మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కాన్సెన్సీ పరిదిలోని నిరుపేదలు అనారోగ్య కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి ఎలాంటి పనులు చెయ్యలేక దీన స్థితిలో ఉన్న ఎనమిది నిరుపేద కుటుంబాలకు సేవ స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధితులకు నెలకు పది కిలోల బియ్యం అందజేస్తూ బాధిత కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి పది కిలోల బియ్యం అందజేశారు అనంతరం
సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో కాళ్ళు చేతులు కోల్పయిన వారికీ సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుఫున ప్రతి నెల పది కిలోల సన్న బియ్యం. అందజేస్తామని గతంలో మేం ప్రకటించడం జరిగిందని ఇచ్చిన మాట తప్పకుండా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో బాధితులకు బియ్యం అందజేయడం జరుగుతందని మల్లేష్ తెలిపారు సేవా స్పూర్తి ఫౌండేషన్ కు సహాయ సహకారాలు అందిస్తు బాధితులను ఆదుకుంటున్న ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరున బాధిత కుటుంబాల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాని మడిపెల్లి మల్లేష్ అన్నారు బియ్యం పంపిణీ చేసిన బాధిత కుటుంబాలు
ఎల్కలపెల్లి గెట్ కు చెందిన ముస్కె నర్సయ్య.
రామగుండం కు చెందిన
కోట మంగ.
ఎన్టీపీసీ కాకతీయ నగర్ కు చెందిన
మాదిరి రమేష్.
37 వార్డు
భరత్ నగర్ కు చెందిన
వినోద్ కుమార్.
పూదరి అమృత.
రామగుండం లింగంపూర్ కు చెందిన ఇరికిళ్ల శ్రీనివాస్.
38 వార్డు సంజయ్ గాంధి నగర్ కు చెందిన బాగ్ అనిత కు
45 వ వార్డు కు చెందిన చొక్కాల లత
ఎనిమిది కుటుంబాలకు ఈరోజు 10 కిలోల బియ్యం అందజేశామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కన్నూరి శంకర్. కసిపేట సతీష్. నిమ్మరాజుల రవి. రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహ్మద్ రహీం పాల్గొన్నారు

Post A Comment: