ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్ లో వరంగల్ మండలానికి చెందిన 197 మంది కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు,35 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు మంజూరైన 2,13,03052/- విలువ చేసే చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అందజేశారు.
వరంగల్ మండలానికి చెందిన కార్పోరేటర్లు, ముఖ్యనాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడభిడ్డల పెళ్ళిల్లకు అన్న వలె గొప్పసాయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారన్నారు. ఆడబిడ్డల పెళ్ళి పేదింట భారం కావద్దనే పెద్దమనుసుతో లక్షరూపాయల సాయం అందిస్తున్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్బుతంగా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందుతున్నాయన్నారు..నియోజకవర్గంలో అద్బుతంగా అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు.
Post A Comment: