చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీలో మంగళవారం బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ ఆడడం కోసం బిజెపి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సుజీ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ. కోలాటాలతో కోలాహలంగా బతుకమ్మ ఆడారు. అనంతరం కోమటిరెడ్డి లక్ష్మీ మాట్లాడుతూ చౌటుప్పల్ లో తను ఇంతమంది మహిళలతో బతుకమ్మ ఆడడం తనకి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బతుకమ్మ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Post A Comment: