కాటారం మండలం కొత్తపల్లి సుందరాజ్పేట్ గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కాలువలు నిర్మించవద్దని కోరుతూ ఇరిగేషన్ డీఈకు వినతిపత్రం సమర్పించారు. కాలువల నిర్మాణం వల్ల సాగుభూములు నష్టపోయే ప్రమాదం ఉందని, పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. భూములు కోల్పోతే జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములను రక్షిస్తూ కాలువ మార్గాన్ని మార్చాలని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Post A Comment: