March 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 పార్లమెంట్ ఎన్నికల విధులతో పాటు, పోలింగ్ రోజున అత్యవసర సేవలు అందించే అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం  కల్పించాలని  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. 

శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్,ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా,  అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. వీరి కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద తప్పనిసరిగా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు 

పోలింగ్ రోజున జిల్లాలో ఎన్నికలు విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది  పేరు, ఎంప్లాయి కోడ్, హోదా, మొబైల్ నెంబర్, ఓటరు వివరాలు, అసెంబ్లీ సెగ్మెంట్ వివరాలు ఓటరు జాబితాలో పార్ట్ &సీరియల్ నెంబర్, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ మొదలగు  వివరాలు రూపొందించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది రాండనైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందించేందుకు అవసరమైన అదనపు ఫారం 12 లు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహించే సమయంలో అవసరమైన మేర కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం 12 లు అందజేసి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు. 

ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సమర్పించిన ఆప్షన్ లో ప్రకారం  ఏ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అనే అంశం ఎస్.ఎం.ఎస్ ద్వారా పంపడం జరుగుతుందని, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తారని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసిందని తెలిపారు.

ప్రతి జిల్లాలో ఉద్యోగుల నుంచి ఫారం 12 తీసుకొని ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించాలని, ఆన్ లైన్ లో నమోదు చేసిన ఫారం 12 లు సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్తాయని అన్నారు.  ఏప్రిల్ 29 నాటికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించాల్సి ఉంటుందని, ఫారం 7ఏ  ను సీ.ఈ.ఓ కార్యాలయం ధ్రువీకరించిన  తర్వాత  ఏప్రిల్ 30 నుంచి మే 1, 2024 వరకు రిటర్న్ అధికారి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ లను ప్రింట్ చేయాలన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మే 3న, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో  మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరించాలని తెలిపారు.  పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12 సమర్పించి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 

భారత ఎన్నికల కమిషన్  అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బందికి సైతం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద  ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని, కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన రవాణా సేవలు ,మీడియా, విద్యుత్, బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ ఆర్టీసీ అగ్నిమాపక సేవలు ట్రాఫిక్ పోలీస్, మొదలగు  అత్యవసర శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. 

అత్యవసర సేవలలో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ 23 లోపు ఫారం 12డి సమర్పించాలని, సదరు దరఖాస్తులను పరిశీలించి రిటర్నింగ్ అధికారి ఏప్రిల్ 24 నాడు ఆమోదించిన దరఖాస్తులకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం పై సమాచారం అందిస్తారని, మే 3 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. 

85 సంవత్సరాల పైబడి పూర్తిగా నడవ లేని సీనియర్ సిటిజెన్లకు,నడవ లేని దివ్యాంగులకు, కోవిడ్ పేషెంట్లుకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించు కోవాలనుకునేవారు ఏప్రిల్ 23 లోపు ఫారం 12 డి సమర్పించాలని అన్నారు.  రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి  ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అర్హులను ఏప్రిల్ 25 నాటికి ఎంపిక చేస్తారని, ఏ.ఆర్.ఓ లు షెడ్యూల్  రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటి వచ్చే షెడ్యూల్ సమాచారం ఓటర్లకు అందించడం జరుగుతుందని అన్నారు.

మే 3 నుంచి మే 6 వరకు మొదటి దశ , మే 8న రెండవ దశ ఇంటి వద్ద పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందని, ఇంటి వద్ద పోలింగ్కు వెళ్లే సమయంలో పోలింగ్ సిబ్బంది వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా వెళ్తారని, రాజకీయ పార్టీలకు సైతం సమాచారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వై.వి. గణేష్ , పరకాల ఆర్డిఓ నారాయణ, తహసిల్దార్లు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ :

 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేయాలని , వాటి ఆధ్వర్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో శనివారం అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని, కమిటీకి మహిళా సంఘం నాయకురాలు అధ్యక్షురాలిగా, ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్ గా ఉంటారని పేర్కొన్నారు. రెండేళ్ల పాటు కొనసాగే కమిటీలో విద్యార్థుల తల్లులను సభ్యులుగా ఎంపిక చేయాలన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ పేరిట బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు ఏమేం కావాలో నివేదికను రూపొందించి వాటిని సమకూర్చుకోవాలన్నారు. తరగతి గదిలో ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు అమర్చాలన్నారు. వేసవి సెలవుల తరువాత విద్యార్థులు మళ్ళీ స్కూలుకు వచ్చేసరికి పాఠశాలల్లో మార్పు రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు, స్థానిక టైలర్ లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యార్థుల యూనిఫామ్ కుట్టే సామర్థ్యం కలిగిన మహిళా సంఘాలను గుర్తించి ఆర్డర్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యంతో పాటు తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్స్ను వినియోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ వసతుల కల్పన బాధ్యతలను పాఠశాలల పున ప్రారంభం అయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పూర్తిచేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, డీఈఓ డాక్టర్ అబ్దుల్ హై, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా  ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ :

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని CR  నగర్ ( బాoబుల గడ్డ)లో  ఏర్పాటు చేయబడిన స్టాటిక్ సర్వెలన్స్ టీమ్ చెక్ పోస్ట్ ను శనివారం  ఎస్పీ కిరణ్ ఖరే  తనిఖీ చేశారు.   అక్రమంగా మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఎన్నికలలో ప్రభావితం చేసే బహుమతులను, రవాణా కాకుండా చెక్ పోస్ట్ ను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. 24 గంటలు చెక్పోస్టుల నందు తనిఖీ నిర్వహించాలని తనిఖి నిర్వహిస్తున్న సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి అని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో, అప్రమత్తతతో   విధులు నిర్వహించాలని ఎస్పి  పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ; 

భారాస  పార్టీ కి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ బిఆరెస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మరుసటి రోజు వరంగల్ జిల్లా బిఆరెస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా చేశారు. రమేశ్ ను పార్టీ లో కొనసాగేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు,కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కెసిఆర్ దగ్గరకు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆరూరి రమేశ్ ససేమిరా అంటూ పార్టీ కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కు టికెట్ ఇవ్వకపోవడంతో అన్యాయం జరిగింది అని భావించి ఎంపి పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దీంతో బిఆరెస్ వరంగల్ లో  ఉనికి కోల్పోయింది. వరుసగా షాక్ లు తగిలి బిఆరెస్ తల్వడమల్లడమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ; 

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పక  పాటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే   శనివారం    తెలిపారు.

ఎవరూ కూడా అనుమతి లేకుండా ర్యాలీలు, ఇతర సమావేశాలు నిర్వహించవద్దని  ఎస్పి  సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన వివరాలను చూపించాల్సి ఉంటుందని ఎస్పి  వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం  జరుగుతుందన్నారు. అలాగే  సోషల్ మీడియా పై పోలిసు శాఖ నిఘా ఉంటుందని,   ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరంగా  చర్యలు తప్పవని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ మరియు హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "స్పెషల్ కోర్ట్ ఫర్ ఎస్.పి.ఈ. అండ్ ఎ.సి.బి. కేసెస్-కం - 3వ అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ వరంగల్, "సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ -కం-సెకండ్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్- హనుమకొండ", "ఈ-సేవ కేంద్రం" మరియు "డిజిటైజేషన్ వింగ్" హన్మకొండ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే  లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.

ఈ నూతన కోర్టులు మరియు ఈ-సేవా కేంద్రం, డిజిటైజేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్ కుమార్,  కె.లక్ష్మణ్ ( అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, వరంగల్&హనుమకొండ) నామవరపు రాజేశ్వరరావు తదితర హైకోర్టు న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే రాధాదేవి, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి మరియు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్లు బైరపాక.జయాకర్, దుస్స.జనార్ధన్, వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయవాద సంఘం అధ్యక్షులు ఈ.ఆనంద్ మోహన్ వై శ్యాంసుందర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.


*ఎన్ఐటీ వద్ద ఘన స్వాగతం*

 హనుమకొండలోని జిల్లా కోర్టుల సముదాయంలో కోర్టుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, హైకోర్టు న్యాయమూర్తులు వరంగల్ ఎన్ఐటి కి చేరుకోగా వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఇతర న్యాయమూర్తులు పూల మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఐటి నుండి  హనుమకొండ కోర్టుల సముదాయానికి చేరుకోగా  పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. వేద పండితులు, న్యాయమూర్తులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

హనుమకొండ జిల్లా కోర్టుల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటైజేషన్ ప్రారంభించుకోవడం తెలంగాణలో ఇదే ప్రథమమని అన్నారు. ఇక్కడే దీనిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ- సేవా కేంద్రాల సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

హనుమకొండ వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ రాజేశ్వర్ రావు లను ఘనంగా సన్మానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు  బుజ్జిబాబు, మల్లికార్జున్, తదితరులు సత్కరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ  ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా బిఆరెస్ పార్టీ కి చేశారు. బిఆరెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను పంపించారు. తనకు అవకాశాలు కల్పించిన కెసిఆర్,కెటిఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు బిజెపి లో చేరేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

శనివారం నుండే పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు , వివిధ రకాల ప్రచార సామగ్రిలు తొలగించాలని, 24, 48 ,72 గంటలలో తొలగించాల్సిన వాటిని సకాలంలో తొలగించాలని, ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీని తక్షణమే పని ప్రారంభించేలా చూడాలని,నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలని, ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా రూపొందించే సామగ్రి, ఇతర సామగ్రి పై దృష్టి సారించాలని, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ,ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకునే విధంగా ముందు నుండి చర్యలు చేపట్టాలని, ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే స్పందించాలని, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటుతోపాటు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి టీములు తక్షణం పని ప్రారంభించాలని ఆదేశించారు.

 ఎన్నికల షెడ్యూల్ తో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను మీడియా తో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని, సువిధ ద్వారా ఇచ్చే అన్ని అనుమతులకు తగు ఏర్పాట్లు చేయాలని, శాంతి భద్రతలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బందోబస్తు ప్రణాళిక, ఎన్నికల వెబ్ పోర్టల్ అప్డేట్ చేయడం, నగదు, మద్యం సీజ్ చేయడం ,ఎన్నికల ప్రవర్తనా నియమావళి తు.చ తప్పకుండా అమలు చేయడం, ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సితా పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకటరెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, డిఆర్ఓ వైవి గణేష్, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, జడ్పీ సీఈవో విద్యాలత, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, బి డబ్ల్యు ఓ మధురిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను  నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 

శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో లోక్ సభ ఎన్నికలు 2024 పై స్వీప్ కార్యక్రమాల  నిర్వహణ కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సన్నాహక  సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో  విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం సాగించాలన్నారు. మోడల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని,  అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న పోలింగ్ కేంద్రాలలో  పోలింగ్ శాతం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

 ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా పంచాయతీ అధికారి, స్వీప్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ రమాకాంత్, డిఆర్డిఓ నాగపద్మజ,  డిఇఓ డాక్టర్ అబ్దుల్ హై, జి డబ్ల్యు ఎం సి కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్,  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు,   నెహ్రూ యువ కేంద్ర  జిల్లా కోఆర్డినేటర్ అన్వేష్, సెంట్రల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, మెప్మా పీడీ  బద్రు నాయక్, డిస్ట్రిక్ట్  యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, డిడబ్ల్యుఓ మధురిమ,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వినియోగదారుల హక్కులపై  అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే  ఇతివృత్తం తీసుకుందన్నారు. పెరుగుతున్న 

ఆహార కల్తీని నిరోధించాల్సిన అవసరముందన్నారు. ఆహార కల్తీ నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార కల్తీ, వినియోగదారుల సమస్యలపై  దృష్టి సారించాలని వినియోగదారుల హక్కుల సంఘాల ప్రతినిధులకు సూచించారు.  ప్రతి వస్తువు  ఆన్లైన్లో లభిస్తున్నాయని, ఈ క్రమంలో ఆన్లైన్లో కూడా నాణ్యత లేని వస్తువులు,  మోసాలు జరుగుతున్నాయన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుంటే ప్రజలకు మెరుగైన సేవలను అందించవచ్చన్నారు. ప్రజల హక్కులకు భంగం కలగకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  వినియోగదారుల సంఘాల సహకారం తీసుకుంటామన్నారు. కన్స్యూమర్ ఫోరమ్స్  వినియోగదారులకు అందిస్తున్న  సేవల పట్ల అభినందనలు తెలియజేశారు.వినియోగదారుల ఫిర్యాదుల కోసం సెల్ ను  ఏర్పాటు చేస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, ఏఎస్వో నరసింహారావు, డిటీలు రోజా రాణి, కృష్ణ, రమేష్, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, జీడబ్ల్యూఎంసీ కాజిపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, వినియోగదారుల ఫోరం ప్రతినిధులు రతన్ సింగ్ ఠాకూర్, ఓరుగల్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధులు  తేరాల యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

MLC Kavitha arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేసినట్టు సమాచారం. పీఎం నరేంద్ర మోదీ.. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని.. ఆందోళన చేస్తున్నారు. మోదీకి , ఈడీ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అయితే.. కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ప్రీప్లాన్డ్‌గానే.. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంటును కూడా వెంట తీసుకొచ్చిన అధికారులు.. ముందుగానే 8:45 ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఈడీ అధికారులతో హరీశ్ రావు, కేటీఆర్.. వాగ్వాదానికి దిగారు.మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరిలో.. మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయటం, ఐదు గంటల సోదాల అనంతరం అరెస్ట్ చేయటం సర్వత్రా సంచలనంగా మారింది. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావించిన పలువురిని.. అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే.. ఈ కేసు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు.. అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పటికే ఈడీ ఎదుట రెండు మార్లు కవిత విచారణకు హాజరుకాగా.. ఆ తర్వాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీం ఈ నెల 19కు వాయిదా వేసింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్ల:14:3:24: మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్:పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ 1,61,,320/- రూపాయల నగదు,సెల్ ఫోన్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్(ఐజి)ఆదేశాల మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ రెడ్డి అధ్వర్యంలో ఎస్ఐ  ప్రసాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది,గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ లో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట  స్థావరం పై దాడి చేసి 09 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.వారి వద్ద నుండి సెల్ ఫోన్లు 1,61,320/-నగదు,పేక ముక్కలు,08 సెల్ ఫోన్ లు స్వాధీనపరచుకోవడం జరిగింది.పట్టుపడిన వారి వివరాలు.1.బాసినేని సత్యనారాయణరావు s/oభీమ్రావు r/o ముస్త్యాల

2.మాదాసు రాజుs/o ఐలయ్య r/o Csp కాలనీ

3.3.బర్ల శ్రీనివాస్s/o ఓదేలు r/o జూలపల్లి

4.కళ్యాణి రవికుమార్ S/oబుచ్చిబాబు r/o లెనిన్ నగర్

5.ధనాల లక్ష్మణ్ S/o సూర్యనారాయణ r/o రమేష్ నగర్

6.ధనాల దుర్గ S/o గురువులు r/o హనుమాన్ నగర్

7. నీలం శంకర్ S/o సన్నీr/o హనుమాన్ నగర్

8.మామిడి శ్రీనివాస్ S/o అమృత రావుr/o హనుమాన్ నగర్

9. కుమ్మరి కుంట లింగమూర్తి.S/o ఒదయ్య r/oవిట్టల్ నగర్ లను  మరియు స్వాధీనపరుచుకున్న నగదు,సెల్ ఫోన్ లు,పేక ముక్కలను    విచారణ విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారి ఆ దినములో ఉన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్ కు బదులుగా టీజీ అనే పదాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2 ఆవిర్భావ తేదీన కేంద్ర ప్రభుత్వం వాహనాలకు టీజీ అని గెజిట్ ఇచ్చిందని అన్నారు. ఐఏఎస్ అధికారుల ఐడి కార్డులు గాని , ఇతరత్రా కేంద్రం గుర్తించిన ప్రతి అంశానికి సంబంధించి టీజీ అని ఉంటుందన్నారు. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమోకానీ ప్రభుత్వం ఆనాడు 17 రోజుల తదుపరి తిరిగి ప్రభుత్వం నుంచి మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి టీఎస్ గా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాబినెట్, శాసనసభ తీర్మానాలను అందజేసినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా కేంద్రం నుండి అనుమతులు వచ్చాయన్నారు. టీఎస్ కు బదులుగా టీజీగా అనుమతిస్తూ గెజిట్ను ఈరోజు జారీ చేసిందన్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుండి, శుక్రవారం నుండి రిజర్వేషన్ అయ్యే ప్రతి వాహనానికి టీజీ పేరుమీద అవుతాయన్నారు. ఇదొక మార్పు అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు జవాబు ఇది అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, ఇది పార్టీ నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తీసుకున్నది కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన టీజీ అనే పదం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ గా మార్చబడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం మేరకు టీజీ అనే పదాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రవాణా శాఖ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతికంగా చారిత్రకంగా తెలంగాణ సామాజిక భావనలను గౌరవించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యక్రమాలను చేస్తుందన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా , వెంకట్ రెడ్డి, డిటిసి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా  అశ్విని తానాజీ  వాకడే బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు  అందించగా జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన  అశ్విని తానాజీ వాకడే కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి:11:24:వేడిగడ్డటీవీlన్యూస్ ఛానల్:మతం మరియు మరియు మతోన్మాదం పైన,జై భారత్ వైఖరి అనే అంశంపై జరిగిన సమావేశ సదస్సు స్వయం,శ్రీకర్ణ మేద సదస్స,మతం-మతోన్మాదం అంశాలపై జైభారత్ అనుసరిస్తున్న వైఖరి,తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సప్రమాణ వివరణలతో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి,విజయవిహారం పత్రికా సంపాదకులు,హిందుస్ ఫర్ ప్లూరాలిటి,& ఈక్వాలిటీ,జాతీయ ప్రధాన కార్యదర్శియైన ఖదిజ్ఞాసి యోధ విజయవిహారం రమణమూర్తి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.ఈ ప్రసంగంపై సభలోని ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పలువురి స్పందనల అనంతరం రమణమూర్తి స్పందించారు,సమావేశస్వ.త్రి.మే.స-2024 ఉద్యమ నిర్మాణాన్ని బలపరిచేందుకు-స్వయం,త్రికరణ,మేధోమథన,సమీక్షా మతాలు వాటి పై సమాలోచన  

(మార్చి11,12,13,2024,మూడు రోజులపాటు హైదరాబాద్) ఎల్బీనగర్లోని ఎమ్మెస్ సలీం ప్రాంగణంలో సోమవారం నాడు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సమాలోచన సమావేశం,మొదటిరోజు దిగ్విజయంగా జరిగింది,అనంతరం విజయవిహారం రమణమూర్తి రచించిన పుస్తకం ఏ కారణం వల్ల ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తున్నామో,అదే కారణం వల్ల,జమాతే ఇస్లామీ నీ.వ్యతిరేకిస్తున్నాo!అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు,ఈ సమావేశానికి నాలుగైదు రాష్ట్రాల నుంచి,పెద్దపల్లి,కరీంనగర్ మంచిర్యాల,వరంగల్,ఖమ్మం జిల్లాల నుండి,నాయకులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని అక్రమ కలప వ్యాపారం జోరుగా సాగుతుంది. మండల పరిధిలోని పాల్వంచ బర్దిపూర్, దన్నురా, కాధ్లుర్ కుసంగి గ్రామ శివారులోని పంట పొలాల వద్ద పచ్చని చెట్లను నేలమట్టం చేసి కలప వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అక్రమ కలప వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని ప్రచారం నిర్వహిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చని చెట్లు నీలమట్టమవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జనగాం: చనిపోయిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి తనతో రమ్మంటోందని ఓ వివాహిత బుధవారం సూసైడ్ చేసుకుంది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపురానికి చెందిన రాధిక కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాధిక నిన్న తన అన్నకు ఫోన్ చేసి చనిపోయిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి రమ్మంటోందని తెలిపింది. అవేమీ పట్టించుకోవద్దని రాధికకు తన అన్న దైర్యం చెప్పాడు. అనంతరం రాధిక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కరీంనగర్: 

ఓ వ్యక్తి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గరలోని బాలాజీ నగర్ సుచిత్ర అపార్ట్మెంట్లో కామారపు రమేశ్ (56) నివసిస్తున్నారు. అదే అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి అతడు దూకగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాలేశ్వరం ప్రతినిధి / దూది రాకేష్

కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ వారి సన్నదిలో మహాదేవపూర్ మండల ఎస్ సి సెల్ అద్యక్షులు లేతకారి రాజబాబు అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపాల్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ సెక్రెటరీ అండ్ కమిషనర్ మేడం//"ఐటి పరిశ్రమలు శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు పుణ్య దంపతులైన గౌరవ  శైలజ రామయ్యర్ - శ్రీదర్ బాబు గారి వివాహ వార్షకోత్సవం సందర్భంగా వారిపై వారి కుటుంబ సభ్యులపై కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకం చేయడము జరిగింది.ఈ కార్యక్రమములో ఎంపిటిసి రేవెల్లి మమత జిల్లా ప్రధాన కార్యదర్శి కామిడీ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు మాచర్ల సారయ్య సీతయ్య హైదర్ ప్రచార కమిటీ అధ్యక్షులు షకీల్ ఉపాధ్యక్షులు తాజోద్దిన్ బాబా మహిళ నాయకురాలు లేతకరి కవిత యూత్ అద్యక్షులు నిట్టూరి నగేష్,యూత్ నాయకులు అరుణ్ సంతోష్ మైనార్టీ నాయకులు ఫరీద్ పాల్గొన్నారు.