ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పెద్ద ఎత్తున కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పంపిణీ చేశారు.
దేశం గర్వించేవిధంగా తెలంగాణ సంక్షేమఫలాలు, పేద ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి అని
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్దిపొందిన 512 మంది లబ్దిదారులకు 4,75,10,552/- రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు, అధికారులు, ముఖ్య నాయకులతో కలిసి అందజేసారు.
వరంగల్ రాజశ్రీ గార్డెన్ లో ఖిలా వరంగల్ మండలానికి చెందిన 250 మంది కళ్యాణలక్ష్మి ద్వారా 2,50,29000/- రూపాయల విలువ చేసే చెక్కులు మరియు 30 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన 11,78,500/- రూపాయల విలువ చేసే చెక్కులు మొత్తంగా 2,62,07500/- రూపాయల విలువ చేసే 280 చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే నరేందర్ అందజేసారు.
వరంగల్ మండలానికి సంబంధించి చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్ లో 195 మంది కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు మంజూరైన 1,97,22052/- రూపాయల విలువ చేసే చెక్కులను మరియు 35 మంది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 15,81000/- రూపాయల విలువ చేసే చెక్కులు మొత్తంగా 2,13,03052/- రూపాయల విలువ చేసే 233 చెక్కులను ఎమ్మెల్యే నరేందర్ లబ్దిదారులకు అందజేసారు.
ఒకే సారి భారీ సంఖ్యలో నియోజకవర్గంలోని పేదలకు, మహిళలకు లబ్ది జరిగింది.512 మంది లబ్దిదారులకు 4,75,10,552/ రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే నరేందర్ వారికి అందజేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్ళిల్లకు ఒక అన్న వలె గొప్పసాయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారన్నారు.ఆడబిడ్డల పెళ్ళి పేదింట భారం కావద్దనే పెద్దమనుసుతో లక్షరూపాయల సాయం అందిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్బుతంగా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ది వరంగల్ లో జరుగుతుందన్నారు. సుందరమైన రోడ్లు, కాలువలు, అండర్ గ్రౌండ్ డక్ట్ ల నిర్మాణం, సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, మోడల్ మార్కెట్, జిల్లా కేంద్రం, ఇలా అనేక గొప్ప పనులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కే.టీ.ఆర్ నేతృత్వంలో మరింత అభివృద్ది చేపడుతామన్నారు.
Post A Comment: