జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవరాత్రుల అనంతరం గణనాధులను నిమజ్జనానికి తరలించే క్రమంలో భూపాలపల్లి పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ సెంటర్ లో  శుక్రవారం రాత్రి ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవరాత్రులు పూజలందుకొని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న గణనాధుల నిమజ్జన శోభాయాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మెమొంటో లను అందించి, శాలువాలు కప్పి సన్మానం చేశారు. 


అంతకుముందు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే , కలెక్టర్ మరియు ఎస్పీ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.  ప్రజలంతా గణనాధుని ఆశీస్సులతో ఆనందంగా, సౌభాగ్యంతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను సన్మానించి, ఉత్సవాల విజయవంతమైన నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: