మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా యువ చైతన్య వెల్ఫేర్ సోసైటి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మొండయ్య (మధు)ను జాతీయ పురస్కారాల మహోత్సవ సన్మాన పత్రం మరియు సామాజిక సేవా రంగంలో జాతీయ గౌరవ పురస్కారం "కీర్తి సేవా రత్న" తో సత్కరించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం, ఇద్దులపూర్ గ్రామంకు చెందిన ప్రోగ్రెస్సివ్ పేరెంట్స్ లీగ్ (ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మొండయ్యకు (మధుకు), సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రాజ్యలక్ష్మి కన్వెన్షన్ పంక్షన్ హల్ లో యువ చైతన్య వెల్ఫేర్ సోసైటి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు-2023 సందర్భంగా, ఈ జాతీయ గౌరవ పురస్కారంతో సత్కరించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా శాసనసభ్యులు వొడితల సతీష్, విశిష్ట అతిధులు డాక్టర్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత మరియు సలహాదారులు పురస్కారాల చైర్మన్ విశ్వకర్మ సేవా పౌండేషన్ మరియు సలహాదారులు, పురస్కారాల నిర్వహణ కమిటి హాజరైనారు. అనంతరం మాట్లాడుతూ సేవా భావం ఉన్న అన్ని రంగాల వారికి గత 20 సంవత్సరాలుగా సత్కరిస్తున్నారన్నారు. సేవ రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు ధార మధు ని హృదయ పూర్వకంగా అభినందిస్తూ, ఈ కృషి నిరంతరం కొనసాగాలని, ఇంకా ఎన్నో అద్భుతాలను ఆకాంక్షిస్తూ, విజయాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రోగ్రాం మేనేజ్ మెంట్ కో-ఆర్డినేటర్ పురస్కారాల నిర్వహణ కమిటి బ్రాహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్, అధ్యక్షులు జొన్నగోని యాదగిరిగౌడ్, పురస్కారాల నిర్వహణ కమిటి అధ్యక్షులు కళ్లెం లక్ష్మన్, ఏంపటి శ్రావణి గిన్నిస్ అవార్డు గ్రహీత, పి పి ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తీట్ల రజిత, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: