కాటారం, జూన్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం, రేగులగూడెం, దామరకుంట రైతువేదికలలో ఖరీఫ్ 2026-27 సీజన్కు సంబంధించి "సీడ్ మేళ" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాటారం గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు వరి సాగుకు అనువైన 8 రకాల సన్న విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



Post A Comment: