జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న 2026 సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మరియు వారి సతీమణి ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, టీఆర్పీ తరఫున పోటీలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావం విస్తరిస్తున్న ఎన్నికల వాతావరణంలోనూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు .భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ చివరి నిమిషం వరకు పోరాటం చేసిన అభ్యర్థులు పార్టీకి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆశీస్సులతో భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యర్థులతో పోటీపడి ప్రచారం కొనసాగించిన అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వారా జరుగుతున్న డబ్బు, మద్యం పంపిణీ మరియు అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్ రాజకీయాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీనే సరైన ప్రత్యామ్నాయమని రవి పటేల్ స్పష్టం చేశారు.
Home
POLITICS ( రాజకీయం )
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్

Post A Comment: