కుమ్మేర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సోదరులపై జరిగిన దాడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పేర్కొన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, పూర్తి రక్షణ కల్పించే వరకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమాజంలో ఎవరికైనా కులం పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి రజక తదితరులు పాల్గొన్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: