ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఖిలా వరంగల్ పడమర కోట చమన్ లో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు పోలీస్ కిష్టయ్య 13 వ వర్ధంతి సభ మాజీ కార్పొరేటర్, ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు బయ్య స్వామి అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పడమర కోట చమన్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి, పోలీస్ కిష్టయ్య చిత్రపటాలకు నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కానిస్టేబుల్ క్రిష్టయ్య త్యాగం మరువలేనిది. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వీరుడు కిష్టయ్య. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు. ముదిరాజుల కోసం ప్రభుత్వం సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీలు అందజేస్తుంది. చెరువులో మత్సకారుల కోసం చేప పిల్లలను పంపిణీ చేపట్టడం జరుగుతుంది. 67 ఏండ్లలో సమైక్యపాలకులు కుల వృత్తులను ద్వంసం చేసారు.అభివృద్దిని విస్మరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట సాదనతో అద్బుతంగా అభివృద్ది ఫలాలు అందుతున్నయ్. నియోజకవర్గాన్ని అభివుద్దిలో ముందుంచుతున్నాం. చెరువుల పునరుద్దరణతో కుల వృత్తులకు ఊతం వచ్చింది. రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ఎజెండా. అద్బుతమైన సూపర్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం. నియోజకవర్గంలో 7 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసాం. మనం ఎదగాలి, మన ప్రాంతం ఎదగాలి మన ప్రజలు ఎదగాలి. కుల మతాలను రెచ్చగొడుతూ కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నయ్.వారి కుట్రలను తిప్పికొట్టాలి. ముదిరాజ్ ల అభివృద్ది కృషిచేస్తాం,వారి సమస్యలను పరిష్కరిస్తాం. మీ జీవితాలు మారేందుకు కృషి చేస్తాం,విద్యార్ధుల భవిష్యత్ కోసం ఈ ప్రాంతంలో ఉపాది అవకాశాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నం. ఖిలా వరంగల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం. మీకు దగ్గరలోనే జిల్లా కేంద్రం ఏర్పాటవుతుంది. మీ ఆస్థి విలువ పెరగడంతో పాటు ఉద్యోగ ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కానిస్టేబుల్ క్రిష్టయ్య,శ్రీకాంతచారి లాంటి ఎందరో అమరుల త్యాగఫలం, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. వారి త్యాగాలు వృదా కాకుండా రాష్ట్ర ప్రజలకు సంక్షేమాభివృద్ది ఫలాలు అందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . కొందరు ఎన్నికలప్పుడే వస్తారు.నేను మీతో ఉన్నాను,కరోనా కష్టకాలంలో ఎన్నికలప్పుడే కనిపించే నాయకులు పత్తాలేకుండా పోయారు.మేం ప్రాణాలకు తెగించి 25 వేల కుటుంబాలకు సాయం చేసాం. మా కార్పోరేటర్ భర్త రాజును కోల్పోయాం. ప్రజాసేవకే మా జీవితాలను అంకితం చేసామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమం లో 37,38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ-సురేష్, భైరబోయిన ఉమా-దామోదర్ యాదవ్,కార్పొరేటర్ చింతాకుల అనిల్,ముదిరాజ్ నాయకులు చింతాకుల సునీల్,సంగరబోయిన చందర్, సంగరబోయిన విజయ్, అభిలాష్, రావుల రాజేష్, బొల్ల సుజాత, సిరబోయిన శ్రీనివాస్, సిరాబోయిన సోమేశ్వర్, మధు, రాజేష్, జనార్దన్, బంగారి నవీన్, ముదిరాజ్ నాయకులు, ప్రజలు తదితరులు, పాల్గొన్నారు.
Post A Comment: