మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఏజెన్సీ దళితుల సమస్యలు పరిష్కరించండి

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

పుట్టిన భూమి హక్కు లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు

75 సంవత్సరాల స్వతంత్రంలో ఏజెన్సీ దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు

ఏజెన్సీ దళితుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ఈ మేరకు ఆయన కరీంనగర్ శ్రీపురం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో  మంత్రి కొప్పులను కలిసి  పలు ఏజెన్సీ దళితుల సమస్యలు వివరించారు.  రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏజెన్సీ దళితులకు వర్తించడం లేదని ఆవేదన చెందారు తాతలతండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు , పుట్టిన భూమిపై హక్కులు లేక రాజకీయ రిజర్వేషన్  లేక చదువుకున్న విద్యార్థులకు స్థానిక ఉద్యోగాల్లో అవకాశం లేక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు . సాగు భూములకు, పోడు భూములకు హక్కు హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రైతు బీమా రైతుబంధు బ్యాంకు రుణాలు సబ్సిడీ విత్తనాలు మొదలైన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు, రాజకీయం ఎదగాలన్న కనీసం సర్పంచ్ అయ్యే అవకాశం కూడా లేదన్నారు. విద్యార్థులకు డిగ్రీలు పేజీలు చదివిన జీవో 3 తో స్థానిక ఉద్యోగ నియమాకాల్లో అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏజెన్సీ దళితులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రంగంలో చూసిన  అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు..ఏజెన్సీ దళితుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి  కొంత బడ్జెట్  కేటాయించాలని, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని.ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులకు గుర్తించి ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు జీవో త్రీ రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. అందుకు సానుకూలంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: