ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాజిపేట్ స్టేషన్ పర్యటనకు విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కలిసి పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్
సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాజిపేట్ రైల్వే జంక్షన్ కు సంబంధించిన ఫ్లాట్ ఫాంల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధిని కల్పించేందుకు పిరియాడికల్ ఓవరహాలిక్ సెంటర్ మంజూరు మరియు స్థానిక విశ్రాంత ఉద్యోగుల, పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ డివిజనల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రైల్వే స్టేడియాన్ని క్రీడాకారులను అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఆటో డ్రైవర్లను రుసుంల పేరుతో వేధించవద్దని ఇలా 9 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చీఫ్ విప్ ఎంపీ తో కలిసి అందజేసారు.
Post A Comment: