గత నెల 25 న కాటారం పోలీస్ స్టేషన్లో నమోదు అయినటువంటి కప్పల వర్షిని హత్య కేసు కు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కథనం మేరకు గత నెల 28న కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఒక గుర్తుతెలియని అమ్మాయి మృతదేహం నేషనల్ హైవే పక్కన పడి ఉన్నది మరియు శవానికి చుట్టుపక్కల క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం రాగా కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్ మరియు కాటారం సిఐ నాగార్జున రావు మరియు కాటారం డిఎస్పి సూర్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అట్టి చనిపోయిన అమ్మాయి కప్పల వర్షిని తండ్రి కుమారస్వామి వయస్సు 22 సంవత్సరాలు కులం బెస్త నివాసం ఒడితల గ్రామం చిట్యాల మండలం అని ఇట్టి అమ్మాయి గత నెల 03 నుండి కనిపించడం లేదని వర్షిని తల్లి అయిన కప్పల కవిత భర్త లేట్ కుమారస్వామి వారి స్థానిక పోలీస్ స్టేషన్ అయిన చిట్యాలలో 06న ఫిర్యాదు చేసినట్లుగా అప్పటి నుండి తన కూతురు గురించి తాను మరియు వారి కుటుంబ సభ్యులు మరియు పోలీసు వారు ఆచూకీ కోసం గాలిస్తున్నారని తెలిపి నా కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కోసం చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు పై హత్య కేసు నమోదు చేసిన కాటారం పోలీసు వారు కాటారం డిఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిఐ నాగార్జున రావు విచారణ చేపట్టడం జరిగింది. కాగా ఈనెల 02న కాటారం సిఐ నాగార్జున రావు తన సిబ్బందితో గంగారం క్రాస్ రోడ్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన మృతురాలి తల్లి అయిన కప్పల కవిత మరియు మరొక వ్యక్తితో కొయ్యూరు నుండి కాటారం వైపుగా వస్తుండగా పోలీసు వారిని చూసి తమ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసు వారు వెంబడించి పట్టుకొని విచారించగా వారు నేరమును అంగీకరించినారు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి తండ్రి సమ్మయ్య 50 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం నివాసం ఒడితల గ్రామం చిట్యాల మండలం అను వ్యక్తికి తన మొదటి భార్య చనిపోగా గత 24 సంవత్సరముల క్రితం కొయ్యూరు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన మాదరవేణి కవిత ను రెండో వివాహం చేసుకోగా వీరి ఇరువురికి ఇద్దరు ఆడసంతానం వారిలో పెద్ద అమ్మాయి కప్పల వర్షిని వయసు 22 సంవత్సరాలు చిన్న అమ్మాయి కప్పల హన్సిక వయసు 21 సంవత్సరములు కాగా చిన్న అమ్మాయికి వివాహమై ఇంటి నుండి వెళ్లిపోగా ఓడతల గ్రామంలో పెద్దమ్మాయి వర్షిని తోపాటు భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా గత ఐదు సంవత్సరముల క్రితం కవిత భర్తకు పక్షవాతం వచ్చి ఇంటికి పరిమితం అవడం జరిగినది కాగా కప్పల కవితకు తన గ్రామానికి చెందిన అవివాహితుడైన జంజర్ల రాజ్ కుమార్ తండ్రి మారయ్య 24 సంవత్సరాలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అట్టి పరిచయం అక్రమ సంబంధం గా మార్పు చెంది గత మూడు సంవత్సరముల నుండి వీరు ఇరువురు తరచూ కలుసుకునేవారు. ఇట్టి విషయం కొన్ని నెలల క్రితం కప్పల కవిత భర్త ఆయన కుమారస్వామికి తెలియడంతో కుటుంబంలో తరచూ తగాదాలు జరుగుచున్నవి. కాగా రాజ్ కుమార్ కవితలు ఇరువురు కలుసుకునుటకు భర్త అడ్డం వస్తున్నాడని అట్టి అడ్డును తొలగించాలని గత నెల 25న తన కూతురు ఇంట్లో లేని సమయంలో మధ్యాహ్నం 1:00 సమయంలో పక్షవాతం వచ్చి తన ఇంట్లో మంచం పై పడుకొని ఉన్న భర్తను కవిత కదలకుండా కాళ్లు పట్టుకోగా రాజ్ కుమార్ నోరు మూసి గొంతు నొలిమి హత్య చేసి అక్కడి నుండి వెళ్లిపోగా భార్య కవిత తన భర్త అనారోగ్య కారణంతో చనిపోయాడని ఊరివారిని బంధువులని అందరినీ నమ్మించి అంత్యక్రియలు జరిపించింది తర్వాత కొన్ని రోజులకు ఇట్టి విషయమై తన పెద్ద కూతురైన వర్షిని తరచూ తన తల్లిని నిలదీయడం మరియు తన తల్లిని కలవడానికి తరచూ వస్తున్న రాజ్ కుమార్ ని అడ్డుకోవడం వంటివి చేయడంతో ఉన్న ఈ ఒక్క అమ్మాయిని అడ్డు తొలగిస్తే మన అక్రమ సంబంధానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు అని రాజ్ కుమార్ తెలుపగా దానికి అంగీకరించిన కవిత ఇద్దరు కలిసి ముందస్తు పన్నాగంతో గత నెల 02న అర్ధరాత్రి అనగా తెల్లవారితే 03న ఉదయం రెండు గంటల సమయంలో ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న తన కూతురు వర్షిని ని తన భర్తను చంపిన విధంగానే ఇరువురు కలిసి హత్య చేసి మృతురాలిని తన ఇంట్లో ఉన్న సంచిలో మూటకట్టి అట్టి మూటకు తన ఇంట్లో ఉన్న దండెం వైరుని తెంచి కట్టి వారి ఇంటి వెనకాల ఉన్న చెట్ల పొదలలో దాచిపెట్టి అదే రోజు రాత్రి సమయంలో అట్టి మూటను అక్కడి నుండి ఒడిదల గ్రామ శివారులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఉన్న దుబ్బగట్టుగుట్ట చెట్ల పొదలలో పడవేసినారు. కాగా గత నెల 6న కప్పల కవిత చిట్యాల పోలీస్ స్టేషన్ కి తన బంధువుల ఒత్తిడి మేరకు తన కూతురైన వర్షిని కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అది అలా ఉండగా దుబ్బ గట్టుగుట్టలో దాచిన శవం ను రాజకుమార్ రెండు రోజులకు ఒకసారి వెళ్లి చూసి వస్తూ అట్టి శవాన్ని ఎవరైనా చూస్తే వారి ఇరువురి పైకి వస్తుంది అనే భయంతో గత నెల 25 న సాయంత్రం ఏడు గంటల సమయంలో అట్టి శవాన్ని రాజ్ కుమార్ యూరియా సంచిలో ఉంచి దానికి తాడు కట్టి తనకు చెందిన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన మధ్యలో శవాన్ని ఉంచుకొని ఒడిదల గ్రామం నుంచి తీసుకొని వచ్చి కమలాపూర్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత కాటారం వైపుగా నేషనల్ హైవే కి పక్కన పడేయడం జరిగినది పడవేయడం చేసే క్రమంలో ఇట్టి హత్య వారి పైకి రాకూడదని పోలీసువారి దృష్టి మరల్చడం కోసం రాజకుమార్ యూట్యూబ్ ద్వారా క్షుద్ర పూజల పైన అనేక వీడియోలు చూసి అట్టి వీడియోల ద్వారా క్షుద్ర పూజలు ఏ విధంగా చేస్తారు అనేది తెలుసుకొని శవం పైన పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు ఉంచి శవం చుట్టూ ఇనుప మేకులు కొట్టి క్షుద్ర పూజలు చేసి చంపినట్లుగా చిత్రీకరించి అక్కడ నుండి ఒడితల గ్రామానికి వెళ్లిపోయి ఎవరికి ఏమీ తెలియనట్లుగా ఎవరింట్లో వారు ఉండగా కప్పల కవిత తన భర్తను మరియు కూతుర్ని చంపిన విషయం ఎప్పటికైనా బయటకి వస్తుందన్న భయంతో రాజ్ కుమార్ తో కలిసి గ్రామం నుండి వెళ్లిపోయి మహారాష్ట్రలో ఏదో ఒక పని చేసుకుంటూ ఇద్దరం కలిసి జీవిద్దాం అనే ఆలోచనతో ఈరోజు రాజ్ కుమార్ తో పాటు ఎక్సెల్ బండి పైన ఒడితల గ్రామం నుండి బస్వాపూర్ రోడ్డు మీదుగా కొయ్యూరు నుండి గంగారం క్రాస్ మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఉద్దేశంతో వస్తూ ఉండగా పోలీసు వారు వారిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగినది.
ఈ సందర్భంగా ఇట్టి హత్య కేసులను చాకచక్యంగా ఛేదించిన డి.ఎస్.పి కాటారం సూర్యనారాయణ ని విచారణ అధికారి సిఐ నాగార్జున రావు ని మరియు కాటారం ఎస్సై శ్రీనివాస్ ని మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించడం జరిగినది.
Post A Comment: