ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అక్టోబర్ 16వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ టి.ఎస్.పి.ఎస్.సి కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నీ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి వసతి, విద్యుత్, మరగుదొడ్ల సౌకర్యంతో పాటు ఇతర అన్ని వసతులు కల్పించాలి అని అన్నారు.లైజన్ ఆఫీసర్లు, సహాయ లైజన్ ఆఫీసర్లను నియమించాలని అన్నారు.
పరీక్షల నిర్వహనకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాలలో
21024, మంది విద్యార్థులు హాజరు కానున్నారు అని అన్నారు.
లైజన్ అధికారులను నియమిచామని, పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ పరిపాలన అధికారి, కిరణ్ ప్రకాశ్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: