ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల పోలీస్ పరిశీలకులు, ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ కు చెందిన అమిత్ కుమార్ ని మంజూర్ నగర్ లోని ప్రభుత్వ అతిథి గృహంలో ఎస్పి కిరణ్ ఖరే పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, జిల్లా భౌగోళిక పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులు, సమస్యత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ తో పాటు, భద్రతా పరంగా తీసుకుంటున్న వివిధ అంశాలను చర్చించారు.

Post A Comment: