కాటారం: ప్రజా పాలనలో భాగంగా స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలుర కళాశాలలో హ్యాండ్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను సోమవారం ప్రారంభించారు. ఈ క్యాంప్ ఈనెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సోమోజీ ప్రారంభించగా, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ కె. కల్పన , కుడిమేత మహేందర్ , పీటీ మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రజనీకాంత్ మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Post A Comment: