ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.

గురువారం గణేష్ నిమజ్జన ప్రదేశాలైన కాజీపేట పరిధిలోని బంధం చెరువు, హనుమకొండ లోని సిద్దేశ్వర గుండం, హసన్పర్తి లోని పెద్ద చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడేల తో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్తు దీపాలను, బ్యారీకేడింగ్ ను ఏర్పాటు చేయాలని, క్రేన్లు, విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పలను సిద్ధంగా ఉంచాలని, వాహనాల రాకపోకలకు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో నిమజ్జన ప్రాంతాలలో ఏర్పాట్లను పూర్తి చేసి విధులను నిర్వర్తించాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో తగిన బందోబస్తు ను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా డిసిపి సలీమా, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: