కాటారం: గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్టుపై టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం, నిర్వహణ పనితీరును సమగ్రంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించడం ద్వారా విద్యుత్ సమస్యలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తనిఖీ సమయంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై వివరాలు వెల్లడించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: