ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
సాంకేతికత పరమైన వృత్తి నైపుణ్యం జీవన ప్రమాణాలకు చాలా కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి విద్యా నైపుణ్యత అభివృద్ధి అవసరమమని రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసి సెంటర్ లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.ఈ మేరకు వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC)లను ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య,శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య తో కలిసి ప్రారంభించారు.
సుమారు రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఏటీసీ సెంటర్ లు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,డిజిటల్ విద్యను అందించేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.
ఏటిసి కేంద్రాల ఏర్పాటు ద్వారా మన యువతకు అత్యాధునిక శిక్షణ అందడం తో పాటు, వారి కెరీర్కు దిశానిర్దేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా టాటా గ్రూప్స్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ స్కిల్ డెవలప్మెంట్ యజ్ఞంలో భాగంగా, మన నియోజకవర్గం ప్రాధాన్యతను సాధించడమనేది గర్వకారణం. మన నియోజకవర్గానికి రూ 22 కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు కేంద్రాల్లో విద్యార్థులకు ఇండస్ట్రీకి అనుగుణమైన శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, వెల్డింగ్, సీఎన్ సి, రోబోటిక్స్, డిజిటల్ స్కిల్స్ లాంటి విభాగాలలో ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ లభించనుంది.టాటా గ్రూప్స్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలతో చేతులు కలిపి, యువతకు నైపుణ్యాలు అందించేందుకు ముందుకు రావడం ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ప్రారంభమైంది. ఇదే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం విశేషం.మన పిల్లలు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇక్కడే ఉన్నతమైన శిక్షణతో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే స్థితికి రావడం ఎంతో సంతృప్తికరంగా ఉంది. ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నదని అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ములుగు రోడ్డు ఐటిఐ కళాశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేగా తప్పకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్నేపల్లి వేదికగా వర్చువల్విధానంలో ప్రారంభించిన ఏటిసి సెంటర్ ప్రారంభోత్సవ సందేశాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయ సురేందర్,సయ్యద్ విజయశ్రీ రాజాలీ,డివిజన్ అధ్యక్షులు సంగీత్ నాయకులు కమల్,శివ కుమార్, రోహిత్సింగ్,సదానందం, సమద్, క్రాంతి, మహేష్ , పవన్ , అశోక్ , రాజు , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: