ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఈనెల   5 న గురువారం  సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు ప్రదేశాలలో  5 ఇన్ క్లైన్ మైన్ పరిధిలో మరియు జయశంకర్ పార్క్ దగ్గర గల భారత్ గ్యాస్ గోదాం వద్ద  భూపాలపల్లి పోలీసు వారు ఇద్దరు వ్యక్తుల వద్ద మొతం (4.875+2.565=7.44) 7.44 కే‌జి ల ఎండు గంజాయి ని మరియు వారి వద్ద 2 సెల్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ తెలిపారు . వారి పై  458/2023 U/s 8(c),r/w 20(b) NDPS Act,  459/2023 U/s 8(c),r/w 20(b) NDPS Act ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అట్టి ఎండు గంజాయి కలిగిన వారి వివరాలు మొదటి వ్యక్తి .కంది సాయి చరణ్(23),  సుభాష్ కాలనీ భూపాలపల్లి,  మందల కళ్యాణ్ కుమార్( 22)  భాస్కర్ గడ్డ భూపాలపల్లి. ఇట్టి ఎండు గంజాయిని వీరిద్దరు సుభాష్ కాలనీ భూపాల్పల్లి కి చెందిన  తోట పవన్ అనే వ్యక్తి వద్ద కొన్నట్లు విచారణలో తెలిసింది. శుక్రవారం  కంది సాయి చరణ్ ను   మరియు మందల కళ్యాణ్ కుమార్ లను  జ్యుడీషియల్ రిమాండుకు తరలిస్తున్నామని ఎస్పి  తెలిపారు. తోట పవన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఇట్టి గంజాయి విలువ మార్కెట్లో మొత్తం దాదాపు 1,86,000/- రూపాయల వరకు ఉంటుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

భూపాలపల్లి జిల్లా ఎస్‌పి  పుల్లా కరుణాకర్  గంజాయి నిర్మూలన లక్ష్యంగా  గంజాయి పై రైడ్స్ చేయమని ఆదేశించగా అట్టి ఆదేశాల మేరకు భూపాలపల్లి డి‌ఎస్‌పి ఏ.రాములు  ఆధ్వర్యంలో ఇట్టి గంజాయి ని భూపాలపల్లి సిఐ.ఏ.రాంనర్సింహారెడ్డి ,ఎస్సైలు  సిహెచ్ 

 శ్రావణ్ కుమార్, జి.సంధ్యారాణి, డి. స్వప్నకుమారి  వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది . ఈ సందర్బంగా  ఎస్పి  మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ప్రజలు,  యువత పోలీసులకు తెలపాలని కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: