ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూములలో  వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలలో వినియోగించిన  ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరచగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం తనిఖీ చేశారు.

హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించి అక్కడి రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని  భద్రపరిచిన  స్ట్రాంగ్ రూముల షట్టర్ల తాళాలకు వేసిన సీళ్ల ను కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన  స్ట్రాంగ్ రూములకు సంబంధించిన లాగ్ బుక్ లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద  ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన  వాచ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు.

పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములు, భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ వివరాలను ఆయా నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేష్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తహసిల్దార్లు విజయ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: