ఆమె ఒక ప్రకటనలో ఆయా విశేషాలు వివరించారు. 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వంలో 30 మంది కళాకారులు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శిస్తారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర ను కళ్ళ ముందుంచే ఈ నృత్య రూపకాన్ని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించగా సంగీత దర్శకుడు వి.బి. ఎస్.మురళి సంగీతం సమకూర్చారు. 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ సదానందం నిర్వహణలో రాణి రుద్రమ నాటకం, అనంతరం గద్దర్ ఫౌండేషన్ సూర్య ఆధ్వర్యంలో ప్రజా సాహిత్య కళా రూపాలు జీవన సంఘర్షణ ప్రదర్శనలు వుంటాయని డాక్టర్ అలేఖ్య పుంజాల వివరించారు. కాకతీయ నృత్య నాటకోత్సవాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభిస్తారు. తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారు. ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇ. వెంకట రామిరెడ్డి తదితరులు హాజరవుతున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమి తొలిసారి నిర్వహిస్తున్న కాకతీయ సాంస్కృతికోత్సవాలు ఉచిత ప్రవేశం అని కళాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి దిగ్విజయం చేయాలని డాక్టర్ అలేఖ్య పుంజాల ఆహ్వానిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, మండల విద్యాధికారి శ్రీమతి ఐ. శ్రీదేవి నియంతృత్వ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాభివృద్ధి సమస్యలపై చర్చించేందుకు సమన్వయ సమావేశం కోరినా, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు నిర్వహించలేదని తెలిపారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, సెలవులు అడిగినా అవమానకరంగా మాట్లాడడం జరిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఉపాధ్యాయులను జిపిఎస్ లొకేషన్, ఫోటోలు పంపాలని బెదిరించడం, డిప్యూటేషన్ విషయంలో ఎలాంటి గైడ్‌లైన్స్ పాటించకుండా తనకు అనుకూలంగా వారిని నియమించుకోవడం జరుగుతోందని ఆరోపించారు. ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు తీసుకున్నప్పటికీ షోకాజ్ నోటీసు ఇచ్చిన ఘటన, దానిపై వివరణ అడిగిన సంఘ నాయకుడిని అవమానకరంగా ఏకవచనంలో మాట్లాడిన తీరు అసహనాన్ని కలిగిస్తోందని తెలిపారు. పాఠశాలలో సమస్యలు వివరించడానికి వెళ్ళిన ఉపాధ్యాయుడికి “పాఠశాల మూసేసి ఇంట్లో పడుకో” అనే సమాధానం ఇచ్చిన విధానం తీవ్రంగా తప్పుబట్టారు. ఇకపై, జిల్లాలోని ఇతర మండలాల మాదిరిగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం పేరుతో వచ్చిన నిధులను వినియోగించకపోవడం, సంఘ నాయకులను సంప్రదించకపోవడం, “నా మాటే ఫైనల్, నన్ను ఎవరు ఆపలేరు” అనే ధోరణి ఉపాధ్యాయుల్లో అసహనాన్ని కలిగిస్తోందని తెలిపారు. “సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా చులకనగా చూస్తున్నారు. మండలంలో ఏ కార్యక్రమం అయినా నామమాత్రంగానే చేస్తున్నారు. తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు” అని నాయకులు ఆరోపించారు. “ఇలాంటి విధానాలతో కొనసాగుతున్న మండల విద్యాధికారిని వెంటనే మార్చి, స్థానంలో వేరొకరిని నియమించాలి. అప్పుడే విద్యావ్యవస్థలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది” అని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో PRTU, STU, UTF, TTU, TPUS, TPTF, TRTF సంఘాల ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

ముఖ్యంగా PRTU మండల అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి, వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన ముమ్మడి రాకేష్ అనే యువకుడు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసనకు దిగడంతో స్థానికులు, పోలీసులు కలకలమయ్యారు. రాకేష్ విశ్వకర్మ కులానికి చెందిన వాడిగా గోదావరి తీరంలో శ్రాద్ధకర్మ పూజలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నిరంతరం పూజలు చేస్తూ వస్తున్న ఆయన, ఈరోజు కూడా గోదావరి వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ బ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ "ఇకపై గోదావరిలో ఈ కార్యక్రమాలు చేయకూడదు" అని ఆపివేయడంతో రాకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వెంటనే కాళేశ్వరం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి, చేతిలో పెట్రోల్ సీసా పట్టుకుని ఆత్మహత్య యత్నం చేస్తానని హెచ్చరించాడు. దీంతో క్షణాల్లోనే పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. వార్త తెలిసిన వెంటనే  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రజలు ఉద్రిక్తంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు, బంధుమిత్రులు రాకేష్ పక్షాన నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరికి గంటల పాటు సాగిన ఉద్రిక్తత అనంతరం పరిస్థితి క్రమంగా శాంతించింది. అయితే యువకుడి నిరసనతో కాళేశ్వరం ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులను ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. 

శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా  వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూ. 42 లక్షల వ్యయంతో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం ఏర్పాటు చేయగా వీటిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్, దాతలు హాజరై ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐపీఎస్ సాధించి, తాను చదువుకున్న పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తున్న చెన్నూరి రూపేష్ కు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల తో పాటు జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్, కిచెన్, ఆడిటోరియంను దాతల

 సహకారంతో  విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కళాశాలలో నిర్మించిన ఆడిటోరియంలో ఫర్నిచర్ ను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల, కళాశాలలకు ఉపయోగపడే విధంగా క్రీడా మైదానం అభివృద్ధికి నిధులను కేటాయిస్తానని పేర్కొన్నారు. 

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ చదువుకుంటేనే జీవితాలు మెరుగుపడతాయని ఉన్నారు.  ప్రభుత్వ పాఠశాల, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన వారేనని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య అనేది ఎంతో కీలకమని, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. భావి జీవితానికి పునాది ఇంటర్మీడియట్ విద్య దోహదపడుతుందని పేర్కొన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్, మహర్షి ఫౌండేషన్ సత్యనారాయణ, అరుణ, ఉదయ్ ఎంతో కృషి చేశారని, వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. తాము ఎదగడానికి ఉపయోగపడిన పాఠశాలకు, సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.    సమాజం మనకు ఎంతో ఇస్తుందని, మనం సమాజానికి తిరిగి సేవలను అందించాలన్నారు. విద్యార్థులు ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలను తెలుసుకోవాలని సూచించారు. సమాజానికి మనకు వీలైనంత సహాయాన్ని అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పైన ఎంతో ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సదుపాయాన్ని  తప్పనిసరిగా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , వైద్యులు, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు భావి జీవితంలో  ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి తమ వంతుగా సేవలను అందించాలన్నారు. పాఠశాల, కళాశాలకు దాతలు అందించిన వనరులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఐఐటి, నీట్, జేఈఈ మెయిన్స్, తదితర పోటీ పరీక్షలకు  కోచింగ్ ఇప్పిస్తామన్నారు. మన జిల్లాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎన్ఐటి, కాకతీయ మెడికల్ కళాశాల ఉన్నాయని, ఆ విద్యాసంస్థల నుండి విద్యార్థులకు కోచింగ్ సహకారం అందించే విధంగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని   ముందుకు రావాలన్నారు.  జిల్లా అధికార యంత్రాంగం విద్యార్థులకు సహకార అందిస్తామని  అన్నారు. పాఠశాల కళాశాలల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు . మోడల్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారాన్ని  అందిస్తామన్నారు. 

పాఠశాల పూర్వ విద్యార్థి,  ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ చదువుతోనే తాను ఐపీఎస్ ని సాధించానని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రతి ఒక్కరూ సంకల్పంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.  చదువుతోనే గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబడతారని సూచించారు. తాను ఈ స్థాయిలో నిలబడడానికి తోడ్పాటు అందించిన పాఠశాలకు తనవంతు సహాయాన్ని అందించాలనే సంకల్పంతో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, లైబ్రరీ, ఇతర వసతుల కల్పనకు దాతల సహకారం మరువలేనిదని అన్నారు. పాఠశాలలు కళాశాల అభివృద్ధికి  తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల, కళాశాలలో కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని  జీవితంలో ఎదగాలన్నారు. కల్పించిన సదుపాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందన్నారు.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు రూ. 60వేల నగదు ప్రోత్సాహకాన్ని స్వాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ అందజేశారు. పాఠశాలలు, కళాశాలలో వసతులు, అభివృద్ధికి సహకారం అందించిన  దాతలు సత్యనారాయణ, అరుణ, బ్లోచీవ్ టెక్నాలజీ సీఈవో ఉదయ్, ఇతర దాతలను ఘనంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, డీఐఈవో గోపాల్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సుమాదేవి, విజయలక్ష్మి, మహర్షి ఫౌండేషన్ చైర్మన్  చెన్నూరు రవి, తిరుపతి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ లో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ( ఎన్డీఏ ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్( సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ అన్నారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలలో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిడిఎస్ పరీక్ష, వడ్డేపల్లి లోని ప్రభుత్వ పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్డీఏ పరీక్ష జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. 14వ తేదీన ఉదయం 10 నుండి 12:30 వరకు ఎన్డీఏ మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుందన్నారు. అదేవిధంగా అదే రోజున సిడిఎస్ పరీక్ష ఉదయం 9 నుండి 11:00 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు జరుగుతుందని, మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4:00 నుండి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. సిడిఎస్ పరీక్ష కు 207 మంది, ఎన్డీఏ పరీక్షకు 410 రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులు కు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద, వాటి పరిసరాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని, విద్యుత్తు శాఖ అధికారులు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. 

ఈ సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పోస్టల్ శాఖ అధికారి శ్రీనివాస్, పింగిలి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామపంచాయతీ పాలన ఆఫీసర్లు( జిపివోలు) క్లస్టర్లకు కేటాయింపు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పారదర్శకంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 123 క్లస్టర్లకు జిపిఓల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ తో అధికారులు చేపట్టారు. జిపివో  పరీక్ష 128 మంది రాసి ఉత్తీర్ణులు కాగా వారికి క్లస్టర్ కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్ లో నిర్వహించారు. 123 క్లస్టర్లకు గాను 125 మంది జిపివో లను  కౌన్సిలింగ్ ద్వారా  కేటాయించారు. 


ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి  వై వి గణేష్ ఆధ్వర్యంలో సాగింది. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జిపివోలు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. 123 క్లస్టర్లకు కౌన్సిలింగ్ ద్వారా  కేటాయించబడిన జిపివోలు కౌన్సిలింగ్ నిర్వహణ, కేటాయింపు చేయడం పట్ల  ఆనందం వ్యక్తం చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో డిఆర్ఓ వైవి గణేష్ తో పాటు కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్, కార్యాలయ సూపరింటెండెంట్ లు నాగరాజు, ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.