ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
త్రైమాసిక సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలనీ జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు.బుధవారం డిఆర్ఓ అధ్యక్షతన సీనియర్ సిటిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రైమాసిక సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలనీ, వాటిని గ్రామ మరియు మండల స్థాయిలలో చేపట్టాలని సూచించారు. సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం, వారిని రక్షించడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు, ఇట్టి కార్యక్రమంలో ఆర్డిఓ పరకాల, డిడబ్ల్యో , డిఎం & హెచ్ఓ , పోలీస్ శాఖ, మేప్మా కోఆర్డినేటర్ , హెల్పింగ్ హాండ్ సొసైటీ చైర్మన్ , ఎఫ్ఆర్ఓ , సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post A Comment: