మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్/మహారాష్ట్ర లోనీ, గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందారు. ఈ ఘటనలో పోలిసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా మౌజా తోడఘట్ట వద్ద  నక్సలైట్లు భారీ మెరుపుదాడికి ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక జవాన్లు, గడ్చిరోలి పోలీసులు శనివారం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 

ఉదయం 10:00 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలోని కొండపై 60 నుండి 70 మంది నక్సలైట్లు బిజిఎల్, ఇతర ఆయుధాలతో  కాల్పులు జరిపారు. దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది. అనంతరం నక్సలైట్లు  అడవిలోకి పారిపోయారు.


ఎన్‌కౌంటర్ తర్వాత, జవాన్లు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, ఘటనా స్థలంలో ఒక మావోయిస్ట్  మృతదేహం లభ్యమయ్యింది. మరణించిన నక్సల్‌ను సమీర్ అలియాస్ సాధు లింగ మోహన్దా(31) గా గుర్తించారు. అతనిపై 4 కేసులు నమోదయ్యాయనీ పోలిసులు తెలిపారు. 2018 లో పోస్టే భామ్రాగర్‌లో పోలీసులపై మెరుపుదాడి చేసినందుకు కేసు కూడా నమోదైంది. ఈ ఘటనలో 01 కంట్రీ మేడ్ రైఫిల్, 01 భర్మార్ రైఫిల్,1 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, 2 మ్యాగజైన్‌లు, 30 రౌండ్ల ఎస్ఎల్ఆర్ రౌండ్లు, 8 ఎం. ఎం. 3 రౌండ్లు రైఫిల్, 12 బోర్ 4 రౌండ్లు,  శాంసంగ్ కంపెనీ 1 ట్యాబ్లెట్, 1 రేడియో, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: