ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;మంత్రి కేటీఆర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సంక్షేమ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నరేందర్ వారందరికి దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ సంక్షేమ ఫలాలు పొందే లబ్ధిదారులతో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్ తో పాటు నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Post A Comment: