ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురు వారం   జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హనుమకొండ వారి అధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ మరియు అవగాహన సదస్సుని ఘనంగా నిర్వహించడం జరిగినది. కే‌ఎం‌సి , హనుమకొండ నందు ముఖ్య అతిధి  సంధ్యారాణి, అడిషనల్ కలెక్టర్   ఎస్.కే, ఆరిఫ్ డిస్ట్రిక్ట్ జూనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ తరుపున, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు  గిరికుమార్, డాక్టర్.బి. సాంబశివ రావు, డి‌ఎం‌హెచ్‌ఓ, ముఖ్య అతిధులుగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రాంరంభించినారు. ఈ ర్యాలీలో  బ్యానర్లు, ప్లా కార్డ్ ల ప్రదర్శనలతో, నినాదాలతో మరియు కళా బృందాల సందేశాత్మక పాటలతో భద్రకాళి గుడి ఆర్చ్ నుండి కొనసాగుతూ కే‌ఎం‌సి ఆడిటోరియం కు చేరుకున్నది. 

తదనంతరం కే‌ఎం‌సి, ఆడిటోరియం నందు అవగాహన సదస్సులో భాగంగా ముందుగా డాక్టర్. మదన్ మోహన్ రావు, అదనపు జిల్లా వైద్య అధికారి (లేప్రాసి మరియు ఎయిడ్స్ )  స్వాగత ఉపన్యాసం చేస్తూ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వార్షిక నివేధికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియచేశారు. తరువాత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.  తదనంతరం ముఖ్య అతిధులు ప్రసంగిస్తూ  సంధ్యారాణి, అడిషనల్ కలెక్టర్  మాట్లాడుతూ  సమాజం లో ఎయిడ్స్ పైన ఉన్న అపోహలని తొలగిస్తూ అవగాహన ని పెంచుతూ, ఎలాంటి  అసమానతలు లేకుండా ఎయిడ్స్ వ్యాధిని  అంతం చేయాలని ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా  రూపు మాపాలని, రోగిని కాదు రోగాన్ని దూరం చేయాలని తెలియ చేశారు. మరొక ముఖ్య అతిధి  ఎస్.కే ఆరిఫ్ డిస్ట్రిక్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎయిడ్స్ నియంత్రణ లో ముందస్తు జాగ్రత చర్యలు మరియు అందుబాటులో గల చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పై చిన్న చూపు కలిగిఉండకుండా సమ భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. అంతేకాకుండా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి తరుపున హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తులకు నెలకు 10 కె.జి‌. ల బియ్యం ఉచితంగా అందచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

 డాక్టర్.బి. సాంబశివ రావు, డి‌ఎం‌హెచ్‌ఓ  మాట్లాడుతూ హెచ్‌ఐవిు నాలుగు విధాలుగా మాత్రమే  సోకుతుందని అవి అసురక్షిత లైంగిక సంభంధల ద్వారా, కలుషితమైన సూధులు, సూరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా మరియు హెచ్‌ఐవి్ సోకిన తల్లి నుండి పుట్ట బోయే బిడ్డకు హెచ్‌ఐవి  సోకుతుందని కావున ప్రతి గర్భిణి స్త్రీకి సాదారణ పరీక్షలతో పాటు హెచ్‌ఐవి ఎయిడ్స్ టెస్ట్ తప్పనిసరి చేయించాలని, లైంగిక వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రతి గురువారం అడల్ట్ ఫ్రీoడ్లీ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్లినిక్స్ మరియు కౌమార దశలో గల బాల, బాలికలకీ ఔట్ రీచ్ క్యాంప్స్ నిర్వహించాలని సూచించారు. శ్రీ. రవీందర్, కరుణమైత్రి సొసైటి, ప్రసాగించడం జరిగినది. తదనంతరం హెచ్‌ఐవి/ఎయిడ్స్  సేవలు అంద చేయుచున్న వారికి ప్రశంస పత్రములు ముఖ్య అతిధుల ద్వారా పంపిణీ చేయడం జరిగినది.

ఈ కార్యక్రమం లోశ్రీమతి సంధ్య రాణి, అడిష్ నల్ కలెక్టర్, ఎస్.కే, ఆరిఫ్ డిస్ట్రిక్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ , డాక్టర్.బి. సాంబశివ రావు డి‌ఎం‌హెచ్‌ఓ, డాక్టర్. మదన్ మోహన్ రావు, అదనపు జిల్లా వైద్య అధికారి (లేప్రాసి మరియు ఎయిడ్స్ ), డాక్టర్. రాకేశ్ తాన అద్యక్షులు, డాక్టర్. మోహన్ దాస్, ప్రిన్సిపల్ కే‌ఎం‌సి, శ్రీ. రవీందర్, కరుణమైత్రి సొసైటి, డాక్టర్. హిమబిందు డి‌టి‌సి‌ఓ,  , ఎన్‌సి‌సి లేఫ్త్నెంట్ డాక్టర్ ఓంకార్, సంగీత,  డాక్టర్.మధుసూదన్ రెడ్డి జి‌ఎం‌హెచ్, డాక్టర్.యాకూబ్ పాషా డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ, డాక్టర్.ఉమాశ్రీ పి‌ఓ‌ఎన్‌సి‌డి, డాక్టర్ వాణిశ్రీ పి.ఓ డి.ఎస్‌. ఓ, ట్రాన్స్ జెండర్ ల ప్రతినిధి పూర్ణిమ, డాప్కో సిబ్బంది, ఎన్‌సి‌సి కడేట్స్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్, కే‌ఎం‌సి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్.టి. ప్రభాకర్, రోహిణి హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థులు, అర్బన్ హెల్త్ సెంటర్ ల మెడికల్ ఆఫీసర్ లు, సిబ్బంది, స్టాటిస్టికాల్ అధికారి ప్రసన్న కుమార్, డిప్యూటీ డెమో ప్రసాద్, స్వప్నమాధురి  మరియు లేప్రాసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: