హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి. ప్రావీణ్య వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందించిన వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై నుండి 106 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: