పెద్దపల్లి,గోదావరిఖని,ఫిబ్రవరి,5(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)బోరు మారింది...దాహం తీరింది..ముస్త్యాల గ్రామం మురిసింది..ప్రజాప్రతినిధుల చొరవపై ప్రశంసల వెల్లువ..ఆ ఊళ్లో బోరు చెడిపోయి...తాగునీటి కోసం గోస పడుతున్న జనం బాధ తీరింది.బాధ్యత గల ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో గ్రామం మురిసింది. బోరు పని చేయడంతో ఇండ్లలో వాడకం నీటి సమస్య.దాహం తీరింది.పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం ముస్త్యాల గ్రామ సర్పంచి సుంకరి మహేశ్,ఉపసర్పంచి బాసినేని వినోద-సత్యనారాయణరావుల పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది.వివరాలు ఈ విధంగాఉన్నాయి...ముస్త్యాల గ్రామ పంచాయతీలోని రెండవ వార్డులో బెల్లంకొండ వారి ఇంటి ముందు ఉన్న నీటి బోరు మోటార్ స్టార్టర్ కాలిపోయి ఆ వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.ఇటీవల గ్రామస్థుల సహకారంతో మెజారిటీ విజయం సాధించిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల దృష్టికి ఈ సమస్య వెళ్లింది.రెండవ వార్డులో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు.ఆగమేఘాల మీద బుధవారం పాత మోటార్ ను తొలగించి అదే రోజు రాత్రి మోటార్ స్టార్టర్ తీసుకవచ్చి బిగించి పునరుద్ధరించారు.దీనితో బోరు పనిచేయడం ప్రారంభమైంది.తాగునీటి సమస్యను పరిష్కరించి గ్రామస్థుల దాహం తీర్చిన సర్పంచ్,ఉపసర్పంచ్ ల పనితీరు పట్ల సర్వత్రా హర్షంవ్యక్తమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడరు.తమను నమ్ముకొని ఓటు వేసిన ప్రజలకు వెన్నంటి ఉంటామనీ,గ్రామంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తాము ముందు నిలబడుతామనీ,ఏలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.ఇది తమ కర్తవ్యమనీ,గ్రామస్థుల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: