పెద్దపల్లి:గోదావరిఖని,నవంబర్,23, మేడిగడ్డటీవీన్యూస్: న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ అందరి హక్కు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 5000 రూపాయలు ఇవ్వడం న్యూ ఇండియా పార్టీ ప్రథమ కర్తవ్యమని,ఆర్థిక స్వేచ్ఛకోసం యుద్ధం చేస్తున్న వేముల అశోక్ ని గెలిపించాలని న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా.జేవి రాజు అన్నారు.న్యూ ఇండియా పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల అశోక్,పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.జేవి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్దసంఖ్యలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి తిలక్ నగర్ మీదుగా రమేష్ నగర్,లక్ష్మీనగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు,ఈ సందర్భంగా డా.జేవి రాజు మాట్లాడరు,అందరికీ ఆర్థికస్వేచ్ఛ అనే నినాదం ప్రత్యేకతను సంచరించుకుందని,అందరు అభ్యర్థుల్లో అన్ని రకాలుగా అనుభవం ఉన్న అభ్యర్థి,డైనమిక్ లీడర్ వేముల అశోక్ అని,పార్టీ మేనిఫెస్టో హామీలతో రామగుండం ప్రజల మనసులను చురగొంటున్నాడని,రామగుండం ఎమ్మెల్యేగా వేముల అశోక్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థి వేముల అశోక్ మాట్లాడరు,ఇప్పుడున్న నాయకులు పనికిరాని మేనిఫెస్టోలు చూపెట్టి తర్వాత మర్చిపోయి,అందినంత దోచుకుందాం దాచుకుందాం అనే రకంగా రాజకీయాన్ని అవినీతిమయం చేస్తున్నారన్నారు.తమ నాలుగు మేనిఫెస్టో లయినా పౌరసత్వ బంధుపథకం,ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతినెల 5000 చెల్లించుట,గ్రామబంధుపథకం:ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకు ఏటా అయిదు కోట్లతో ఉత్పత్తి కేంద్రాలు అందరికీ ఉద్యోగాలు కుటుంబ బంధు పథకం:ప్రతి కుటుంబానికి 12 లక్షలతో వ్యాపార అవకాశం కల్పించడం'ఆహార వ్యవసాయ బృంద పథకం:ప్రతి కుటుంబానికి భూమి ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 75 వేల రూపాయలు చెల్లించుట,మొదలగు హామీల గురించి వివరించుతూ,తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి,రామగుండం నిజమైన అభివృద్ధికి సహకరించాలని,తమ గుర్తు కుండ అని,అందరు కుండ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీనాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: