ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో రామాలయ ప్రగతి పనులను పరిశీలించి, తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో గీత కార్మికులు తారసపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి వారి మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కల్లు బాగా పారుతోందా? లాభసాటిగా ఉంటోందా? పెన్షన్లు, బీమాలు అందుతున్నాయా? అంటూ ఆరా తీశారు. ఇదే సమయంలో మంత్రిని తమ కల్లు తాగాల్సిందిగా గౌడ సోదరులు కోరారు. తమ సంప్రదాయ కల్లును తాగి రుచి చూడాలని అభ్యర్థించారు. దీంతో గీత కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ, మంత్రి ఎర్రబెల్లి కల్లును సేవించి తమ సంతోషాన్ని గీత కార్మికుల తో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారన్నారు. ఆ పథకాల ఫలాలు అందరికీ అందాలన్నదే సిఎం కెసిఆర్ అభిమతమని మంత్రి తెలిపారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేశారు.

Post A Comment: