మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మహాదేవపూర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్తూపం, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులతో కలిసి ఆవిష్కరించి, అమరులకు పుష్పాలతో ఘన నివాళులు అర్పించి సంస్కరణ సభలో పాల్గొన్న మంథని నియోజకవర్గ ఇన్చార్జ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడుతుండగా తెలంగాణ ఉద్యమ గొంతునొక్కిన చరిత్ర కాంగ్రెస్‌ పాలకులదేనని, 

ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాడు మంత్రిగా ఉన్నసమయంలో నియోజకవర్గంలో ఉద్యమాన్ని అణిచివేసేలా ప్రయత్నం చేశారని, ఈ ప్రాంతంలో ఉద్యమం లేదని చాటి చెప్పే ప్రయత్నంలో బాగంగా, కొయ్యూర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సభను నిర్వహించి, ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు గొప్పగా సభ నిర్వహించామని, ఉద్యమం లేదని చాటి చెప్పాడని ఆయన గుర్తు చేశారు. కానీ అలాంటి అణిచివేసే ప్రయత్నాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, తమ ఉద్యమ స్పూర్తిని చాటి చెప్పేలా ఈనాడు తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల స్పూర్తితో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, ఈనాడు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పగా పరిపాలన అందిస్తోందన్నారు. నాడు, నేడు పరిస్థితులపై బేరీజు వేసుకునే విధంగా తెలంగాణ ఆవిర్బాద దశాబ్దిఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈనాటి తెలంగాణ ప్రభుత్వంలో జగిగిన అభివృధ్ది, మార్పులపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృధ్దిని బేరీజు వేసుకోకపోతే మళ్లీ మోసం చేసేవాళ్లు మన ముందుకు వస్తారని ఆయన తెలిపారు. గత పాలకుల పనితీరుకు మహాదేవ్‌పూర్‌ బస్టాండ్‌ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని, 1991లో బస్టాండ్‌ ప్రారంభమైతే, 2014వరకు కూడా బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. పేరుకే బస్టాండ్‌ ఉన్నా, బయట నుంచే బస్సులు వచ్చి పోయేవనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 2014తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బస్టాండ్‌ను అభివృధ్ది చేసి, సకల సౌకర్యాలు కల్పించామని, ఈ ప్రాంత ఆడబిడ్డల ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురు కావద్దనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉన్న నాయకులే మన గురించి ఆలోచన చేస్తారే తప్ప, ఏదో అధికారం, పదవుల కోసం ఆరాటపడేవారు ఎందుకు అభివృధ్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. బారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, ఈ నియోజకవర్గంలో ప్రపంచ మేధావిగా పేరు గాంచిన అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ నాయకులు కనబడనీయలేదని, ఒక్క విగ్రహం పెట్టి ఆయన చరిత్ర చాటి చెప్పే ప్రయత్నం కూడ చేయలేదన్నారు. తమ విగ్రహాలే పెట్టి, తమ చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తూ, చీకట్లోనే ఉండాలని కోరుకున్నారే కానీ, ఈ ప్రాంతానికి వెలుగులు ప్రసాదించాలని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. అలాంటి చీకటి పాలనను అంతం చేయాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని, అభివృధ్ది, సంక్షేమం బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: