జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అంబేద్కర్ చౌరస్తా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం టీఆర్పీ పార్టీ సాధించిన రెండో విజయమని పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కలిపి 94 శాతం ఉన్నాయని, వారి అభ్యున్నతి కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్పీదేనని పేర్కొన్నారు. అలాగే గతంలో “ముగ్గురు పిల్లల నిబంధన” ఎత్తివేయడంలో కూడా తీన్మార్ మల్లన్న పోరాటం ఫలించిందని, అది పార్టీకి తొలి విజయమైతే, కులగణన నివేదిక విడుదల రెండో విజయమని వివరించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, బడుగు వర్గాల పక్షాన నిలబడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటారని, 2028లో టీఆర్పీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కార్పొరేట్ స్థాయి సేవలను ప్రజలకు అందించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బండి సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Post A Comment: