కాటారం, జూన్ 23 : ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో కాటారం మండలంలోని రేగులగూడెం, దామరకుంట క్లస్టర్లలో మంగళవారం సీడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 


రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), దామరకుంట వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాట్లాడుతూ రైతులు సకాలంలో విత్తనాలను సేకరించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రగతిశీల రైతులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: