ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టి ప్రకటన చేస్తున్న సందర్బంగా వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి వద్ద తెల్లవారుజామున తన సతీమణి వాణి, కుమారులు లోకేష్ పటేల్, మన్ ప్రీత్ పటేల్ లతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబం పేరున అర్చన చేయించారు.
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ఈ గొప్ప అడుగు విజయవంతం అవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశం ప్రగతి బాటలో పయనించాలని ఆ అమ్మవారును కోరుకున్నట్టు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
Post A Comment: