మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పి ఓ డబ్ల్యూ , సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా అధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా పి ఓ డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి, జిల్లా నాయకురాలు మార్త రాధ, సి పి ఐ యం ఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్,పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించింది. దీన్ని చూసి పేదలకు భూములూ, ఇళ్ళ స్థలాలూ, కొలువుడా, ఇండ్లు, రేషన్ కార్డులూ తదితర సమస్యలు సమసిపోతాయని ప్రజలు ఆశించారు. సర్వేలు జరిపి సంస్థలు గడిచినా లీఅర్ఎన్ పాలనలో ప్రజలకు జరిగింది. ఒరిగింది ఏమీ లేదు.

పాలకులు ధరల మీద, ధరలు పెంచుతున్నారు. పక్షం రోజులకోసారి పెట్రోల్, సీజర్ ధరలు పెరిగిన ఫలితంగా రవాణా ఛార్జీలూ, ఉప్పు, పప్పు దగ్గర నుండి ప్రతి వస్తువు ధరలూ పెరిగాయి. ఆ మూలిగే నక్కపై తాటిపండు వద్ద చందంగా ఎఎ మోడీ పాలనకు ముందు 450 రూ. కున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 రూ?లు వరకు పెంచి, సబ్సిర్ ఎత్తేసింది. మోడి ప్రభుత్వం నాకులను నాటి, గద్దలకేసినట్లుగా పేరోళ్ళు నోళ్ళు గొట్టి అతి పెద్ద కుబేరులయిన అదానీ, అంబానీలకేమో లక్షల కోట్లు దోచి పెడుతుంది ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు భద్రత కల్పించే ప్రణాళికలు లేవు. పైగా ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చే వైపుగా పాలకుల విధానాలున్నాయి. కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకూ అర్హులైన లక్షలాది మంది లబ్దిదారులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా, వారికి కార్డులివ్వలేదు. కేవలం 5 కేజీల బియ్యం అవి కూడా ఎఫ్.సి.ఐ. గోదాముల్లో ముక్కి పురుగుపట్టినవి ప్రజల మొఖానపోస్తున్నారు. రుచీవరీలేని అన్నం తినలేక వాటిని కోళ్ళకూ, పశువులకు పెడుతున్నారు. ఏదో కొద్ది మంది. మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఏ రాయితీ పొందాలన్నా, తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కనుక కార్డు పోతుందనే భయంతో విధిలేక రేషన్ బియ్యం అక్కడికక్కడే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి మిల్లర్లు లాభాలు గడిస్తున్నారు. వీటినే సన్న బియ్యమిస్తున్నామని కేసీఆర్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, మూడు లక్షల మందికి మాత్రమే వార్డులు మంజూరు చేశారు. ఒక్కో జిల్లాలో 30 వేల నుండి దాదాపు 80 వేల మందికి పైగా లబ్ధిదారులను అర్హులుగా నిర్ధారించారు. కానీ మంజూరు చేయలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులైన వారికి కార్డులు మంజూరు చేయాలనీ, కేషన్ షాపుల ద్వారా 12 రకాల విద్యావసర సరుకులను పంపిణీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ను సగం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 ఒకొక్కరికి కేంద్రం 5 కేజీలు, రాష్ట్రం కేజీలు సన్న బియ్యం పంపిణీ చేయాలని రేషన్ షాపుల ద్వారా మంచినూనె, కంది పప్పు, చింతపండు, గోధుములు, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, చక్కెర, టీ పొడి ఉచితంగా అందించాలి.అర్హులైన వారందరికి రేషన్ కార్డులివ్వాలి. వంట గ్యాస్ ను సగం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: