ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
శనివారం నాడు కలెక్టర్ సెయింట్ పీటర్స్ హై స్కూల్, గీతాంజలి డిగ్రీ కాలేజీ లలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్ష లకు ..ఫస్ట్ పేపెర్ లో 47973 మంది అభ్యర్థులకు 39255 హాజరు కాగా సెకండ్ పేపర్ కు 47973 మంది అభ్యర్థులకు 39031 మంది హాజరు ఐయ్యరు అని అన్నారు.ఫస్ట్ పేపెర్ లో 81.83% సెకండ్ పేపెర్ లో 81.36%నమోదు ఐయ్యింది అని అన్నారు.


Post A Comment: