కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలంలో తలెత్తే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సమ్మర్ వాటర్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. గ్రామ పరిధిలోని దంతాలపల్లి, శ్రీనివాస కాలనీ, బొప్పారం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు పరిశీలించారు. మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో కలిసి గ్రామంలోని వాటర్ ట్యాంకులను తనిఖీ చేసి, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించారు. వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దంతాలపల్లి, బొప్పారం ప్రాంతాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని గ్రామ ప్రతినిధులు కోరగా, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొర్రల్ల రాజయ్య, అసిస్టెంట్ సంపత్, లైన్మెన్ వెంకటేశ్వర్లు, బాల్నే ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Post A Comment: