ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విద్యార్థులు తమ కుటుంబంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటు వేసే విధంగా మీవంతు బాధ్యతగా చైతన్యం తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటరు చైతన్యంపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావి భారత ఓటర్లైనా విద్యార్థులూ ఓటు హక్కు కలిగిన తమ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు ఓటును తప్పకుండా వేసేవిధంగా చైతన్యం తీసుకువచ్చే బాధ్యత ను కలిగి ఉండాలన్నారు. ఎన్నికల్లో పల్లెలు, పట్టణాల్లోఎక్కువ ఓటింగ్ శాతం పెరిగే విధంగా కృషి చేద్దామన్నారు. జిల్లాలో తొలిసారిగా పశ్చిమ నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థులు ఓటును గురించి చైతన్యం తీసుకువచ్చే విధంగా, ఓటు హక్కు కలిగిన వారిని ఓటు వేసేలా ప్రయత్నం చేసే ప్రమాణ పత్రం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని డి. ఈ. వోకు సూచించారు. ఓటు వేసే విధంగా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ప్రమాణ పత్రంలో ఓటు ఉన్నవారి సంతకాలను తీసుకుని పాఠశాలలో అందజేయాలన్నారు. మిషన్ 2029లో ఓటింగ్ శాతం పెరిగేవిధంగా కృషి చేద్దామన్నారు. ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా డి. ఈ. వో డాక్టర్ అబ్దుల్ హై మాట్లాడుతూ నవంబర్ 28వరకూ ఓటు హక్కు పై చైతన్యం తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పేరెంట్ ఓటు వేసేవిధంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు.
ఈ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో అమలు అయ్యేవిధంగా ఎంఈవో, హెచ్ఎం, సిఆర్పీలకు వెంటనే తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు కలిగిన తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటును తప్పకుండా ఓట్లు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ' ఓడిపోనియ్యకు నీ ఓటును ' అంటూ సాగిన గీతానికి విద్యార్ధినులు నృత్యం చేశారు. అదేవిధంగా వేయిద్దాం. వేయిద్దాం, కుటుంబ సభ్యులతో ఓటును వేయిద్దాం, గెలిపిద్దాం. గెలిపిద్దాం. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్, కమ్యూనిటీ మొబిలైజెషన్ ఆఫీసర్ బోయినపల్లి రాధ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Post A Comment: