పెద్దపల్లి,గోదావరిఖనినవంబర్23,మేడిగడ్డటీవీన్యూస్,రామగుండం.నియోజకవర్గంలోని మార్కండేయ కాలనీ బిజెపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి, గురువారం బిజెపి రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి మాట్లాడరు,కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి దళిత జాతిని తన్నిన విధానంను,బిఆర్ఎస్ నేత కేసిఆర్ దళిత మంత్రిని దూరంగ నెట్టివేసిన విధానంను చూస్తే కాంగ్రెస్,టీఆర్ఎస్ లు ఒక్కటేనని,దళితుల పట్ల వారి హేయమైన విధానం అర్థమవుతుందని,అందుకే దళితులందరు తమ ఆత్మగౌరవం కాపాడుకుంటూ నిజమైన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.దాదాపు మూడు దశాబ్దాల పోరాటాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ,పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాననడం చారిత్రాత్మక ఘట్టమని,అందుకే దళిత మాదిగ జాతిని అక్కున చేర్చుకొన్న నరేంద్రమోడీ నాయకత్వానన్ని,బిజెపి పార్టీనిఆదరించాలని,దళిత మాదిగ జాతి అంతాఏకమై తనను నియోజకవర్గంలో తనను గెలిపించాలని రామగుండం ఎంఆర్పిఎస్ నాయకులను,కార్యకర్తలను,ప్రజలను కోరిన కందుల సంధ్యారాణి.ఈ సందర్భంగా రామగుండం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడరు,ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లలో బిజెపి పార్టీకి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు.హైదరాబాద్ లో జరిగిన ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభలో దళిత మాదిగ జాతి బిడ్డనిని అక్కున చేర్చుకొన్న మోడీనీ,బిజెపిని ఆదరిస్తామన్నారు.ఎమ్మార్పీఎస్ ప్రధాన డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని,పార్లమెంటులో బిల్లు పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని,అందుకే తెలంగాణలో తమ పూర్తి మద్దతు బిజెపికి ఉంటుందని తెలియజేశారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: